Friday 30 March 2012

ముప్పైఏళ్ళ పార్టీని చుట్టుముట్టిన ముళ్ళకంచెలు



టిడిపి ఆవిర్భవించి ముప్పై ఏళ్ళు పూర్తయ్యాయి. కానీ ఈ వేడుకలు తెలుగు తమ్ములు సంతోషంగా జరుపుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే టిడిపి  సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి... పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఇదో అద్భుతం అనేవాళ్ళు లేకపోలేదు.అది వేరేసంగతి ! కానీ అన్న స్థాపించిన టిడిపికి బాబు టిడిపికి చాలా తేడా ఉన్నది . ఎందుకంటే చంద్రబాబు యిప్పుడు ఆ పార్టీని కార్పొరేటే సంస్థగా మార్చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే ఆ పార్టీలో యిప్పుడు ఆ పదమే పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి కారణం చంద్రబాబే. ప్రజలు రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఆయన వైఖరిలో మార్పు రాలేదు. వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు కూడా భావించడం లేదు. ప్రస్తుతం  రాష్ట్రంలో ఆ పరిస్థితి ఏమిటో వారికి అర్థం కాకపోవడమే ఇందుకు కారణం.ఎందుకంటే మొన్నఎన్నికలపై బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. బాబు అంత నిర్వేదంలో ఉన్నారో అర్థమవుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికలను ఎదుర్కోవడానికి అయన పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. తొమ్మిదేళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధిని... ఆంధ్ర హజారే లాగా అవినీతిపై తను చేస్తున్న యుద్ధాన్ని కూడా ప్రజలు గుర్తించడం లేదనేదే బాబు గారి బాధకు కారణం అయి ఉంటుంది. ఏం చేస్తాం బాబు ఏ పోరాటం చేసిన ఏదో ఆశించి చేస్తాడు కనుక (అన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తాయి).. అదీ ఏదీ ఎక్కువ కాలం చేయరు. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాబు ఏమి చేసిన (బాబు గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రిగా తాను నెలకొల్పిన రికార్డు గురించి) తన హయంలో జరిగిన తప్పులే ప్రజలకు టక్కున ప్రజలకు గుర్తుకొస్తుంటాయి మరి.తాను మారాను మహా ప్రభో అని గొంతెత్తి నినదీస్తున్నా.. ఎవరూ నమ్మడంలేదు. దీనిపై బాబు సమీక్ష కూడా చేయరాయే.. ఎందుకంటే ఆయన తన చుట్టూ పెట్టుకున్న భజన పరులు వచ్చే ఎన్నికల్లో టిడిపిదే గెలుపు.. బాబు గారే సిఎం అని గొప్పలు చెబుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే... పార్టీ ముప్పై ఏళ్ళు పూర్తైన సందర్భంగా.. పార్టీ ప్రస్తుత పరిస్థితిపై  నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు .. ఎవరిని ఉద్దేశించి చేశారో వేరే చెప్పనక్కర లేదు..అందుకే టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందా...? రాదా అనే చర్చల కంటే ఆ పార్టీ మనుగడపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. దీనికి కూడా బాబు గారి ముందు చూపే కారణం కావచ్చు. టిడిపి కాపాడుకోవడానికి తాను ముందుకు తెచ్చిన రెండుకళ్ళ సిద్ధాంతం యిప్పుడు ...ఆ పార్టీలోని సంక్షోభానికి కారణం. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం సంగతి అటుంచి .. రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది అ పార్టీ. అందుకే మూడు దశాబ్దాల పార్టీని అనేక సమస్యలు చుట్టు ముట్టాయి. గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో దాదాపు ఇరవై శాసనసభ స్థానాలకు.. ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానాన్ని గెలుచుకోలేక పోగా చాలాచోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు..ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చాలాచోట్ల మూడో స్థానంలోకి దిగజారిపోయింది. ఇదీ కార్యకర్తలనే కాదు బాబును కూడా నైరాశ్యంలోకి నెట్టింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే. ఒక సారి కాకపోయినా మరోసారి అయినా ..ప్రధాన ప్రతిపక్షం తన సత్తా చాటాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ పని తీరు ఎలాఉందో అందరికీ తెలిసిందే..అయినా టిడిపి పుంజు కోవడం లేదు ఎందుకని? ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టడంలో .. వ్యూహాలు పన్నడంలో బాబు ముందుంటారని ఆయనకు పేరు కూడా ఉన్నది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు దశాబాల్లో దాదాపు పదిహేడేళ్ళ పాటు అధికారంలో ఉండడం మామూలు విషయం కాదు. ఇన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టిడిపిని ప్రజలు ఎందుకు ఆదరించడం లేదు. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసి..ఐ టీ నెత్తిన పెట్టుకొని .. బిల్ గేట్స్ .. బిల్ క్లింటన్ల ప్రశంశలు అందుకున్న బాబు ... ఏడేళ్ళుగా ప్రజల మెప్పు మాత్రం పొందలేకపోతున్నాడు.దీనికంతటికి కారణం ఒక్కటే .. అదే తెలంగాణ. టిడిపికి బలమైన క్యాడర్ ఉన్నదంటే (సీమాంధ్ర కంటే కూడా ) అది తెలంగాణలోనే .యిప్పుడు తెలంగాణాలో ఆ పార్టీ మునిగిపోతున్న నావా వలె తయారయ్యింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని మహా కూటమి పెట్టి .. తరువాత మాట మార్చి .. యిప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో బాబు ద్రోహిగా మిగిలిపోయాడు. ఒకప్పుడు తెలంగాణాలో టిడిపికి కంచుకోటలుగా ఉన్న స్థానలన్ని కూలి పోతున్నాయి. క్యాడర్ కూడా చెల్లా చెదురైంది. నిజానికి బాబు చెబుతున్నట్టు తెలంగాణ పై తేల్చాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీయే . కానీ ప్రధాన ప్రతిపక్షం అవలంబిస్తున్న ద్వంద్వ విధానం వల్లే తాము తెలంగాణ పై ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నాము అని చెప్పగలుగుతున్నది, ఒకవేళ చంద్రబాబు గతంలో తెలంగాణ కు  అనుకూలంగా  ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చినట్టే .. యిప్పుడు కూడా కేంద్రానికి లేఖ రాస్తే ... ఈ సమస్య కాంగ్రెస్ కోర్టులోకి వెళ్ళేది. బాబు భారం కొంత దిగేది. కానీ బాబు అలా చేయకుండా.. రెండు కళ్ళ సిద్ధాంతం రాద్ధాంతం చేస్తుండడం వల్లే ఈ సమస్య ఇంతా జటిలం అయ్యింది. దాదాపు ఎనిమిది వందలకు పైగా మంది బలిదానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కాదు.. బాబు విధానాలు కూడా కారణమని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్టీల్లో  సమస్యలు ఉండడం సహజమే. కానీ వాటిని అధిగమించాలంటే.. వాటిపై సమీక్ష జరగాలె.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవలె. అప్పుడే ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం ఏర్పడుతుంది.. కానీ బాబు వలె సమస్యను తన కనుసన్నల్లో దాచి .. ఆ పార్టీ నాయకులను.. కార్యకర్తలను నియంత్రించగలరేమో కానీ... ప్రజలను శాసించలేరు. అది బాబు గుర్తించనంత కాలం.. అ పార్టీది మొన్నటి దాకా రెండో స్థానం.. నేడు మూడో స్థానం.. రేపటి సంగతి....?
-రాజు ఆసరి

Labels:

Wednesday 28 March 2012

kalisi nadisthe kalam manade



Labels:

Sunday 25 March 2012

ప్రజల అవస్తలే పాలకుల అభివృద్ధి!



భారత దేశంలో  ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం  2005 నాటికి 41.6 శాతం మంది దారిద్ర్య రేఖ కు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. 2010 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రకారం 37.2 శాతం దారిద్ర్య రేఖ కు దిగువన ఉన్నారు. ఈ రెండు నివేదికల ప్రకారం 2005-2010 మధ్యకాలంలో మన దేశంలో పేదరికం తగ్గింది దాదాపు నాలుగు శాతమే! కానీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అహ్లువాలియా మాత్రం రోజుకు ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టే వారంతా పేదలు కారని తేల్చేశారు. అయన లెక్కప్రకారం రోజుకు రెండు సార్లు టీ తాగి.. ఒక కర్రితో ఒక్క పూట భోజనం చేసేవాళ్ళంతా ధనికులే. అహ్లువాలియా లెక్కల ప్రకారం దేశంలో పేదరికం లేనే లేదు. బ్యూరోక్రాట్లు ఈ దేశాన్ని ఏలితే ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎలా ఉన్నా... పాలకుల పట్టికలో మాత్రం మెరుగ్గానే కనిపిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఈ దేశంలో ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. మెరుగైన విద్య, వైద్యం లేక అక్షరాస్యతలో, ఆరోగ్యంలో ప్రపంచంలో చిన్న దేశాల కంటే వెనుకబడే ఉన్నారు. 187 దేశాలాలోని మానవాభివృద్ధిలో మన దేశ స్థానం 134. ప్రజల అవస్తలు పాలకులకు అభివృద్ధిగా ఎందుకు కనిపిస్తున్నది? ఎవరి మెప్పు కోసం మన దేశం సుభిక్షంగా ఉందని మన విధానకర్తలు ప్రకటిస్తున్నారు? ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలు మెల్లగా మన పాలకులు  దేశంలో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజా సంక్షేమాన్ని సందుగలో పెట్టి తాళం వేస్తున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలు తలుపులు తెరిచే చర్యలు ఇప్పటికే  ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యాన్ని కార్పోరేట్ ఆస్పత్రులకు కట్ట బెట్టారు. అణు ఒప్పందం పేరుతో ఈ దేశ సార్వబౌమత్వాన్ని అమెరికా కాళ్ళ దగ్గర పెట్టింది మన్మోహన్ ప్రభుత్వం. దాదాపు నాలుగు లక్షల ఎంవోయులు కుదుర్చుకుని అటవీ ప్రాంతాలలోని సహజ వనరులను బహుళజాతీ సంస్థలకు అప్పజెప్పింది.ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న అడవిబిద్దాలను ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అంతమొందిస్తున్నది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ...దాన్ని నిలదీస్తున్న ప్రజలను, ప్రజా సంఘాలను అణచివేస్తూ అదే దేశం సాధించిన అభివృద్ధి అహ్లువాలియా ప్రకటిస్తున్నారేమో! అభివృద్ధి అంటే వందకోట్ల మంది భారతీయులది కాదు, పాతిక మంది బడా పెట్టుబడి దారులదని పాలకుల ప్రగాడ విశ్వాసం. అందుకే గోదాంలలో ముక్కిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన కుదరదు అని చెప్పిన ప్రధాని మన్మోహన్ దివాలా దీస్తున్న కంపెనీలకు మాత్రం బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నారు. అందుకే మిత్రులారా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటున్న భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదాన్ని సవరించి చదువుకోవాలి . వచ్చే ఏడాది విద్యార్థుల పుస్తకాల పునర్ ముద్రణలో ఈ మార్పు చేస్తే, మనం బాధపడుతుంటే పాలకులు మురిసిపోతారు. వాళ్ళ సంతోషం కోసమైనా కొంతకాలం మన సమస్యలను పక్కన పెడదాం!

--
rajuasari@gmail.com


మధ్యంతర సంకేతాలు ..



అవినీతి కుంభ కోణాలతో సతమతమవుతున్న యూపీఏ -2 ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి తనయుడు అఖిలేష్ ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించి కేంద్రంపై కన్నేశారు ములాయం. అందుకే తనయుడికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎందుకంటే దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇరవై రెండు స్థానాలు చేజిక్కించుకున్న ఎస్పీ ఈసారి దాన్ని యాబైకి పెంచాలని చూస్తున్నది. అప్పడు కేంద్రంలో చక్రం తిప్పవచ్చని ములాయం భావిస్తున్నారు. అందుకోసం తన క్యాడర్ ను సన్నద్ధం చేసే పనిలో మునిగిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్న యూపీఏ -2  రోజుకో అవినీతి కుంభ కోణం వెలుగులోకి వస్తున్నది. మొన్నటిదాకా టూ జీ, కామన్ వెల్త్, ఎస్ బ్యాండ్ లతో పాటు తాజాగా బొగ్గు కుంభకోణం మన్మోహన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దేశవ్యాప్తంగా అవినితీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈ కుంభకోణాలు మన్మోహన్ సర్కారు ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టక పోగా.. భాగస్వామ్య పక్షాలతోనే కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ  భావించే భావి ప్రధాని రాహుల్ మొదలు ప్రస్తుత ప్రధాని వరకు తమ తప్పులను మిత్ర పక్శాలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది యూపీఏ మిత్రపక్షాలకు మింగుడు పడడం లేదు. శరద్ పవార్ వంటి నేతలు ఇప్పటికే ఈ విషయంపై ప్రధానిని నిలదీశారు కూడా. రైల్వే బడ్జెట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు తృణమూల్, కాంగ్రెస్ పార్టీలకు మధ్య పెద్ద అగాధాన్ని పెంచాయి. అయితే పెంచిన రైల్వే చార్జీల తగ్గింపు, రైల్వే మంత్రి మార్పుతో ఆ వివాదం కొంత సద్దుమణిగింది. కానీ దిదీ కూడా అదను చూసి యూపీఏ నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. అలాగే ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు  కూడా కేంద్ర ప్రభుత్వ మనుగడపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న యూపీలో దెబ్బతినడం.. గత ఎన్నికల్లో ముప్పై మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి  ఏపీ అందించింది. ఇప్పడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ   తెలంగాణ సమస్య వల్ల కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.మొత్తానికి దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ వస్తున్నది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. బీజే పీ పరిస్థితి అలానే ఉన్నది. దీంతో మళ్లీ తృతీయ ఫ్రంట్ తెరపైకి వస్తున్నది. అందుకే కొడుకుకు యూపీ బాధ్యతలు అప్పగించి మొన్నటి అసెంబ్లీలో సాధించిన ఊపుతో గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలిస్తే ప్రధాని పదవిని చేపట్టవచ్చు అని ములాయం భావిస్తున్నట్టు ఉన్నది. యూపీ ఏ కు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ ప్రభుత్వంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోరిన ములాయం తిరస్కరించారు. ఢిల్లీ పీఠంపై కన్నేసిన ములాయం అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. దేశంలో దశాబ్దంన్నర కాలంగా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. గురి కుదిరితే కాంగ్రెస్ లేదా బిజేపీ మద్దతుతో ప్రధాని పదవిని చేపట్టాలని ములాయం, మాయావతి, నితీశ్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యంతరం మాట అసలే తలెత్తదు అని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నా తాజాగా ములాయం చేసిన వ్యాఖ్యలు లోక్ సభకు  ఏడాదికి ముందే ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
rajuasari@gmail.com

Saturday 24 March 2012

నాయక్ బలిదానానికి బాధ్యత ఎవరిది?


రెండేళ్లలో వరుసగా మూడు సార్లు జరిగిన ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఇంకా కాంగ్రెస్, టిడిపి నేతలకు బుద్ధి రాలేదు. రాదు కూడా. అందులో తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలకు అసలే లేదు. కట్టి శత్రువుదైనా పొడిచేది మనోడే. అందుకే తెలంగాణ రావాలంటే ముందు ఇంటి దొంగలను తరిమి కొట్టలే. నిత్యం తాను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకునే రేణుకమ్మ తెలంగాణకు ఇన్ స్టంట్ కాఫీ కాదని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నది. గండ్ర వెంకటరమణ రెడ్డ్డి తెలంగాణ వాదం తగ్గిపోయిందని చెబుతున్నాడు.పదవుల కోసం ప్రజల ఆకాంక్షను తాకట్టు ఇలాంటి బానిస నాయకత్వం వల్లే తెలంగాణాలో బలిదానాలు జరిగాయి. జరుతున్నాయి. అలేగే మొన్నటిదాక చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడి ఉద్యమం పై ఇష్టం వచ్చినట్టు మొరిగిన మోత్కుపల్లి, పాలకుర్తికి బాబును పట్టుకొచ్చి తెలంగాణ ప్రజల రక్తాన్ని చూసిన ఎర్రబెల్లిలకు ఉప ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లు మనిపించినా సిగ్గు రాలేదు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత  ఈ ఇరు పార్టీల నేతల వింత వాదనలే  భోజ్యానాయక్ ఆత్మాహుతికి దారి తీశాయి. చేతగాని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల కళ్ళ కింద పనిచేస్తూ.. కళ్ళు తాగిన కోతులవలె వ్యవహరిస్తున్నారు వీరు. శ్రీకాంత్ చారి బలిదానంతో మొదలు భోజ్యానాయక్ వరకు ఈ రెండు పార్టీల వైఖరే ప్రధాన కారణం. గత కొంత కాలంగా బలిదానాలు వద్దు.. బతికి సాధిద్దాం అని  ప్రజాసంఘాల నేతలు, ఉద్యమ నాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఆత్మహత్యలు ఆగిపోయాయి. వందలాది మంది బలిదానాలను బాటగా చేసుకుని పదవులు సంపాదిస్తున్నారు ఈ టిడిపి, కాంగ్రెస్ నేతలు. అందులో డి ఎస్ నుంచి గండ్ర, జగ్గారెడ్డి, రేవూరి, ఎర్రబెల్లి , దేవేందర్, రేణుక దాక అలా సంపాదించిన వారే! ఇవ్వాళ వీరే తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర నేతల దగ్గర తాకట్టు పెట్టి, పదవులు తెచ్చుకుంటున్నారు. ఏ వెలుగులకు ఈ ప్రస్తానమో అర్థం కావడం లేదు. ఒకవైపు ఓటమిని అంగీకరిస్తూనే మరోవైపు ఉద్యమం బలహీన పడిందని, సీనియర్ల వైఖరి పార్టీకి చేటు తెస్తున్నదని అరుస్తున్నది  అరుణ. ఈమె మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి అభివృద్ధి అని ఎంత అరిచిన ప్రజలు ఆదరించలేదు. అయినా వాస్తవాలు తెలుసుకోకుండా చిత్తూరు బాబు అడుగులకు మడుగులోత్తుతున్నారు. ఇదీ మన తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిభ. వీళ్ళే ఇచ్చేది, తెచ్చేది. అందుకే వీరు తెలంగాణ పై  ఎన్నిచెప్పినా ప్రజలు నమ్మడం లేదు. నమ్మరు కూడా. కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇక తెలంగాణ టిడిపి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో టి టిడిపి లేనే లేదు, ఉండదు కూడా. ప్రజలు ఉండనివ్వరు కూడా. ఈ పాములకు పాలు పోసిన విషయాన్నే చిమ్ముతున్నాయి. అందుకే తెలంగాణలో టిడిపి పని అయిపోయింది. తెలంగాణ కోసం పార్టీ పెట్టి మూడు నెలల్లోనే మూసేసిన దేవేందర్ కు రాజ్యసభ పట్టం కట్టారు అంటేనే తెలంగాణ పై బాబు వైఖరి ఏమిటో అర్థమవుతున్నది. దేవేందర్ పార్టీని వీడి బయిటికి పోయాక అయన అల్లుడు అరవింద్ తో దేవేందర్ పై చేయించిన మాటలు తెలంగాణ ప్రజానీకం మరిచిపోలేదు. అవసరానికి అరవింద్ వంటి నేతలను వాడుకొని యిప్పుడు అదే దేవేందర్ కు ప్రమోషన్ ఇచ్చి పదవి కట్టబెట్టారు. ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని టి టిడిపి నేతలు గ్రహించక పొతే...చేసేది ఏమి ఉండదు. ఎవరో ఒకరు బలిదానం చేసిన తరువాత టి వీలలో చర్చలు పెడుతున్న సీమాంధ్ర మీడియా కూడా ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదానికి ప్రజలు పట్టం కట్టినా.. దాన్ని వదిలి పెట్టి కాంగ్రెస్, టిడిపి లకు గతంలో కంటే ఓట్ల శాతం పెరిగిందని.. మహబూబ్ నగర్లో టి అరె ఎస్ ఓటమి పై రేఅజకీ నేతల వలె విశ్లేషణలు చేస్తున్నాయి. ఇవి కూడా భోజ్యా నాయక్ ఆత్మాహుతికి కారణమయ్యాయి. ఏపీ లో మీడియా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రతిబింబాల్సింది పోయి పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఒక ప్రాంతం పై ఎంత వివక్ష చూపుతున్నారో అంత కంటే ఎక్కువ సీమాంధ్ర చూపుతున్నది. ఇంత చేస్తూ మళ్లీ ఈ మీడియా నే విలువల గురించి మాట్లాడడమే ఇక్కడి విషాదం. కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు. ఈ ప్రాంత కాంగ్రెస్  నేతల్లో తెలంగాణ తెచ్చే వాడు లేడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి తెలంగాణ ఇవ్వాలనుకున్నా కుప్పం కుట్ర దారుడు చంద్రబాబు అందుకు అంగీకరించడు. అందుకే మనకు ఉన్నది రెండే దారులు. ఒకటి బరిగీసి పోరాటంలో నిలవడం. రెండు కాంగ్రెస్, టిడిపి లను ఈ ప్రాంతంలో భూస్తాపితం చేయడం. అప్పడే ఈ ప్రాంత విముక్తి సాధ్యమవుతుంది.నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. బలిదానాలు వద్దు .. బతికి సాధించాలే ... జై తెలంగాణ ...
-రాజు ఆసరి
--
rajuasari@gmail.com


Labels:

Friday 23 March 2012

ఇక ఆ'నందన' నామ సంవత్సరమే..



పుస్తకం పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. అనుభవం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది.తెలంగాణ ఉద్యమ్యానికి రెండోది సరిగ్గా సరిపోతుంది. శ్రీ ఖర నామ సంవత్సరంలో చేదు గులికలో తీపి గురుతులో ఎవైతేనేమి తెలంగాణ ప్రజానీకం  ఆ రెంటినీ చూసింది. అణచివేత నుంచి విప్లవాలు పుడుతాయని మిలియన్ మార్చ్ ద్వారా ప్రపంచానికి చూపెట్టింది. సంఘటితం అయితే ఐక్యత సాధ్యమే అని సకల జనుల సమ్మె నిరూపించింది. ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే గడిచిన రెండున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంత చైతన్య వంతులయ్యరో ... తెలంగాణ ఉద్యమం దేశంలోని ఎన్ని ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదో చెప్పడానికే. ఉద్యమాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలనే నియమమేది లేదు. సందర్భాలను బట్టి వాటి స్వరూపం మారుతూ ఉంటుంది. అందుకే ఏదీ ఏమైనా గమ్యాన్ని ముద్దడడానికి తమది ఒకటే నినాదమని ఎన్నికల ఫలితాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. వాటిపై ఎవరి విశ్లేషణలు వారివే కావచ్చు. కానీ అందులో సీమాంధ్ర మీడియా ఆంతర్యం మాత్రం ఒక్కటే. కోడి గుడ్డుపై ఈకలు పీకడం. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, టిడిపిలకు గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగిందనే చర్చలే చేస్తున్నాయి.అందరూ జై తెలంగాణ నినాదం తోనే పోటీ చేశారనే వాస్తవాన్ని తోక్కిపెడుతున్నాయి. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల స్థానాలన్నీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ లవే అనే విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రోజు మీడియా లో చర్చల సమయంలో రాష్ట్రంలో ఈ సంధిగ్తత ఎప్పుడు తొలుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు కానీ దానికి కారకులు ఎవరో చెప్పడం లేదు. ఎంత సేపు మా చానల్ ఏ పార్టీకి కొమ్ము కాయదు అని చేబుతాయే కానీ ఆచరణలో మాత్రం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే వాటి ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ప్రజలు వాటి నుంచి ఏమి ఆశించడం లేదు. వాస్తవాలను చెప్పాలనే కోరుతున్నాయి. ఎందుకంటే మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై ఒంటి కాలుపై లేచిన మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి నేతలు ఉప ఎన్నికల తరువాత కనబడడం లేదు.దీన్ని సీమాంధ్ర మీడియా ప్రసారం చేయదు. అదే కెసిఆర్ రెండు రోజులు కనబడక పొతే కెసిఆర్ ఎక్కడ అని హెడ్డింగులు పెడుతాయి. ఇదీ ఆయా చానళ్ళ ద్వంద్వ నీతి! అందుకే  చంద్రబాబు మెప్పు కోసం చిల్లర మాటలు మాట్లాడిన వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.ప్రజాభిప్రాయానికి విలువివ్వని వీళ్ళకు ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ పేటెంట్ హక్కు అని వారు చెప్పుకోలేదు.ప్రజలు అలా భావించడం లేదు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది సీమాంధ్ర నేతలు.. వారి మీడియా మాత్రమే. ఎందుకంటే కెసిఆర్ ఉద్యమం చేయడం మానేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదు అనేది వారి భ్రమ! కానీ వాస్తవం అది కాదు. దశాబ్ద కాలంగా ఉద్యమాని గల్లి నుంచి ఢిల్లీ దాకా తీసుకపోయిన ఘనత  టిఆర్ఎస్ పార్టీదే. కేంద్రంలో ముప్పై నాలుగు పార్టీల మద్దతు కూడగట్టడం లో ఆ పార్టీ.. కెసిఆర్ చేసిన కృషి ఫలితమే ఇవ్వాళ ఏ పార్టీ అయినా నై తెలంగాణ అనలేకపోతున్నాయి. యిప్పుడు తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నది. ఇక 'రాజీ'నామ డ్రామాలు ఉండవు. పదవుల కోసం వంచన ఉండదు. రాజీ లేని పోరాటమే ఉంటది. అది స్వరాష్ట్ర సాధన లక్ష్యంగానే సాగుతది. అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు ఆ'నందన' నామ సంవత్సరమే.
-అసరి

Thursday 22 March 2012

ఇక ఆ'నందన' నామ సంవత్సరమే..



పుస్తకం పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. అనుభవం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది.తెలంగాణ ఉద్యమ్యానికి రెండోది సరిగ్గా సరిపోతుంది. శ్రీ ఖర నామ సంవత్సరంలో చేదు గులికలో తీపి గురుతులో ఎవైతేనేమి తెలంగాణ ప్రజానీకం  ఆ రెంటినీ చూసింది. అణచివేత నుంచి విప్లవాలు పుడుతాయని మిలియన్ మార్చ్ ద్వారా ప్రపంచానికి చూపెట్టింది. సంఘటితం అయితే ఐక్యత సాధ్యమే అని సకల జనుల సమ్మె నిరూపించింది. ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే గడిచిన రెండున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంత చైతన్య వంతులయ్యరో ... తెలంగాణ ఉద్యమం దేశంలోని ఎన్ని ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదో చెప్పడానికే. ఉద్యమాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలనే నియమమేది లేదు. సందర్భాలను బట్టి వాటి స్వరూపం మారుతూ ఉంటుంది. అందుకే ఏదీ ఏమైనా గమ్యాన్ని ముద్దడడానికి తమది ఒకటే నినాదమని ఎన్నికల ఫలితాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. వాటిపై ఎవరి విశ్లేషణలు వారివే కావచ్చు. కానీ అందులో సీమాంధ్ర మీడియా ఆంతర్యం మాత్రం ఒక్కటే. కోడి గుడ్డుపై ఈకలు పీకడం. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, టిడిపిలకు గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరిగిందనే చర్చలే చేస్తున్నాయి.అందరూ జై తెలంగాణ నినాదం తోనే పోటీ చేశారనే వాస్తవాన్ని తోక్కిపెడుతున్నాయి. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల స్థానాలన్నీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ లవే అనే విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రోజు మీడియా లో చర్చల సమయంలో రాష్ట్రంలో ఈ సంధిగ్తత ఎప్పుడు తొలుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు కానీ దానికి కారకులు ఎవరో చెప్పడం లేదు. ఎంత సేపు మా చానల్ ఏ పార్టీకి కొమ్ము కాయదు అని చేబుతాయే కానీ ఆచరణలో మాత్రం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే వాటి ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ప్రజలు వాటి నుంచి ఏమి ఆశించడం లేదు. వాస్తవాలను చెప్పాలనే కోరుతున్నాయి. ఎందుకంటే మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై ఒంటి కాలుపై లేచిన మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి నేతలు ఉప ఎన్నికల తరువాత కనబడడం లేదు.దీన్ని సీమాంధ్ర మీడియా ప్రసారం చేయదు. అదే కెసిఆర్ రెండు రోజులు కనబడక పొతే కెసిఆర్ ఎక్కడ అని హెడ్డింగులు పెడుతాయి. ఇదీ ఆయా చానళ్ళ ద్వంద్వ నీతి! అందుకే  చంద్రబాబు మెప్పు కోసం చిల్లర మాటలు మాట్లాడిన వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.ప్రజాభిప్రాయానికి విలువివ్వని వీళ్ళకు ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ పేటెంట్ హక్కు అని వారు చెప్పుకోలేదు.ప్రజలు అలా భావించడం లేదు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది సీమాంధ్ర నేతలు.. వారి మీడియా మాత్రమే. ఎందుకంటే కెసిఆర్ ఉద్యమం చేయడం మానేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదు అనేది వారి భ్రమ! కానీ వాస్తవం అది కాదు. దశాబ్ద కాలంగా ఉద్యమాని గల్లి నుంచి ఢిల్లీ దాకా తీసుకపోయిన ఘనత  టిఆర్ఎస్ పార్టీదే. కేంద్రంలో ముప్పై నాలుగు పార్టీల మద్దతు కూడగట్టడం లో ఆ పార్టీ.. కెసిఆర్ చేసిన కృషి ఫలితమే ఇవ్వాళ ఏ పార్టీ అయినా నై తెలంగాణ అనలేకపోతున్నాయి. యిప్పుడు తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నది. ఇక 'రాజీ'నామ డ్రామాలు ఉండవు. పదవుల కోసం వంచన ఉండదు. రాజీ లేని పోరాటమే ఉంటది. అది స్వరాష్ట్ర సాధన లక్ష్యంగానే సాగుతది. అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు ఆ'నందన' నామ సంవత్సరమే.
-అసరి

Labels:

వాదం గెలిచినచోట వితండవాదనలేల!


ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటో ప్రపంచానికి తెలియజేశాయి. తెలంగాణాలో జరిగిన ఆరు స్థానాల్లో సీమాంధ్ర పార్టీలకు చోటు దక్కలేదు. అయితే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు కాంగ్రెస్, టిడిపిలు వ్యవహరిస్తున్నాయి. మహబూబ్ నగర్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడాన్ని బూచిగా చూపెట్టి తప్పుకోవాలని చూస్తున్నాయి.అక్కడ బిజెపి అభ్యర్థి గెలిచినా టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఓడింది మాత్రం సమైక్యవాదమే! ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత ఈ ప్రాంతంలో ఇప్పటి ఎన్నికలతో కలిపి మూడు సార్లు తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయినా ఈ చిత్తూరు బాబులకు సోయి రావడం లేదు. ఇంకా ఈ ఫలితాలపై వింత వాదనలు చేస్తున్నారు. టిఆర్ఎస్ కు గతంలో కంటే మెజారిటీ తగ్గింది అని ఒకరు..ఈ మ్యాచ్ ఓడిపోతే మరో మ్యాచ్ లో గెలుస్తామని మరొకరు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఒక్క కాంగ్రెస్, టిడిపి లకే కాదు .. కాలం చెల్లిన భాష ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంత చెబుతున్న సిపిఎం కు.. కోవూరులో గెలిచామని సంబరపడుతున్న వైఎస్ఆర్ సిపికి కూడా హెచ్చరికలే. ఎందుకంటే త్వరలో జరగబోయే మరో పద్దెనిమిది స్థానాల ఉప ఎన్నికల్లో తెలంగాణాలో కూడా ఒక స్థానం ఉన్నది. చంద్రబాబు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని గొంతుపోయేలా అరిచినా ప్రజలు విశ్వసించలేదు. అందుకే రేపు జగన్ కూడా పరకాల ప్రచారంలో బాబు పాటే పాడుతనంటే బాబుకు పట్టిన గతే పడుతుంది. అలాగే బిజెపి కూడా మహబూబ్ నగర్ ఫలితాన్ని చూసి...ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర విభజన కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని గ్రహించలే.  రేపు జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ సీమాంధ్ర లో జై ఆంధ్ర నినాదంతో పోటీ చేయాలి. ఆ పార్టీ జాతీయ నేతలంతా రాష్ట్ర విభజన ఆవశ్యకతను ఆ ప్రాంత ప్రజలకు తెలియచెప్పాలి. మంత్రి టిజి వెంకటేష్, ఆనం వివేకానంద వంటి నేతలు  కోవూరులో వైఎస్ఆర్ సిపి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు వేసినట్టే అవుతుందని ప్రచారం చేశారు. అయినా అక్కడి ప్రజలు ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించారు. అంటే రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజానీకం కూడా సంసిద్ధంగా ఉన్నదని అర్థమవుతున్నది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రి డిఎల్ కూడా తెలంగాణపై తేల్చాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటికే హర్షకుమార్, బొత్స వంటి నేతలు తెలంగాణకు జై కొట్టారు. ఆ ప్రాంతం లోన్ బడుగు బలహీన వర్గాల వారుకూడా రాష్ట్ర విభజన కావాలని కోరుకుంటున్నారు. ఇంకా కొన్ని సంఘాలు జై ఆంధ్ర కోసం పనిచేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ రాజకీయ ఐకా స అన్ని  వర్గాలను ఏకం చేసినట్టే .. అక్కడ కూడా విభజన  కోరుకునే వారందరిని బిజెపి ఏకం చేయాల్సిన బాధ్యత ఉన్నది.  కాబట్టి బిజెపికి ఇదోక మంచి అవకాశం. గతంలో ఆ పార్టీ చేసినా కాకినాడ తీర్మానానికి అనుగుణంగా వచ్చే ఉప ఎన్నికల్లో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు నినాదం తో పోటీ చేయాలి. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతానికి అనవసరం. కానీ ఆ పార్టీ అక్కడ ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటే ఈ పెట్టుబడిదారుల నోళ్ళు మూయించవచ్చు. మెజారిటీ ప్రజలు సమైక్యవాదాన్నే కోరుకుంటున్నారు అంటున్న వారికి తగిన బుద్ధి చెప్పవచ్చు.ఇక కాంగ్రెస్, టిడిపి లు కూడా రెండు ప్రాంతాల్లో తమ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో చాలా తప్పులు చేస్తున్నాయి. అవి మొదటికే మోసం తెస్తాయని గుర్తించుకోవాలి. ఇవాళ కాకపోయిన రేపు అయినా రాష్ట్ర విభజన ఖాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు. సీమాంధ్ర ప్రజలు కూడా నలుగురు పెట్టుబడిదారుల మాటలు నమ్మి మోసపోకుండా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను మన్నిస్తే మంచిది. అలాగే తెలంగాణ టిడిపి, కాంగ్రెస్ నేతలు ఉద్యమ నాయకత్వం పై అవాకులు చెవాకులు మాని వారి వారి అధిష్టానాల పై ఒత్తిడి పెంచాలి. అప్పుడే వారికి రాజకీయ భద్రత ఉంటుంది. లేకపోతే శంకరగిరి మాన్యాలే దిక్కు.
--
rajuasari@gmail.com


Labels:

Friday 9 March 2012

అక్కడ సైకిల్ జోరు.. ఇక్కడ సైకిల్ బేజారు ..



ఎట్టకేలకు యూపీ ముఖ్యమంత్రి పీటముడి వీడింది. ఊహించినట్టుగానే ఎస్పీ యువనేత యూపీ పీటాన్ని అధిష్టించనున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రంగా పేరుగాంచింది. ఇప్పటివరకు అటు జాతీయ పార్టీలైన ఇటు ప్రాంతీయ పార్టీలైన యువతకు పెద్దపీట వేస్తామనడమే గానీ ఆచరణలో చూపడం లేదు. చూపవు కూడా. ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు ఆలవాలమైన మన దేశంలో పార్టీ పదవులైనా ... చట్టసభల్లో అధిక ప్రాధాన్యమైన వ్యక్తి ఆరాధనతో ముడిపడి ఉన్నది. యిప్పుడు అఖిలేష్ యాదవ్ కు కూడా ముఖ్యమంత్రి పదవి వారసత్వంగానే వచ్చింది. ఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను యూపీ ప్రజలు అంగీకరించారని అఖిలేష్ మీడియా ముందు చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండ నేరవేరుస్తామన్నారు. ఈ దేశంలో ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలన్నీ అధికారం కోసమే అన్నది విదితమే. ఆ హామీలను తుచ తప్పకుండ ఆయా పార్టీలు అమలుచేస్తాయని ప్రజలు భావించడం లేదు. కానీ అందులో కనీసం కొన్నైనా నేరవేరుస్తారని ఆశపడుతారు. అదే యిప్పుడు యూపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే మాయావతి యూపీ విభజనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అఖిలేష్ అన్నటు వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే బుందేల్ కండ్ కు రాహుల్  ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించిన అక్కడ బీఎస్పీ హవా కొనసాగింది. దీన్ని విస్మరించరాదు. అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారిలో ములాయం కూడా ఉన్నారు. మరి అక్కడ మహిళలు ఆ పార్టీ వ్యతిరేకంగా ఓట్లు వేశారా? ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి. యూపీ ఎన్నికల ఫలితాల్లో ఎస్పీకి బిఎస్పీల మధ్య ఓట్ల శాతం కేవలం మూడు శాతమే. ఎస్పీని అధికారంలోకి తీసుకురావడానికి అఖిలేష్ ఎంత శ్రమించాడో ...రాహుల్ కూడా పరోక్షంగా  ఎస్పీకి లబ్ధి చేకూర్చాడు. రాహుల్ ప్రచారం అంత మాయకు వ్యతిరేకంగానే సాగింది. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎస్పీకి లాభించాయి. ఎస్పీ విజయాన్ని ఆ రాష్ట్ర విభజనకు ముడిపెట్టడమే విడ్డూరంగా ఉన్నది. యూపీలో ఎస్పీ గెలవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కారణం కాదు. ఆ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న ముస్లిం ప్రజల ఓట్లు కూడా కీలకమే. అలాగే యువత కోసం ఎస్పీ ఇచ్చిన హామీలను జనంలో తీసుకెళ్ళి నమ్మకం వాళ్ళలో నమ్మకం కలిగించడంలో సఫలమయ్యాడు. ముస్లిం ఓట్ల కోసం కాంగెస్ ఎన్ని పాచికలు వేసిన అవి పారలేదు. పైగా ఆ వర్గ ఓట్లన్నీ ఎస్పీవైపు మళ్ళాయి. ఎందుకంటే బిఎస్పీ హయంలో ఒకే వర్గానికి మేలుచేసే విధంగా మాయావతి వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని కారణాలను కాదని మన రాష్ట్రం కూడా కొందరు తెలంగాణ వ్యతిరేకులు .. యూపీ ఫలితాలు విభజనకు వ్యతిరేకంగా వచ్చాయని దాన్ని మన రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు. అది సరికాదు. యూపీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వం పై ప్రభావం చూపబోవు అని సోనియా గాంధీ మొదలు కేంద్ర మంత్రులు కూడా సెలవిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్ర ఫలితాల ప్రభావం  ఇక్కడ జరగబోతున్న ఉప ఎన్నికల్లో కూడా ఉండదని ముఖ్యమంత్రి మొదలు అందరూ చెబుతున్నారు. దేశంలో దశాబ్డంన్నర కాలంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అందుకే ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్కడ ఉండే స్తానిక సమస్యలను బట్టి ఉంటుంది. అవి వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఉంటుంది అని కూడా చెప్పడం కష్టమే. యూపీలో సైకిల్ జోరు చూసి లోలోపల మురిసిపోతున్న చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు. అక్కడ అఖిలేష్ .. ఇక్కడ లోకేష్ అని ఆ పార్టీ నేతలు అంటుంటే పులకించి పోతున్నాడు. కానీ అఖిలేష్ కు లోకేష్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో నగదు బదిలీ పథకం లోకేష్ ఆలోచనే అని మహాకూటమి పేరుతో చంద్రబాబు ఎంత మాయ చేయాలని చూసిన ఈ రాష్ట్ర ప్రజలు బాబును లోకేష్ బాబు పథకాన్ని ఆదరించలేదు. చంద్రబాబు ఎంత ఘనుడో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా ఎరుకే. అందుకే ఆయనను విశ్వసించలేదు. విశ్వసించరు కూడా. అందుకే అక్కడ అవకాశవాదం కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మభ్యపెట్టే మాటలు ఎన్ని చెప్పిన జనం నమ్మలేదు. అఖిలేష్ యాదవ్ చెప్పిన సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా నివేదికలను కచ్చితంగా అమలు చేయాలే. మిగతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలి. అప్పుడే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా దేశంలో ఎక్కువ స్థానాలు ఉన్న యూపీలో మెరుగైన సీట్లను దక్కించుకోగలదు.

Thursday 8 March 2012

విభజన యూపీలో అంశమే.. కానీ ఏపీలో ఆకాంక్ష ...


ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రభావం కేంద్ర ప్రభుత్వం పైన.... జాతీయ పార్టీల పైన పడుతుంది కానీ... తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై మాత్రం పడదు. దీన్ని సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని ప్రచారం చేయడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వాటికి  ఉన్నఅక్కసు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లో సైకిల్ జోరు చూసి చంద్రబాబు మళ్లీ  థర్డ్ ఫ్రంట్ అని, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తమ సైకిల్ దూసుకు పోతదని బీరాలు పలుకుతున్నాడు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ది నాలుగో స్థానం అయితే  ఏ పీ లో కూడా టిడిపి డి మూడో స్థానమే. టిడిపి ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. ఇవ్వాళ రాష్ట్రం లో జగన్ అవినీతి ఒక్కటే కాదు బాబు గారి అవినీతి బాగోతాల గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినీతి విషయంలో చంద్రబాబు, జగన్ బాబు దొందు దొందే..ఇక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో విజయం మాదంటే మాదే అని ఉదరగోట్టే ఉపన్యాసాలు ఇస్తున్నాయి. ఓటరు నాడి తమకు బాగా తెలుసన్నట్టు వ్యవహరిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి జగన్ ను... తెలంగాణ డిమాండు ను తమ ఉమ్మడి సమస్యలుగా భావిస్తున్నాయి. అందుకే ఇరు పార్టీలు ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుంటే వీళ్ళకు కాక ఎవరికి వేస్తారు మరి! అలాగే బిజెపి కూడా తెలంగాణ విషయంలో  కాంగ్రెస్, టిడిపిల వలె  వ్యవహరిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే.. యిప్పుడు ఈ ప్రాంతంలో జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. మహబూబ్ నగర్ లో ఎన్నికలు అనుకోకుండా వచ్చాయి. అక్కడ తెలంగాణ కోసం ఎవరు రాజీనామా చేయలేదు. అక్కడ ఆ పార్టీ పోతిచేయడం మంచిదే. కానీ తెలంగాణ పై ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్న కాంగ్రెస్, టిడిపి లను కార్నర్ చేయకుండా, రాష్ట్ర సాధన  కోసం దశాబ్ద కాలంగా పోరాడుతున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడాన్ని తెలంగాణ ప్రజానీకం హర్షించదు. నిజానికి బిజెపి రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్లయితే రేపు సీమాంధ్ర లో జరగబోయే పదహారు అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానంలో జై ఆంధ్ర నినాదంతో పోటీ చేయాలే. ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర విభజన ఆవశ్యకతను అక్కడి ప్రజలకు తెలియజేయలే. దాన్ని తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర లో రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న దళిత, బహుజనులు కూడా స్వాగతిస్తారు. అంతే కానీ చంద్రబాబు లాగా తమది కూడా రెండుకళ్ళ సిద్ధాంతం అన్నట్టు వ్యవహరించకూడదు. మహబూబ్ నగర్ స్థానంలో బల బలాల దృష్టితో కాకుండా టిఆర్ఎస్ కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తున్న పార్టీల తో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. ఒక్క స్థానం కోసం ఒకరినొకరు దూషించుకుంటే అది శత్రువుకు ఆయుధం అయితది. లక్ష్య సాధనకు చేరువగా ఉన్నసమయంలో రెండు పార్టీలు పట్టు విడుపులతో పనిచేయలే. అప్పుడే తెలంగాణ వ్యతేరేకులకు బుద్ధి చెప్పగలం.

Tuesday 6 March 2012

'పంచ'తంత్రం ఫలితాలు.. ప్రభావం..


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సగటు కాంగ్రెస్ అభిమానిని దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటాయి. కష్ట కాలంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీకి యుపిలో పూర్వ వైభవం తెచ్చిపెడతాడనుకున్న రాహుల్ మంత్రం పనిచేయలె. ఈ ఎన్నికల ఫలితాలకు రాహుల్ ఒక్కడినే భాద్యుడిని చేయడం సరికాదని.. గాంధీ-నెహ్రూ కుటుంబాల విధేయులు చెబుతుండవచ్చు. కానీ మొన్న.. నిన్న .. నేడు.. రేపు కూడా  భావి ప్రధానిగా భావించ బడుతూ.. అయన భజన పరులచే ప్రశంసలూ అందుకున్నారు. అందుకుంటున్నారు. మరి ఆయనను బాధ్యుడిని చేయవద్దంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలె.  రాహుల్ ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడే అన్న నేతలు .. ఈ ఎన్నికల ఫలితాల వైఫల్యాలను మాత్రం అయన ఒక్కడికే అంటగట్టవద్దంటున్నారు. నిజమే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే. కానీ గెలిచినప్పుడు సమష్టి కృషి అంటారు. ఓడినప్పుడు దానికి పార్టీ నో ఒకవేళ అక్కడ ఉండే మరో పెద్ద నేతనో ఆ వైఫల్యాల భాద్యతను మోస్తారు. అయితే యుపికి సంబంధించి రాహులే భాద్యత వహించాలే. అక్కడ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అంటే రాహుల్ అనే విధంగా కొనసాగింది. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి రాహుల్ నానమ్మ ఇందిరా, తండ్రి రాజీవ్ లతో కలిసి పనిచేసిన నేతలు కూడా రాహుల్ జపమే చేశారు. ఎందుకంటే గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఇరవై స్థానాలు రావడానికి చాలా కృషి చేశారు. దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న యుపిలో పాగా వేస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చు అని రాహుల్ భావించారు. అందుకే భావి ప్రధానిగా భావించిన ఆయన యుపి రాజకీయాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఈ ఎన్నికల ఫలితాలు యూపీఏ పాలనకు బీటలు వారుతున్నాయి అని చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తున్నది. మత తత్వ పార్టీలతోనే ఈ దేశానికి ముప్పు ఉందని బిజెపి పై నిత్యం విమర్శలు చేసే ఆ పార్టీ  యుపి లో మైనారిటీ ఓట్ల కోసం ఎలా వ్యవహరించిందో చూశాం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. అందులో కాంగ్రెస్, బిజెపి ఎవరిదైన ఒకటే విధానం.. పవర్ కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు కలిసి రాకపోవడానికి... రాహుల్, ప్రియాంక ల చరిష్మా పనిచేయక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినితీ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో .. అవినీతి పై మాట్లాడిన వారితో కాంగెస్ మంత్రులు .. ఆ పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు యావత్ ప్రజానీకం చూసింది. అవినీతిని నిర్మూలించడం లో జాతీయ పార్టీలు అవలంభిస్తున్న విధానాలను ప్రజలు నిరసించినట్టు కనబడుతున్నది. ఇక యుపి ని మాయావతి నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చేసినా తీర్మానాన్ని ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారనే వాదనలు మన రాష్ట్రంలోని మీడియాలో చర్చలు పెడుతున్నారు. యూపీ విభజనకు ఏ పీ విభజనకు సంబంధం లేదు. దీనిపై చర్చ అనవసరం కూడా. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న బీఎస్పి అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు పరచాలని నిర్ణయించింది. అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ట్రాలతో ఉండే పాలన సౌలభ్యాన్ని అమలు చేయాలని సంకల్పించింది. యూపీ ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనేది ఒక అంశం మాత్రమే. దాన్నే ప్రధాన ఎజెండాగా ఏ పార్టీ కూడా ప్రచారం చేయలేదు.. యూ పీ విభజనకు పట్టుబట్టిన బీఎస్పి కూడా దాన్ని ఎత్తుకోలేదు. కానీ ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితులు లేదు. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రధాన ప్రతిపక్షం తో పాటు (ఒక్క సిపిఎం ) మినహా  ఏ పార్టీ కూడా తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడలేవు. అందుకే యూపీ రాజకీయాలను ఏపీ కి అంటగట్టడం తెలంగాణ వ్యతిరేకుల పని మాత్రమే! ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే లోక్ సభకు సెమీ ఫైనల్ గా ఎలా భావిస్తున్నారో.. యిప్పుడు రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలు కూడా వచ్చే జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గానే భావించాలి. అంతే కాదు ఈ ఎన్నికలు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అస్తిత్వానికి సంబంధించిన ఎన్నికలు. పాపం చంద్రబాబు యూపీ ఎన్నికల్లో ఎస్పి సాధించిన ఫలితాలు ఏపీలో తమ పార్టీ కి ఆపాదించుకుంటున్నారు. అవినీతి విషయంలో అయినా .. ప్రజల ఆకాంక్ష  విషయంలో అయినా .. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అయినా ద్వంద్వ విధానాలు అవలంబిస్తే ... వారిది ఎప్పటికి ప్రతిపక్ష పాత్రే అవుతుంది.

Sunday 4 March 2012

మాటల్లోనే హక్కులు


ఈ దేశంలో పాలకవర్గ విధానాలతో ఎక్కువగా నష్టపోతున్నది మొదటి వరుసలో ఉండేది ఆదివాసులు. వాళ్ళు అడివినే నమ్ముకొని బతుకుతారు. ప్రకృతి ప్రేమికులు కాబట్టే అటవీ ప్రాంతాలు అన్యాక్రాంతం కాకుండా కంటికి రెప్పల కాపాడుకుంటారు. అడివిలో దొరికే సహజ వనరులతో వ్యాపారం చేస్తే కోట్లాది రూపాయలు గడించవచ్చు.కానీ వాళ్ళు ఆ పని చేయరు. కాసులకోసం చేసే వ్యాపారం తమ ముందు తరాలను కభలిస్తుంది అనేది వాళ్ళ ప్రగాడ విశ్వాసం. అందుకే ఆ మట్టి మనుషుల మనసులో మానవ సంబంధాలకే ప్రాధాన్యం ఉంటుంది. కానీ మనీకి కాదు. ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామం అయ్యింది.  అభివృద్ధి అనేది దేశంలోని పది శాతం కూడా లేని పెట్టుబడిదారులది అవుతోంది. వీళ్ళ ఉత్పత్తి వేటలో కోట్లాది ప్రజలకు  ఉపాధి కరువవుతోంది. అందుకే ఆదివాసుల హక్కులన్నీ రాజ్యాంగంలో రాసుకోవడానికే కానీ ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదని... ఏలికల చేతలు చూపుతున్నాయి. ఇవాళ కేంద్ర మంత్రి జయరాం రమేష్ మాట్లాడుతూ నేను, కిషోర్ చంద్ర దేవ్ మంత్రి వర్గంలో ఉన్నంత కాలం బాక్సైట్ తవ్వకాలు ఉండవు అని ప్రకటించారు. ఈ మంత్రి గారే గతంలో బిటి విత్తనాలన విషయంలో ఎలా వ్యవహరించారో మనకు తెలిసిందే. రాష్ట్ర శాసనసభ స్పీకర్ నేతృత్వంలో శాసనసభ్యులంతా గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి అరకులో మూడు రోజులు బస చేసినా వాళ్ళ సమస్యలు తీరలేదు. తీరవు కూడా. అలాగే ఆదిలాబాద్ లోని కవ్వాల్ లో పులుల అభయారణ్యం పేరుతో అక్కడ నివసిస్తున్న ఆదివాసులను అడవి నుంచి తరిమికొట్టే ప్రయత్నాలకు ఇదే పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గత కొంతకాలంగా ఆ ప్రాంత గిరిజనులు ఉద్యమిస్తూనే ఉన్నారు. వీళ్ళ బాధలు అధికార, ప్రతిపక్ష నేతలకు పట్టడం లేదు. కాకులను కొట్టి గద్దలకు పంచడం అంటే ఇదేనేమో!

మన్మోహన్ మాయాజాలం



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాల బాధ్యతల నుంచి పూర్తి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. సంస్కరణల పేరుతో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. అందులో భాగంగానే విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలో నెలకొల్పడానికి అనుమతిచ్చే బిల్లును తెచ్చేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ ఏ లోని కేంద్ర మంత్రివర్గంలో పాలనా దక్షుల కంటే సంస్కరణలను నెత్తిన పెట్టుకొని ఊరేగే వారికే పదవులు కట్టబెట్టింది. స్వతహాగా ఈ దేశ ప్రధానే పెద్ద బ్యూరోక్రాట్. అయన సహచర మంత్రులైన చిదంబరం, కపిల్ సిబాల్ వంటి వారు మన్మోహన్ విధానాలను తూచా తప్పకుండా ఆచరిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లు తేవడానికి ఎదురవుతున్న అవరోధాలపై అధిగమించడానికి ప్రధాని ఆ పనిని సిబాల్ కు అప్పజెప్పారు. ఇక అటవీ ప్రాంతాలలోని సహజ వనరులను బహుళజాతి కంపనీలకు కట్టబెట్టే బాధ్యతలు చిదంబరం తన భుజాల పై మోస్తున్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసులను, వారికి అండగా ఉంటున్న మావో యిస్టులను ఏరివేయడానికి గ్రీన్ హంట్ ను అమలు చేస్తున్నారు. హక్కులు అడిగితే అరదండాలె అన్నటు మానవ హక్కుల, సామాజిక కార్యకర్తలపై కాలం చెల్లిన రాజద్రోహం వంటి కేసులు వారిపై పెడుతూ, ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గేల చేస్తున్నారు. దేశ పౌరులకు ఆహార భద్రత కల్పిస్తామంటున్న పాలకులు ఎఫ్ డి ఐ ల పేరుతో  ఉన్న ఉపాధిని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మన్మోహన్ కు అణు ఇందనం పై ఉన్న ప్రేమ అట్టడుగు వర్గాలపై లేదు. అందుకే దేశవ్యాప్తంగా అణు ఇంధన ప్రాజెక్టుల కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా.. వాటిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. గోదాముల్లో మూక్కిపోతున్న ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కుదరదు అని చెప్పి, రోజుకు ముప్పై నాలుగు రూపాయలు ఖర్చు చేసేవారందరూ దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారే అని తేల్చేశారు.మన్మోహన్ మాయజాలంలో దేశం సాధించిన అభివృద్ధి కంటే అధోగతి పాలైందే ఎక్కువ. దీనికి ఆమ్ ఆద్మీ అని చెప్పే సోనియా, రాహుల్ లు కూడా బాధ్యులే. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో విఫలమౌతున్న ప్రతిపక్షాలు దోషులే.

ప్రశ్నించాల్సిన సమయం !



జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడింది. త్వరలో ఈ పదిహేడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పదహారు స్థానాలు సీమాంధ్రలోనే జరుగుతాయి కాబట్టి సీమాంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి. అదేమంటే యిప్పుడు తెలంగాణాలో జరగబోయే ఆరు స్థానాల్లో రెండు కండ్ల బాబు, కాంగ్రెస్ పార్టీ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పై చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణ ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ ఎన్నిక జరిగినా తెలంగాణ వాదానికే జై అంటున్నారు. కాబట్టి ద్వంద్వ విధానాలు అవలంబించే పార్టీలకు ఇక్కడ స్థానం లేదు. ఇక తేల్చుకోవలసింది సీమాంధ్ర ప్రజానీకమే. యిప్పుడు ఎన్నికలు ఎందుకు వచ్చాయి, వాటి నేపథ్యం అనవసరం. కానీ ఈ రెండు కండ్ల బాబును, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజనపై, సమైక్యం పై నిలదీయాల్సిన సమయం వచ్చింది. యిప్పుడు రెండు వాదనలకు ఆస్కారం ఇవ్వకూడదు. ఈ రెండు పార్టీలను ఏదో ఒక అభిప్రాయానికి మాత్రమే కట్టుబడి ఉండాల్సిందేనని డిమాండ్ చేయాలే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుతున్న రాష్ట్ర డిమాండ్ కొత్తది కాదు. ఇదీ ఏ పార్టీనో, ఒక వ్యక్తి డిమాండ్ అసలే కాదు. ఐదున్నర దశాబ్దాల పోరాటం.  నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర సాధన కోసం దాదాపు ఎనిమిది వందలమంది బలిదానాలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రజలముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం, రెండు తెలంగాణ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడం. ఈ రెండూ రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. తమ గమ్య స్థానాన్ని ముద్దాడడానికి ఒక్కో సమస్యను అధిగమిస్తున్నారు. అది సమ్మె రూపంలో కావచ్చు, మిలియన్ మార్చ్ లే కావచ్చు, ఎన్నికలే కావచ్చు అన్ని ఉద్యమం లో భాగమే. అందుకే ఇవ్వాళ అధికార, ప్రతిపక్ష పార్టీలు నై తెలంగాణ అనలేక పోతున్నాయి. అందుకే సీమాంద్ర ప్రజలు యిప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలే. మీ అభిప్రాయం ఏదైనా కావాచ్చు. అధికార, ప్రతిపక్ష, వైఎస్ఆర్ పార్టీలను నిలదీయలే. తెలంగాణ, సమైక్య ఈ రెండింటిలో ఏదో ఒక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని డిమాండ్ చేయండి. అప్పుడే ఈ రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత తొలిగిపోతుంది. సీమాంధ్ర ప్రజలారా బహు పరాక్!

మౌనం వీడాల్సిందే!



రాష్ట్రంలో జరగనున్న ఉపఎన్నికలు చిత్తూరు బాబులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, సీమాంధ్రలో జగన్ ను ఎదురుకోవడానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న విషయం విదితమే. బాబు, కిరణ్ లు ఇద్దరు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి పనిచేస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తాజాగా సమాచార కమిషనర్ల నియామక సందర్భంలో బాబు కిరణ్ తో కలిసిపోయారని బొత్స మొదట వ్యాఖ్యానించి తరువాత సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు తెలంగాణ సమస్య మరో వైపు సీమాంధ్ర లో జగన్ ప్రభావంతో బాబు సతమతమవుతున్నారు. అలాగే కిరణ్ కూడా అధిష్టానం అండతో అధికారాన్ని చేపట్టారు. బాబు  సమస్యలనే కిరణ్ ఎదురుకొంతున్నారు. దీనికి తోడు సొంత పార్టీ లోని అసమ్మతి రోజురోజుకు పెరిగిపోతున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ను, కాంగ్రెస్ పార్టీని జగన్, ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన సహచర మంత్రులే అంటున్నారు. ఇక కిరణ్ మోనార్క్ ల వ్యవహరిస్తున్నారని టి కాంగ్రెస్ నేతల విమర్శలు. మంత్రి పదవులకోసమో, కాంట్రాక్టు పనులకోసమో కిరణ్ బాగా పనిచేస్తున్నారు అని పొగిడే వారిని కొంత మండి  తన వర్గీయుల చేత చెప్పిస్తుంటారు. ఇలా అధికారం కోసం బాబు, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి కిరణ్ చాలానే శ్రమిస్తున్నారు. అవసరం అయినప్పుడల్లా కలిసి పనిచేస్తున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా యిప్పుడు  ఏడు స్థానాలు, జగన్ వర్గ ఎమ్మెల్యేల పై వేటు పడడంతో మరో పదిహేడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఏడు స్థానాల్లో ఆరు తెలంగాణాలో, ఒకటి సీమాంధ్ర లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు కీలకం కానున్నాయి. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని అధిష్టానానికి పంపుతున్న నివేదికలు, జగన్ ప్రభావం అంతగా లేదనే  నివేదికల్లో వాస్తవాలేమిటో తెలిసి రానున్నాయి. కోవూర్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థి భారీ మెజారిటీతో నెగ్గితే, దాని ప్రభావం యిప్పుడు వేటు పడిన పదహారు స్థానాలు (సీమాంధ్ర)పై కచ్చితంగా పడుతుంది. ఇక తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని అనర్హత వెటుకు గురైన జగన్ వర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండ సురేఖ భవితవ్యం కూడా తేలిపోనుంది. ఎందుకంటే పరకాలలో టి ఆర్ ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకటించారు. అయితే యిప్పుడు తెలంగాణాలో జరుగుతున్న ఆరు స్థానాల్లో జగన్ పార్టీ పోటీ చేయడం లేదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను వై ఎస్ ఆర్ పార్టీ గౌరవిస్తున్నదని పైకి చెబుతున్నా.. తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పకపోతే ఓటమి కాయమని తెలిసే బరిలోకి దిగలేదని తెలుస్తున్నది. అందుకే రేపు పరకాల ఎన్నిక తెలంగాణాలో వై ఎస్ ఆర్ పార్టీ భవిషత్తును నిర్ణయించనుంది. తాజా తెలంగాణ ఉపఎన్నికల గండాన్ని జగన్ తాత్కాలికంగా తప్పించుకున్నా.. పరకాల రూపంలో తెలంగాణ ప్రజానీకం జగన్ ను  ప్రశ్నించనుంది. అప్పుడు జగన్ కూడా రెండుకళ్ళ సిద్ధాంతాలు, సరైన సమయంలో సరైన నిర్ణయం, ఇచ్చే శక్తి లేదు , తెచ్చే శక్తి తనకు లేదని తప్పించుకోవాలనుకుంటే కుదరక పోవచ్చు. ఈ ఉప ఎన్నికలు బాబు, కిరణ్ లకు ఎంత ముఖ్యమో జగన్ కు కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర విభజన తమచేతుల్లో లేదని చేబుతున్న ఈ ముగ్గురు సీమాంధ్ర బాబులకు దీనిపై ఏదో ఒకటి తేల్చుకునే సమయం ఆసన్నమైంది. తమ మనసులో మాటలను చెప్పాల్సిందే!

Thursday 1 March 2012

telangana