తెలంగాణ సంస్కృతి విశిష్టమైనది. ఇక్కడి పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు మొదలు కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ కాలంలో అనేక చారిత్రక నిర్మాణాలు జరిగాయి. వారంతా ప్రకృతి ప్రేమికులు. అందుకే వాళ్ళ నిర్మాణాలు అన్నీ సహజ వనరుల సంరక్షణతోనే ముడిపడి ఉన్నాయి. కాకతీయ పాలకుడు గణపతిదేవుడు బందీగా ఉన్నప్పుడు వారి సేనాని రేచెర్ల రుద్రుడు ఆ రాజ్యాన్ని కాపాడటమే కాదు, అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవ్వాళ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో నాటి కాకతీయుల సాంస్కృతిక ప్రతీకలు ఆ దేవాలయాల నిర్మాణం లో మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయ నిర్మాణాన్ని చూసిన అంతర్జాతీయ పురాతత్వ నిపుణులు కూడా అబ్బురపడే,ఆశ్చర్యపడే సాంకేతిక పరిజ్ఞానం రామప్ప దేవాలయం సొంతం. కాకతీయుల నాటి అద్భుత నాట్య కళ పేరణి నృత్య విశేషాలు రామప్ప దేవాలయ శిల్పాల్లో కనిపిస్తుంది. రుద్రుడు మనకే కాదు ప్రపంచానికి గొప్ప వారసత్వ సంపదను అందించాడు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment