Raju Asari
Saturday, 26 April 2025
Thursday, 10 April 2025
ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగాణ ప్రజల హక్కులు, నిరసనలు అంటూ డైలాగులు కొట్టిన సీఎం పవర్లోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నెగ్గడమే కాదు, తగ్గడమూ విజయమే అన్నది కేసీఆర్ ఉద్యమకాలంలోనే కాదు, పదేళ్ల పాలనలో చూపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మించాలని ప్రతిపాదిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రతిపాదనలకువ్యతిరేకంగా క్యాంపెన్ చేసింది. వాకర్లు, ప్రజలు కూడా నిరసనలను పరిగణనలోకి తీసుకున్నది. ఆ ప్రతిపాదనను విరమించుకున్నది. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే!ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తూ.. మూగ జీవాలైన పక్షులు, జంతువులను వాటి నివాస ప్రాంతాల నుంచి తరిమికొడుతూ.. ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ మాది ప్రజా ప్రభుత్వం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా, వారు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరుతున్నది
ఇది కదా తెలంగాణ సోయి అంటే!
తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే. చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!
Sunday, 30 March 2025
రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టమే
https://youtube.com/shorts/_r2lWAb0R_Q?si=1h68-jBEvAojO7Fy
https://youtube.com/shorts/-38ElK6EMfE?si=m3zaCUqPHRkUWm_h
https://youtube.com/shorts/Wb7DMLwmcTw?si=CVwMrW7Ec7ark6_v
https://youtube.com/shorts/ny4u3dH-yc8?si=wPBrMLRrCdsGWH4V
https://youtube.com/shorts/VAKc44CS6oA?si=pWicCV7xu4qucgD4
https://youtube.com/shorts/HePLtDy-aD4?si=aQS_IRnIW-48xU45
https://youtube.com/shorts/xD2JblepZYY?si=T7sSbBf4YtDAmFeW
Monday, 3 March 2025
ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?
తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్రధాని మోడీ ఉన్నారని, కానీ ఆయన నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ఇప్పటికీ మోడీని మంచిన బలమైన నాయకుడు లేడు. అందుకే 2014 ఎన్నికల్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2019లోనూ అంతకంటే ఎక్కువ మెజారిటీ రావడానికి కారణం ఆయన నాయకత్వమే. అయితే పదేళ్ల పాలనలో వైఫల్యాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిని తమకు ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. బీజేపీ గత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే అడ్డుకున్నాయి. దీంతో 400 లకు పైగా (చార్ సౌ పార్ ) స్థానాల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన నరేంద్రమోడీకి భారతీయ ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీని 230 స్థానాలకే పరిమితం చేశారు. 2014, 2019లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మద్దతు లేకుండానే సొంతంగా మెజారిటీ సాధించిన మోడీకి మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయినా కూడా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనూ, విపక్షాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. కేంద్రంలో చక్రం తిప్పాను అన్న చంద్రబాబు కూడా ఇప్పుడు మోడీనే ప్రశంసంల్లో ముంచెత్తుతున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దాన్ని వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి బైటికి వచ్చిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. మోడీ ముందు మోకరిల్లారు. అంతటి బలమైన నేత అయిన మోడీ నిర్ణయాలను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసంబద్ధమైన వాదన.
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మార్పు జరిగింది. మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన మాట నడుస్తలేదని, నేతలు తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వాదన ఏమిటంటే రేవంత్ కు రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల విషక్ష్ంలో ప్రధానితో భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయ పర్యటనే అంటున్నారు. తనకు మరో ఆప్షన్ ఉన్నదని చెప్పడమే రేవంత్ ఉద్దేశం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగానే డిసెంబర్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టాస్క్ ను కంప్లీట్ చేయడానికే మీనాక్షి నటరాజన్ కు అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో జరుగుతున్నదనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే రేవంత్ డైవర్సన్ పాలిటిక్స్ లో భాగంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు.
Featured post
-
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు కూటముల కూర్పు, అభ్యర్థుల తర్వాత అక్కడి ప్రజాభిప్రాయాన్ని అనేక సర్వే సంస్థలు తెలుసుకునే ప్రయత్నం చేశ...
-
వరుసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్ను చూపెట్...
-
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష...