Wednesday 5 June 2013

తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు.,ఇక 2001లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ నాడు 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరికి పంపారు. దశాబ్ద కాలంగా తెలంగాణ సమస్య కాంగ్రెస్ కోర్టులో ఉన్నది. ఇప్పుడు తెలంగాణపై భిన్న అభిప్రాయాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే. ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నట్టు సంప్రదింపులు, చర్చలు అనేకసార్లు జరిగాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార పార్టీలోనే ఏకాభిప్రాయాన్ని సాధించలేని వారు తెలంగాణ ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనడం ఇప్పటి విషాదం. షిండే పెట్టిన ‘నెల’ గడువును తప్పుపట్టిన ఆజాద్ ఇప్పుడు మరో గడువు పెట్టినా, షకీల్ అహ్మద్ తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పినా అది వాళ్ల పార్టీ నేతలను కాపాడుకోవడానికే తప్పా ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాత్రం కాదు. మీడియాలో వస్తున్నట్టు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడే దానికి విలువ ఉంటుంది. తెలంగాణఫై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ పార్టీని వీడుతున్న నేతలను చూసి హస్తిన పెద్దలే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర మీడియా కూడా వలసలను కట్టడి చేసేందుకు పూటకో కథనాన్ని ప్రసారం చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోపై హస్తినలో ఏదో జరుగుతున్నదనే హడావుడి.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home