Wednesday 10 April 2024

కంటోన్మెంట్ ఫలితంపై ఆసక్తి


కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు ఖరారైంది. నివేదిత ను అభ్యర్థిగా ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

స్థానిక నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం తో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.


మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఈ స్థానం ఉన్నది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం పై ఆసక్తి నెలకొన్నది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీబీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే జరిగింది. బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ ఎస్ అభ్యర్థిగా లాస్య సోదరి నివేదిత పేరు దాదాపు ఖారారు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ఆ పార్టీ ప్రకటించింది. కాషాయ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home