Friday 23 November 2012

అంతా అనుకూలమైతే, అడ్డు ఎవరు?

తెలంగాణ ప్రాంత ఎంపీలు డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయాలని పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. అయితే వీళ్ల నిరసన పత్రికలకే పరిమితమవుతున్నది తప్ప ప్రయోజనం లేదు. ఎందుకంటే పార్లమెంటు లోపల సభా కార్యక్రమాలను అడ్డుకున్నప్పుడే వారు చేపట్టే నిరసన కార్యక్రమాలకు విలువ ఉంటుంది. తెలంగాణకు మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా వారికి సంఘీభావం తెలుపుతాయి. అప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకానీ ‘కర్ర విరగకూడదు పాము చావకూడదు’ అన్నట్టు టీ ఎంపీలు వ్యవహరించడం వల్ల వీళ్లు అలసిపోవడం తప్ప వాళ్ల అధిష్ఠానం మాత్రం స్పందించే అవకాశాలు లేవు. అట్లాగే టీ. ఎంపీలు ఏమంటున్నారు? కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వము అని చెప్పలేదు కదా! అలా చెప్పినప్పుడు మా నిర్ణయం మేం తీసుకుంటాము అంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని ఎప్పుడు చెప్పింది? (ఇది కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర నేతలే కాదు తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది కూడా మీడియా ముందు చెబుతూనే ఉన్నారు). మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కారణాలు, కాలయాపనల చూసినాక కూడా ఇంకా టీ. ఎంపీలకు తమ అధిష్ఠానం మీద ఇంకా నమ్మకం ఉంది అని అంటే అది వారి భ్రమే అవుతుంది. ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. ఆ పార్టీని విశ్వసించే అవకాశమూ లేదు. అలాగే ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, చచ్చేది కూడా మేమే అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది లేదు మీరు తెచ్చేది లేదు అనేది తేలిపోయింది. అందుకే  ఇక చచ్చే కంటే ప్రత్యేక కార్యాచరణ ఒకటి రూపొందించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణపై నినదించే టీ ఎంపీల సంఖ్య కూడా రోజురోజూకు తగ్గిపోతున్నది. ఇంత గోడ మీద పిల్లుల్లా ఉన్నవాళ్లు మెల్లగా జారుకుంటున్నారు.

పదవులు వచ్చాక తెలంగాణవాదానికి తిలోదకాలు ఇచ్చినవాళ్లు కొంతమంది అయితే భవిష్యత్ వచ్చే పదవుల కోసం మరికొంత మంది పాకులాడుతున్నారు. తెలంగాణ కోసం అంతా ఐక్యంగా ఉండాలంటున్న వాళ్లే స్వలాభం కోసం శత్రువుతో జతకట్టబోతున్నారు. అందుకే తెలంగాణ కోసం పార్లమెంటు గొంతు చించుకుంటున్న టీ ఎంపీలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ మద్దతు పలికారు కానీ తెలంగాణే తమ ఎజెండా అన్న వాళ్లు అక్కడ కనిపించలేదు. కనిపించరు కూడా. ఎందుకంటే వాళ్లకు కావలసింది ‘అమ్మ’ కనికరం. అందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల దృష్టిలో పడడానికి పరుగులుపెడుతున్న నేతలు తెలంగాణ తేల్చకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న వారిని మాత్రం ప్రశ్నించడంలేదు. ప్రశ్నిస్తే పదవులు పోతాయి అన్న సంగతి వాళ్లకు ఎరుకే! అందుకే ఇప్పటికీ ‘అమ్మ’ తెలంగాణ ఇస్తుంది అని నమ్మబలుకుతారు. ఈ మాట ఇప్పుడు కాదు మూడేళ్లుగా చెబుతున్నారు. వినివాళ్లు ఉంటే ఇంకా కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారు కూడా. అందుకే పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను ప్రశ్నించకుండా అవసరమైతే ఆయనకు అండగా ఉంటామంటారు. తెలంగాణపై విషం కక్కిన వైఎస్‌కు మేము అభిమానులం అంటారు. ఇంత బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు ప్రజల పక్షాన నిలబడి, తమ బాధ్యతను నెరవేర్చాలి అంటే ఎలా కుదురుతుంది? వాళ్ల ఆలోచనలు వేరు, ప్రజల ఆకాంక్ష వేరు.

ఇక చంద్రబాబు ఏమంటున్నడు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాడట. ఈ చంద్రబాబు వల్లే ఇంత మంది బిడ్డలు బలిదానాలు చేసింది. మానవహక్కుల దినోత్సవం రోజు (డిసెంబర్ 10) ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కును కాలరాసింది ఈ చంద్రుడే. పెద్ద నిర్ణయమని, ఎవ్వరినీ సంప్రదించలేదని, ఆంధ్రప్రదేశ్‌ను విడదీయడానికి కర్నాటక వీరప్పమొయిలీ, తమిళనాడు చిదంబరం ఎవరని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది ఎవరు? ఇప్పుడు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాబోనని అంటే ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం నలభై రెండు రోజులు సకల జనులు సమ్మె చేస్తే సంఘీభావం తెలపని చంద్రబాబు ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి ఈ ప్రాంత టీడీపీ నేతలు ఆహా ఓహో అంటున్నారు.

వైఎస్ కూతురు, జగనన్న వదిలిన బాణం షర్మిల అంటున్నారు రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయంటున్నారు. విజయమ్మ ఇంకో అడుగు ముందుకేసి వైఎస్, జగన్ ఎన్నడూ తెలంగాణను వ్యతిరేకించలేదన్నారు. నంద్యాలలో వైఎస్, పార్లమెంటులో జగన్ చర్యలు తెలంగాణ ప్రజల మరిచిపోలేదు. వైఎస్ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్నారు అని చెప్పేవాళ్లు ఇప్పుడు తెలంగాణ గురించి వాళ్ల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లేదని ఎంత కాలం చెబుతారు. ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించరు. మీ ద్వంద్వ విధానం ఏమిటో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న జగన్నాటక సూత్రాధారులు ఏవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఇంకా ఈ మాయ మాటలు నమ్మి మోసపోయే కాలం పోయింది. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అంటున్న ఈ ప్రాంత నేతలకైనా, ప్రాంతేతర నేతలకైనా ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజల నుంచి ఎదురయ్యేది ప్రతిఘటనే!

Labels: , , ,

Saturday 17 November 2012

తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!



తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పరీక్షా సమయం. ఎందుకంటే రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం కొంతకాలంగా చూస్తున్నాం. ఇంతకీ ఎవరు ఎవరితో లాలూచీ పడ్డారు? పడుతున్నారు అనేది సమస్య. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. టీడీపీ తెలంగాణపై తేల్చడానికి వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాయలసీమ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో జంప్ అయ్యారు. నిజానికి వాళ్లు పార్టీని వీడడానికి, బాబు తెలంగాణపై ప్రధానికి లేఖ రాయడానికి సంబంధం లేదు. కానీ దీన్ని సాకుగా చూపి వాళ్లు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఏమిటి? వైఎస్‌ఆర్‌సీపీ సమైక్యవాదానికే మొగ్గుచూపుతున్నదని దాని అర్థం. కానీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్నదేమిటి? మేం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నాం. అందుకే తెలంగాణలో జరిగిన గత ఉప ఎన్నికల సమయంలో మేం పోటీ పెట్టలేదు అంటున్నది. కానీ అప్పుడు ఆ పార్టీ పోటీ పెట్టి ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు ఎదురైన చేదు అనుభవానికి భిన్నంగా ఏమీ ఉండేది కాదు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి మంత్రమే జపిస్తున్నాయి. కానీ ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడడం లేదు. దానిపై డిమాండ్ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తున్నా.. అన్నీ వారి అధిష్ఠానం కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఇక తెలంగాణ టీడీపీ నేతలు అయితే టీఆర్‌ఎస్, ఉద్యమ నాయకత్వాన్ని తిట్టడమే ఉద్యమమని అనుకుంటున్నారు.

మూడేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ పదవులను వదులుకోవడం లేదు. వీరికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక కార్యాచరణ అంటూ ఏదీ లేదు. కాంగ్రెస్ నేతలది ఢిల్లీ చక్కర్లు, లేఖల ఉద్యమాలైతే.. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పైగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన చోట్ల పోటీకి కూడా దిగారు. అదేమంటే ఒకరు తమది జాతీయ పార్టీ కాబట్టి పోటీకి దిగకపోతే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయి అంటారు. టీడీపీ కాంగ్రెస్ పోటీలో ఉన్నది కాబట్టి తామూ కూడా పోటీ పెడుతున్నట్టు చెబుతుంది. ఒక పార్టీ కాలయాపనతో కాలం వెళ్లదీస్తుంటే.. మరొక పార్టీ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నది. ఇక టీడీపీ అంటున్న అఖిలపక్షం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవలే కేంద్ర హోం మంత్రి తెలంగాణపై చర్చలు పూర్తయ్యాయి. అవసరమనుకుంటే అఖిలపక్షం పెడతామన్నారు. దీనికంటే ముందు టీడీపీ అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబట్టాలి. నిజంగా ఆ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉన్నట్టయితే తీర్మానం సమయంలో ఎవరు తెలంగాణ ద్రోహులో తెలిసిపోతుంది. ఆ మధ్య ముఖ్యమంత్రి చెప్పినట్టు తీర్మానం వీగిపోతుందా? లేక నెగ్గుతుందా అనేది కూడా తేలుతుంది. అప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ల వైఖరి కూడా బయటపడుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ పని చేయగలిగితే తెలంగాణపై ఏ పార్టీ ఎంత నిజాయితీగా ఉన్నదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు వాళ్లే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో?

మరో విషయం ఏమంటే ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాక దీనిపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎంఐఎం వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నది అధికార, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ అభిప్రాయం అడక్కరలేదు. ఎందుకంటే ఎంఐఎం అసెంబ్లీ వేదికగానే సమైక్యవాదాన్ని వినిపించింది. ఆ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టబోతున్నదంటే రాష్ట్ర విభజనపై ఆ పార్టీ విధానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు మొన్నటి దాకా తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీల్లోనే భిన్న రాగాలుండేవి. ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఆ జాబితాలో చేరింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది తెచ్చేది మేమే కాబట్టి మేం లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదంటుంది. టీడీపీ లేఖ ఇచ్చాము కాబట్టి అఖిలపక్షం పెట్టాలంటుంది. వైఎస్‌ఆర్‌సీపీ లేఖ రాయదు, అఖిలపక్షం పెట్టమని డిమాండ్ చేయదు. తెలంగాణపై తేల్చాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి చేయదు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యపై పార్టీల ద్వంద్వ నీతి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  బయటపడింది. ఇక తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!

Labels: , , ,

Saturday 10 November 2012

హస్తిన ఆటలు ఇంకెన్నాళ్లు ?




రాజకీయ పార్టీలు ఎప్పుడూ రాజకీయాలే చేస్తాయిఇందులో జాతీయ పార్టీలు మొదలు ప్రాంతీయ పార్టీల వరకు ఎవరి పంథా వారిదిఅట్లాగే రాజకీయ పార్టీలు ప్రజాసమస్యలపై చేసే పోరాటాల్లో కూడా వారి ప్రయోజనాలు ఉంటాయిఇందులో వంతలువిశేషాలు ఏమీ లేవుటీఆర్‌ఎస్ పార్టీ రెండు మేధోమథనం తర్వాత పరిణామాలు రాష్ట్ర రాజకీయాలో మాటల యుద్ధానికి తెరలేపాయిఐదు దశాబ్దాలుగా తెలంగాణను మోసం చేసింది ఇప్పుడూ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీఅయితే తెలంగాణపై ఐదు దశాబ్దాలలో ఒక సానుకూల ప్రకటన చేసింది కూడా ఆ పార్టీనేటీఆర్‌ఎస్ రెండు రోజుల మేధోమథనం తర్వాత కేసీఆర్ నాలుగు నెలలుగా తెలంగాణపై జరిగిన చర్చల సారాంశాన్ని మీడియా ముందు వెల్లడించారుహస్తిన జరిగిన చర్చలపై ఇంత కాలం సాగిన అనేక వాదోపవాదాలకు ఆయన తెర దించారుకాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారుఅయితే హస్తినకు వెళ్లే ముందే కేసీఆర్‌ను హెచ్చరించిన వాళ్లు ఉన్నారురాయబారం విఫలమవుతుందని తెలిసినా ఇచ్చేది అధికార పార్టీ కనుక కేసీఆర్ హస్తినకు వెళ్లారుసంప్రదింపుల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని తెలంగాణ వ్యతిరేకులు అంగీకరిస్తున్నారు

కాంగ్రెస్:
అయితే హస్తిన రాయబారం విఫలమైన తర్వాత తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయిచర్చలకు ముందు ఆయన చెప్పిన 'ఇస్తే సంబురంలేకపోతే సమరం అనేది ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందిఅయితే తెలంగాపై కేసీఆర్‌తో ఒకవైపు చర్చలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా హస్తిన పెద్దలు అవాకులు చెవాకులు పేలారుఇది సహజంగానే ఉద్యమకారులకు ఆగ్రహాన్ని తెప్పించిందిఅందుకే కేసీఆర్ కంముందుగానే టీ జేఏసీ తెలంగాణ మార్చ్ రోజునే కాంగ్రెస్‌పై సమరానికి సిద్ధమన్నదిఇంతకాలం తెలంగాణపై తనకు అవగాహన లేదనిదీనిపై ఎలాంటి చర్చలు జరగడం లేదని అన్న కేంద్ర హోం మంత్రి ఇప్పుడు అఖిలపక్ష భేటీ ఎప్పుడైనా జరగవచ్చు అని ప్రకటించారుతెలంగాణపై పూర్తిస్థాయిలో చర్చించామన్నారుతెలంగాణ పరిష్కారం కోసం ఇంతకాలం ఆగారుమరికొంతకాలం వేచిచూడాలని తాజా గడుపు పెట్టారుఅంతెలంగాణపై ఒక్క కేసీఆర్ మాత్రమే గడువులు పెట్టలేదుకాంగ్రెస్ పార్టీ మూడేళ్లుగా అనేక గడువులు పెట్టిందిఅయినా అటు ఉద్యమ నాయకత్వం గానీఇటు ఈ ప్రాంత ప్రజలు గానీ ఎంతో ఓపిగా ఎదురుచూశారుఇప్పుడు కేసీఆర్ ఇక సమరమే అన్నాక మరికొంత సమయం కావాలంటున్నదిఈ అంశాన్ని తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే  అంతర్గంతా ఆజాద్వాయలార్ రవి వంటి నేతలు ఇరు ప్రాంతాల నేతలతో చర్చించిందివారి అభిప్రాయాలను అధినేత్రి ముందు పెట్టారుఇరు ప్రాంతాల నేతలు కూడా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంతో కాలంగా అడుగుతున్నారుకానీ హస్తిన పెద్దలు పండుగలుఎన్నికలుసోనియా ఆరోగ్యంక్యాబినేట్ పునర్ వ్యవస్థీకరణపార్టీ సంస్థాగత మార్పులు అంటూ గడువులు పెట్టుకుంటూ గందరగోళానికి గురైందిఅలాగే తెలంగాణపై జరుగుతున్న చర్చలకు సంబంధించి ఒకమాట మీద నిలబడితే దీనిపై ఏదో నిర్ణయం వస్తుందని ప్రజలు ఆశించే వారుకానీ కాంగ్రెస్ నేతల కన్ఫ్యూజన్ మాటలు  ఇరు ప్రాంతాల ప్రజలను బాధపెట్టాయిఆంధ్రప్రదేశ్ ఉన్న అస్థిరతకు పుల్‌స్టాప్ పెట్టాలని ప్రజాప్రతినిధులుప్రజలు ఎంత వేడుకున్నా సోనియామన్మోహన్‌లు మౌనమే మా సమాధానం అన్నారు

టీడీపీ:
అలాగే టీడీపీ కూడా తెలంగాణపై లేఖ విషయంలో ఎన్ని గడువులు విధించిందో మనకు తెలిసిందేతీరా ఆ లేఖలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ లేదుకాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని చెప్పుకొచ్చారుతెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పిన బాబు దీనిపై ఎన్ని మాటలు మార్చారుఅఖిలపక్ష భేటీలో తమ అభిప్రాయం స్పష్టంగా చెబుతామన్న బాబు  మాటల్లో స్పష్టత లేనే లేదునిజంగా బాబు తెలంగాణకు వ్యతిరేకం కాకపోతే గతంలో అఖిలపక్ష భేటీలోనే స్పష్టమైన వైఖరి వెల్లడిస్తే బాగుండేదిఅలాగే 200నుంచి తెలంగాణపై బాబు వైఖరి అసంబద్ధంగానే ఉన్నదిమొదట సమైక్యం అన్నారుతర్వాత 200తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారుడిసెంబర్ ప్రకటన తర్వాత మాట మార్చారుశ్రీకృష్ణ కమిటీ ముందుఅఖిలపక్ష భేటీలోనూ రెండు వాదనలు వినిపించారుఇప్పుడు మాత్రం స్పష్టమైన వైఖరి చెబుతామంటున్నారుఇప్పటి వరకు బాబు చేసిన ఫీట్లు వల్ల టీడీపీ ఎక్కువ నష్టపోయిందితేల్చాల్సి కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు తన అభిప్రాయం చెప్పకుండా గుంభనంగా ఉన్నదిఅందుకే కాంగ్రెస్ పార్టీ అడిన నాటకంలో ప్రధాన భూమిక బాబు పోషించారని టీడీపీని వీడిన ఎమ్మెల్యే బాబు వైఖరిని తప్పుపట్టారుఅందుకే ఆ పార్టీ నేతలు టీఆర్‌ఎస్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టీడీపీ విశ్వసించకపోవడానికి కారణం బాబు వైఖరేగతంలో కేంద్రం తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందని బాబు భావించలేదుఅందుకే నాటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో అశోకగజపతి రాజు పంపి తెలంగాణకు మేము అనుకూలం అన్నదిచిదంబరం ప్రకటన తర్వాత షాక్‌కు గురైన చంద్రబాబు డిసెంబర్ 1తర్వాత తెలంగాణపై తన వ్యతిరేకతను మీడియా ముందు వెళ్లగక్కాడునాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండడంతో మళ్లీ బాబు మాట మార్చాడుఅయితే ఇప్పటికి తెలంగాణపై చంద్రబాబు వైఖరి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగానే ఉన్నదిఅందుకే తెలంగాణ మేం అనుకూలం అనకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారుబాబు ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులా ఈ ప్రాంత ఇప్పటికైనా బాబు ద్వంద్వ వైఖరిని విడనాడి స్పష్టమైన ప్రకటన చేస్తే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు చేసినవారవుతారు

వైఎస్‌ఆర్‌సీపీ:
తెలంగాణపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైఖరి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదితమేఆయన ఆశయాలు సాధిస్తామురాజన్న రాజ్యం తెస్తామంటున్న ఆ పార్టీ వైఖరి తెలంగాణపై బాబు కంభిన్నంగా ఏమీలేదుబాబు అయినా వ్యతిరేకం కాదంటున్నా జగన్ బాబు ఇప్పటికే తన వ్యతిరేకతను పార్లమెంటులో ప్రదర్శించారుకనుక ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నాము అని అంటున్నా ప్రజల మనసులను గెలుచుకోలేకపోతున్నారుఅందుకే మానుకోటసిరిసిల్లలో ఆ పార్టీని నిలదీశారుపరకాల ఎన్నిక ద్వారా సంకేతం పంపారుఅయితే స్వల్ప మెజారిటీతో టీఆర్‌ఎస్ నెగ్గడాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది ఆ పార్టీఇది తమను తాము మోసం చేసుకోవడమేతెలంగాణ సంగతి పక్కన పెడితే పరకాలలో కొండా దంపతులకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదుఅంతటి బలమైన నేతలే అక్కడ ఓటమి పాలయ్యారుఇప్పుడు ఆ స్థాయి నాయకులు తెలంగాణ ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీకి లేరుకాబట్టి తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటున్నది అందానికి అర్థం లేదువైఎస్‌ఆర్‌సీపీ అంఅందులో ఉన్నది కొత్త రక్తం ఏమీ కాదుదశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిపోయారుఇక తెలంగాణలో ఈ పార్టీ విశ్వాసం పొందకపోవడానికి అనేక కారణాలున్నాయిఇచ్చే శక్తి తేచ్చే శక్తి తమకు లేదని తాత్కాలింగా తప్పించుకున్నా.తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితిలో ఆ పార్టీ లేదుఇప్పటి వరకు ఆ పార్టీ ప్రజాసమస్యలపై ఫీజు పోరుజల దీక్ష,చేనే దీక్షరైతు దీక్ష వంటి పేర్లతో అనేక పోరాటాలు చేసిందినిజంగా ఆ పార్టీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంతెలంగాణ కోసం ఒక్కరోజైనా దీక్ష లేదుఎందుకంఆ పార్టీ బలం సీమాంధ్రకే పరిమితంఅందులోనూ మొత్తం ప్రాంతం కాదుకొన్ని జిల్లాలు మాత్రమేఅందుకే రాజన్న రాజ్యం కోసం రాజీనామా చేసిన పద్దెనిమిది స్థానాల్లో మూడుస్థానాలను కోల్పోయింది ఆ పార్టీఅందుకే ఆ పార్టీ కూడా కప్పదాటు వైఖరిని అవలంబిస్తే తెలంగాణలో ఆ పార్టీ ఎదురీదాల్సిందే!

టీఆర్‌ఎస్:
తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా ఆ పార్టీ పట్ల గౌరవం ఉన్నా. కేసీఆర్ చెప్పినట్టు 10అసెంబ్లీ1పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడం అంత సులభంకాదుఎందుకంరేపు జరగబోయే చతుర్ముఖ పోటీలో నెగ్గాలంప్రజలు టీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓయ్యాలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలితెలంగాణకు శత్రువులెవరోమిత్రులెవరు ప్రజలకు తెలిసినా స్థానిక నాయకత్వాలు పటిష్టంగా ఉన్నప్పుడే కేసీఆర్ అంచనాలు కరెక్ట్ అవుతాయిక్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన పునాది లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారుఉద్యమమే వారి బలం అంటున్నా..దాన్ని ఓట్లు మలుచుకోవడానికి మరింత కృషి చేయాలిఎలాగూ ఒంటరిగానే పోటీ చేస్తాము అన్నారు కనుక ఎన్నికల ఆరునెలల మందుగానే అభ్యర్థులను ప్రకటించాలిగ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే విధంగా పల్లె బాటను ఉయోగించుకోవాలిఅప్పుడు నిజంగానే  ఆ పార్టీ అంచనాలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్నది.
రాజు

Labels: , , ,

Monday 5 November 2012

రాంలీల మైదానంలో వాల్ మార్ట్ రాగం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీకి ఈ దేశ సమస్యలపై పూర్తి అవగాహన లేదని అనేక సందర్భాల్లో వెల్లడైంది. రాంలీల మైదానంలో కాంగ్రెస్ పార్టీ బలనిరూపణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థించడానికి ఏర్పాటు చేశారు. మన్మోహన్ సర్కార్ తీసుకుంటున్న సంస్కరణలు మరింత వేగవంతం చేయడానికి వేదిక చేసుకున్నారు. అలాగే పరోక్షంగా ముందస్తు ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేశారు. చిల్లర వర్తకంలోకి విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తూ మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని ఆయనకు అభయహస్తం అందించడానికి సోనియా, రాహుల్ గాంధీలు ముందుకొచ్చారు.  ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాన్ని విమర్శించడానికి రాహుల్ గాంధీ మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాము. అయినా జాతి ప్రయోజనాల దృష్ట్యా మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు. పక్క దేశం దురక్రమణకు పాల్పడితే మన దేశ సైనికలు  సాహసోపేత పోరాటంతో దాన్ని ప్రటిఘటించారు. ఆ సమయంలో యావత్ భారత దేశం  కేంద్ర సైనిక సర్కార్ తీసుకున్న సైనిక చర్యకు సంఘీభావం తెలిపింది. దానికి ఎప్‌డీఐలకు ముడిపెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఏమిటో ప్రజకలు అర్థమయ్యే ఉంటుంది. ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ దీనిపై చర్చిండానికి నాటి భారత ప్రధాని వాజపేయిని ఆహ్వానిస్తే తిరస్కరించారు. కానీ ఇప్పటి ప్రధాని మన్మోహన్ మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే, వారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేశారు. ఈ దేశ ప్రజలు ఎన్ని పాట్లు పడ్డా అమెరికా అభిమానాన్ని పొందడానికి మన్మోహన్ ఎంతటికైనా సిద్ధపడతాడు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమది అని చెప్పుకుంటున్న వీళ్లు తమ కాళ్లమీద తాము బతికే అభాగ్యుల పొట్టకొట్టి పెద్దలకు పంచేందుకు వాల్‌మార్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్నారు. అలాగే త్వరలో ఆహార భద్రత బిల్లు తెస్తామని కూడా రాంలీల మైదాన్‌లో ఘనంగా ప్రకటించారు. అయితే కొన్ని విషయాలు ప్రజాప్రతినిధులు మరిచిపోయినంత తొందరగా ప్రజలు మరిచిపోరు. ఆ మధ్య సుప్రీంకోర్టు గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఆదేశించింది. కానీ మన మన్మోహన్ గారు దానికి ఒప్పుకోలేదు. పైగా కోర్టు తీర్పును తప్పుపట్టారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే యూపీఏ1, యూపీఏ2 ప్రభుత్వాలు ప్రజలకు మిగిలింది కష్టాలు, ప్రజాప్రతినిధులు కుంభకోణాల్లో కూరుకుపోతున్నారు.

అలాగే తమపై అవినీతి బురదచల్లేవారే కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అవినీతి నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీకి ఎవరూ సాటిరారని సోనియా, రాహుల్‌లు అన్నారు. నిజమే. అవినీతికి ఏ పార్టీ అతీతం కాదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయ వేదికలకు మద్దతు పలుకుతున్నారు. అది అన్నాహజారే, కేజ్రీవాల్ ఎవరైనా కావొచ్చు. ప్రజలు అవినీతిని అంగీకరించడం లేదు. దానికి అడ్డుకట్టవేయాల్సిందేనని నినదిస్తున్నారు. అందులో ఏ పార్టీకి, ఏ ప్రజాప్రతినిధికి మినహాయింపు లేదు. చేసే పనిని మాత్రం చిత్తశుద్ధితో చేయాలి అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తామే పోరాడుతున్నట్టు సమాచార హక్కుచట్టం గురించి, లోక్‌పాల్ బిల్లు గురించి గొప్పలు చెప్పుకుంటున్నది. లోక్‌పాల్ బిల్లు రాజ్యసభలో పాస్ చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాన ప్రతిపక్షం అడ్డుకున్నది అంటోంది. కాంగ్రెస్ పార్టీ తేవాలనుకున్న లోక్‌పాల్ బిల్లుతో అవినీతి అంతం కాకపోగా, అది మరింత పెరిగే అవకాశముందనే ఆరోపణలు వచ్చాయి. ఇక సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ విధానాలు. కానీ ఆ హక్కు చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరడం లేదు. ప్రజల్లో దీనిపై ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.

మార్పు కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పిన రాహుల్‌గాంధీ మన్మోహన్ మనసును మార్చలేకపోతున్నారు. అందుకే మన్మోహన్ అండ్ కోల విధానాలకు వంత పాడుతున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో పేదలు అధికారిక లెక్కల్లో కనిపించరు. కానీ వీళ్లు మాత్రం అధికారం కోసం ఇంకా ఆమ్ ఆద్మీ ప్రవచనాన్ని మాత్రం వదలడం లేదు. అందుకే ఇప్పటికీ భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతున్నది. అది అభివృద్ధిలో కాదు.. అవినీతిలో, కుంభకోణాల్లో, ప్రజా వ్యతిరేక విధానాల్లో.. సో... భద్రతలేని జీవుల్లారా బహుపరాక్!
-రాజు

Labels:

Thursday 1 November 2012

నిర్బంధం నీడలో ....

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరుతో కిరన్ సర్కార్ చేసిన చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నిర్బంధం నీడలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకునే దుస్థితి దాపురించింది. ప్రభుత్వం  చేసిసిన ఆర్భాటంలో ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. పోలీసులతోనే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇక తెలంగాణ ప్రాంతమంత్రా విద్రోహ దినాన్ని పాటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలతో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను హౌస్ అరెస్టు , చాలామంది ఉద్యమకారులను అరెస్ట్‌చేసి ప్రభుత్వం తన దమననీతిని మరోసారి చాటింది. ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరసిస్తూ తమ నిరసనను తెలియజేస్తామని జేఏసీ ముందే ప్రకటించింది. కానీ ప్రభుత్వం జేఏసీని అడ్డుకునే పేరుతో ఇందిరాపార్క్ ప్రాంతాన్ని పోలీసుల చేతిలో పెట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొన్నది. లేని సమైక్య భావనను తలకెత్తుకున్న రాష్ట్ర సర్కార్‌కు అవతరణ వేడుకలు అసంతృప్తినే మిగిలిచ్చాయని చెప్పవచ్చు.

ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది త్యాగాల వల్ల ఏర్పడిందనే దుష్ప్రచారాన్ని  మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ ప్రకటనలో తెలుగుతల్లితో పాటు పొట్టిశ్రీరాములు బొమ్మను ముద్రించింది. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధంలేని వ్యక్తిని ఈ వివాదంలోకి లాగా ఆయన ఆంధ్ర ప్రజల కోసం చేసిన త్యాగాన్ని అగౌరవపరిచింది. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన విషయం విదితమే. ఆయన ప్రాణ త్యాగం ఫలితంగానే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పాటైంది. పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే చనిపోయిన వ్యక్తిని తమ స్వార్థం కోసం సీమాంధ్ర నేతలు వాడుకుంటున్నారు. దీనికి శ్రీరాములు ఆత్మ ఎంత క్షోభిస్తున్నదో. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు తిలదోకాలు ఇచ్చింది. శ్రీరాములు పేరు చెప్పుకుంటూ కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆయన ఆకాంక్షను అమ్ముకుంటున్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లయితే తన స్థాయిని మరిచి  అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర అవతరణ వేడుకలను బహిష్కరించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటున్నారు. దానికి సమాధానం కావాలంటే తన సహచర తెలంగాణ మంత్రులను అడిగితే బాగుంటుంది. అయినా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రభుత్వాన్ని 2009 డిసెంబర్ 9వ తేదీనే బహిష్కరించారు.ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు చూసే ఈ ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను బహిష్కరించారు. ఇప్పుడు టీజీ కానీ సీమాంధ్ర నాయకులు కానీ కొత్తగా బహిష్కరించడానికి ఏమీ లేదు. భౌగోళిక విభజనకు సహకరించడం తప్ప.

ఎవరికి ఎవరు ప్రత్యామ్నాయం?

రాష్ట్రంలో ఇప్పుడు రెండు పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. దీనిపై ఎవరి విశ్లేషణలు వారివే. ఈ రెండు పార్టీల బలాబలాలను ఆ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చర్చలను బట్టి సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ ముందజలో ఉన్నాయని వివిధ సర్వేలు కూడా తేల్చాయి. అది అప్పటి మాట.  టీఆర్‌ఎస్ అధినేత ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో చర్చలు, తెలంగాణపై కాంగ్రెస్ నేతలు భిన్నస్వరాల తర్వాత మళ్లీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీనికి ఈ చర్చలే కారణమని కాదు, చంద్రబాబు, షర్మిల పాదయాత్రలు ఒక కారణమైతే.. కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చుననే సంకేతాలు మరోకారణం. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటున్నదని మీడియాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గుర్తిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి అలాంటిది ఇప్పుడు తెలంగాణ పుంజుకుంటున్నది అంటే ఒక సీమాంధ్ర ప్రాంతానికి పరిమితమైన పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుందో అర్థం కాదు. మరో విషయం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ చేరుతున్నవారిలో మెజారిటీ వర్గం జగన్ సామాజిక వర్గానికే చెందిన వారు కావడం గమనార్హం. అలాగే అందులో చాలామంది వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆయన అనుంగులుగా ఉన్నవారు కొందరతై మరికొంత మంది ఆయనటో అంటకాగిన వారే. కనుక ఇప్పుడు వాళ్లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరితే టీఆర్‌ఎస్‌కు ఏదో ఇబ్బంది వస్తుందనే వార్తల్లో వాస్తవం లేదు.


అట్లాగే తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నవారిని చూపిస్తూ టీఆర్‌ఎస్‌లో కలవరం మొదలైందని అంటున్నారు. ఇంకా సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నడూ సత్తా చూపలేదంటున్నారు. ఆ పార్టీ బలం ఉప ఎన్నికలకే పరిమితమంటున్నారు. కానీ ఆ పరిస్థితి 2009 డిసెంబర్ 9 తర్వాత మారిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు తెలంగాణ అన్నా నెత్తిన పెట్టుకున్నారు. అంతెందుకు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్న చోట టీఆర్‌ఎస్ తన జెండా ఎగురవేసింది. వైఎస్ పెట్టిన ప్రలోభాలకు లొంగి పార్టీని వదిలినవారు వారు ఇప్పుడు ఉద్యమంపై విషం చిమ్ముతున్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణవాదులెవరో వలసవాదులకు అంటకాగుతున్నదెవరో ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నాయకులు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు కొంతమంది అయితే మరికొందరు మూడేళ్లుగా ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నవారే. కాబట్టి ఏదో మాట వరుసకు మేము తెలంగాణ బిడ్డలమే అంటే అర్థం చేసుకులేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. కాకపోతే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఏ వేదిక ఏర్పడినా, ఏ పార్టీ పుట్టుకొచ్చినా దాన్ని ఆకాశానికి ఎత్తడం కొన్ని మీడియా సంస్థలకు అలవాటైంది. దీనికి కారణం ఒక పార్టీ, ఒక వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా చూపెట్టలేక పరోక్షంగా అలాంటి వేదికలు అవకాశం కల్పించడం. అందుకే ఇప్పటి వరకు తెలంగాణ ఎన్ని పార్టీలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. కారణం సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్న ఈ లక్ష్య సాధన కోసం ఎదురుచూసే ఓపిక వాళ్లకు లేకపోవడమే. అవకాశవాదం కోసం అన్ని వదులుకొని ఇప్పుడు అధికార పదవులు అనుభవిస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము.

అయితే కొత్త పార్టీ వచ్చినప్పుడు అందులోకి వెళ్లడం కొత్త కాదు. ప్రజాప్రతినిధులు ప్రజల గురించి ఆలోచించే స్థితిలో లేకున్నా తమ పదవుల కోసం మాత్రం అనుక్షణం తపిస్తూనే ఉంటారు. తీరా ఎన్నికల సమమంలో జంప్ జిలానీ అయితే రెంటికి చెడ్డ రేవడి అవుతామేమోనన్న మీమాంస వారిని వెంటాడుతుంది. అందుకే తమ బెర్తులను ఖాయం చేసుకోవడానికి ప్రజాప్రతిధులు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇక వైఎస్‌ఆర్‌సీపీ బలమెంతోఇప్పుడే చెప్పలేము కానీ కడప పార్లమెంటు, పులివెందుల, కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఊపు ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కనిపించలేదు. ఎందుకంటే జగన్ కోసం రాజీనామా చేసిన రెండుస్థానాల్లో ఆ పార్టీ చతికిలపడింది. దీన్ని ఆ పార్టీ వాళ్లు అవి మా సీట్లు కావు కదా అని సమర్థించుకున్నా దాని ప్రభావం ఆ పార్టీపై ఉన్నది. అలాగే తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఈ ప్రాంతంలో ఎవరిది పై చేయి అవుతుందో సర్వేలకు అందని సస్పెన్స్ అది. కానీ సీమాంధ్ర ప్రాంతంలో కుల ప్రాతిపదిక రాజకీయాలు జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. కనుక గంపగుత్తగా వైఎస్‌ఆర్‌సీపీకే అత్యధిక సీట్లు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. వాటిలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అలాగే ఇరు పార్టీల్లోనూ ఎంతో కొంత వ్యక్తిగత బలమున్న నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో ఆ సైకిల్, చేతి వాటాన్ని తట్టుకొని ఫ్యాన్ గాలి వీస్తుందని అక్టోపస్‌లా భవిష్యత్తు చెప్పడానికి ఆంధ్ర రాజకీయాలు అంతుచిక్కవు. కనుక అక్కడ ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు. కాకపోతే ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందనే దానిపైనే అంతా ఆసక్తి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసలు రాజకీయం ఆంధ్రలోనే ఉండబోతున్నది. తెలంగాణపై తేల్చేదాకా ఇక్కడ ఉద్యమపార్టీదే ఉన్నతస్థానం.
-రాజు

Labels: , , ,