మన సాంస్కృతిక ప్రతీక
తెలంగాణ సంస్కృతి విశిష్టమైనది. ఇక్కడి పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు మొదలు కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ కాలంలో అనేక చారిత్రక నిర్మాణాలు జరిగాయి. వారంతా ప్రకృతి ప్రేమికులు. అందుకే వాళ్ళ నిర్మాణాలు అన్నీ సహజ వనరుల సంరక్షణతోనే ముడిపడి ఉన్నాయి. కాకతీయ పాలకుడు గణపతిదేవుడు బందీగా ఉన్నప్పుడు వారి సేనాని రేచెర్ల రుద్రుడు ఆ రాజ్యాన్ని కాపాడటమే కాదు, అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవ్వాళ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో నాటి కాకతీయుల సాంస్కృతిక ప్రతీకలు ఆ దేవాలయాల నిర్మాణం లో మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయ నిర్మాణాన్ని చూసిన అంతర్జాతీయ పురాతత్వ నిపుణులు కూడా అబ్బురపడే,ఆశ్చర్యపడే సాంకేతిక పరిజ్ఞానం రామప్ప దేవాలయం సొంతం. కాకతీయుల నాటి అద్భుత నాట్య కళ పేరణి నృత్య విశేషాలు రామప్ప దేవాలయ శిల్పాల్లో కనిపిస్తుంది. రుద్రుడు మనకే కాదు ప్రపంచానికి గొప్ప వారసత్వ సంపదను అందించాడు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home