Monday 30 January 2023

సందిగ్ధత వీడింది.. స్పష్టత వచ్చింది


తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఏడాదికి ప్రవేశపెట్టే బడ్జెట్‌ అంశం, గవర్నర్‌ ప్రసంగంపై స్పష్టత వచ్చింది. బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం విచారణ జరపడానికి సీజే ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? ఆలోచించుకోవాలని పేర్కొన్నది.  గవర్నర్‌ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా? కోర్టులది మితిమీరిన జోక్యం అని మీరే అంటారు కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఏం జరగనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. 


బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం,  గవర్నర్‌ ప్రసంగంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ద నిర్వహణకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను ముగించింది. 

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home