Sunday 6 November 2011

ఒకటే దారి.. ఒకటే నినాదం

ఇవ్వాళ తెలంగాణ మొత్తం ప్రజానీకం కోరుతున్నది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ విలీనానికి ముందున్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్దరించాలని. అంతే కాని వచ్చే తెలంగాణ ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇప్పుడే ఎవరూ కోరుకోవడం లేదు. తెలంగాణలోని అన్ని వర్గాల వారి వివిధ పద్ధతుల్లో ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఈ మొండి ప్రభుత్వాల వైఖరి వల్లనే ఇప్పటికే ఏడు వందందలకు పై చిలుకు తెలంగాణ బిడ్డలు బలిదానాలు పాల్పడ్డారు. ఈ సమయం అందరూ ఒకే నినాదం తో కలిసి నడవాలి. మనలో మనమే కలహించుకుంటే అది శత్రువుకే లాభం చేకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర్రం సాకారం కావాలంటే అన్ని పార్టీల మద్దతు తో పాటు రాష్ట్రం లోని అన్ని వర్గాలు సంఘటితం కావాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home