Saturday 13 July 2013

సమా‘వేషాలు’


దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామన్నారు. ఇక సంప్రదింపులు ఉండవు అన్నారు. ఇక నిర్ణయమే మిగిలింది అన్నారు. అది తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఒక విధానం ఉండాలి. అలాగే తెలంగాణపై ఇప్పటి వరకు ఏ అభిప్రాయం చెప్పని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని కమిటీలు వేసింది. చర్చలు, సంప్రదింపుల పేరుతో ఏకాభిప్రాయం సాధిస్తామన్నది. తెలంగాణపై దేశవ్యాప్తంగా మెజారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ హామీ ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం దీనిపై ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయం లేకపోవడమే ఇప్పటి విషాదం. తెలంగాణ అంశం తేలాలంటే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలి. అది జరగనంత కాలం కమిటీలు, చర్చలు, సంప్రందిపులు, కోర్ కమిటీ సమావేశాలు, సీడబ్లూసీలో చర్చించడాలు, రోడ్ మ్యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమా‘వేషాలు’ సమస్య సాగదీతకే తప్ప, పరిష్కారం కోసం కాదు.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home