ఉచిత ప్రయాణంపై ప్రజలు ఏమనుకుంటున్నారు?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటి కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఆపార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దృష్టికి వచ్చే ఉంటాయి. ఫ్రీ బస్సు వల్ల కండక్టర్లు మహిళా ప్రయాణికుల మధ్య ఘర్షణ నిత్యకృత్యంగా మారాయి. ఈ ఉచిత ప్రయాణానికి అర్హతలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దాన్ని కండక్టర్లు అమలు చేస్తున్నారు. ఆధార్ వంటివి చూపెట్టాలనే నిబంధన ఉన్నది. అదీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలని పేర్కొన్నది. కానీ కొంతమంది అప్డేట్ చేసుకోకుండా తాము చేసుకున్నామని, ఇంకా కొత్త కార్డు ఇవ్వలేదని, కావాలంటే ఆన్లైన్లో చూసుకోవాలని కండక్టర్తో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనల మేరకు లేకపోతే మా అధికారులకు నేను సంజాషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, తాను బాధ్యత వహించాలని కండకర్లు చెబుతున్నారు. నిబంధనలమేరకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే టికెట్ తీసుకోవాలని కోరుతున్నారు. కానీ ప్రయాణీకులు అందుకు అంగీకరించడం లేదు. దీంతో ఒకానొక సమయంలో కండక్టరే బస్సు దిగిపోతానని అని అంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఆర్టీసీ మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తాయి అంటున్నారు. ఉచిత ప్రయాణం విషయంలో ప్రతిపక్షాలు, అధికారపక్షాల వాదనల సంగతి పక్కనపెడితే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదే ప్రధానం కావాలి.
Labels: Chief Minister A. Revanth Reddy, Hyderabad, Maha Lakshmi Scheme, public transport, telangana, TSRTC
2 Comments:
అసలు ఆధార్ కార్డ్ చూపించాలి అనే రూల్ ఎందుకు? మనిషిని చూస్తే ఆడమనిషి అని తెలుస్తుందిగా?
తెలంగాణ పౌరులకు మాత్రమే ఉచితం.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home