Tuesday 24 April 2012

ప్రజా ప్రస్థానంతో ప్రయోజనం ఎవరికి?
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పూర్తిగా అధికార పార్టీ ప్రచార కార్యక్రమంగా తయారైంది. ప్రభుత్వం గతంలో  నిర్వహించిన రచ్చబండ, ప్రజాప్రస్థానం కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. మంత్రి దానంతో పాటూ ఆ పార్టీ నేతలు ఇదే విషయం పై తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మరింత చేరువ కావడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి మీడియాలో ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చిన ప్రజానీకం పై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తున్నది. నిరసన తెలపుతునవారిని నిర్దాక్షనీయంగా బయటికి గెంటి వేస్తున్నది. అయతే ఈ కార్యక్రమ ఉద్దేశం మాత్రం త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో పార్టీ పరువును కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై ఆ పార్టీ అధిష్టానం అసంతృప్తి తో ఉన్న విషయం తెలిసిందే. బొత్స, కిరణ్ ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య, అంతర్గత పోరువల్ల పార్టీ రాష్ట్రంలో చాలా బలహీన పడిపోయిందని ఇటివలే రాష్ట్ర పర్యటనకు వచ్చి కాంగ్రెస్ అధిష్టాన దూత వాయిలార్ రవి సోనియా దీనిపై ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు సమాచారం.దీనికి ఈ ఇరువురు నేతలపై 'వేటు రూటే' ఉత్తమం అని  కాంగ్రెస్ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికల తరువాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంత వరకు ఉప ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనే ఉద్దేశం తో రవిని రాష్ట్ర పర్యటనకు పంపారు. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని రవి సూచించారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆవహించిన నిస్తేజాన్ని పోగొట్టడానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సంగతి ఎలా ఉన్నా..అలసత్వం మాత్రం పనికి రాదని తేల్చి చెప్పింది. అందుకే ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో పర్యటనలు చేస్తూ కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు. తన కుర్చికి ముంచు కొస్తున్న ముప్పును తప్పించుకోవడానికి కిరణ్ చాలా కష్టపడుతున్నారు. ఉప ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులను ఆదేశించారు. ఇంతకాలం ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికార పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుని వైకరిపై అధిష్టానం అక్షింతలు వేయడంతో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి.  అందుకే ముఖ్యమంత్రి  ప్రజా ప్రస్థానం పేరుతో పార్టీ ఎన్నిక ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచార కార్యక్రమ సభల్లో ముఖ్యమంత్రి తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తున్నది.రాష్ట్రంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా వందకోట్లు కేటాయించినట్టు, రైతులకు ఏడుగంటలు విద్యుత్తూ అందిస్తున్నట్టు ఉపన్యాసాలు ఇస్స్తున్నారు. అయితే గుక్కెడు నీళ్ళ కోసం రాష్ట్రంలోని చాలా గ్రామాల ప్రజలు  మైళ్ళ దూరం వెళుతున్నారు. కరెంటులేక పంటలు ఎండిపోతున్న వాస్తవాలు మనకు కనిపిస్తున్నయి. స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వార్తలు రోజూ మీడియా లో వస్తున్నాయి. ఇవ్వన్ని ప్రజా సమస్యలుగా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిచడం లేదు కాబోలు. నా రాజ్యం రామ రాజ్యం అని కిరణ్ భావిస్తున్నారు కావచ్చు. గతంలో ఈ ప్రభుత్వం చేయనన్ని పనులు తన ప్రభుత్వం చేసిందని ముఖ్యమంత్రి ప్రతీ సభలో గొంతెత్తి అరుస్తున్నారు. తమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని తనకు తనే ప్రశంశ పత్రాలు ఇచ్చుకుంటున్నారు. మరి ప్రజా సమస్యలే లేనప్పుడు ఈ 'ప్రజా ప్రస్థానం' ఎవరి కోసం? దీంట్లో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రభుత్వాధినేతలు చెబితే బాగుంటుంది.
-రాజు ఆసరి 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home