Thursday 1 August 2013

ఆఖరి అస్త్రాలు



తెలంగాణ అనుకూల ప్రకటన వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న లగడపాటి ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలంగాణ బిల్లును ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు లో ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ................................ నే ఉంటాడు. కాబట్టి లగడపాటి హార్డ్ కోర్ సమైక్యవాది అయిపోయాడు. ఇక ఇప్పుడు కొంత మంది సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ పదవులకు రాజీ'నామాలు' చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రాజీనామాలతో వస్తే రాష్ట్రపతి పాలనే వస్తుంది తప్పా రాష్ట్ర విభజన పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఇదే విషయాన్నీ దిగ్విజయ్, షిండే లు చెప్పారు. నాలుగేళ్ళ కిందట నల్లారి,నారా వారు ఆడిన రాజీ డ్రామా లతో కేంద్రం వెనక్కి తగ్గింది. దాని ఫలితంగా కార్యకర్తలను  కాపాడుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి వేల కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అందుకే బాబు ఆ తప్పు మళ్ళీ చేయలేదు. కానీ విభజన పాపం బాబు, వైఎస్అర్ సీపీల పై కి నెట్టి లబ్ధి పొందాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన వైఎస్అర్ సీపీ ఎమ్మెల్యేల 'రాజీ'నామాలు ఏమయ్యాయో తెలియదు. సీమాంధ్ర నేతల రాజీనామాల వెనుక ఉన్న స్టార్ బాట్స్ మెన్ ఎవరో అందరికి తెలుసు. లగడపాటి చెప్పిన ఆ బాట్స్ మెన్ హస్తినలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఇప్పటి రాజీనామాలు వారి ఆఖరి అస్త్రాలు. ఈ శుష్క యుద్ధం లో వాళ్ళు మీడియా ముందు హీరోలుగా కనబడినా...రాష్ట్ర విభజనపై కేంద్రం మనసు మారదు.

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home