- పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- భారత ఇంధన వ్యూహం ఇదే!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సవాళ్లపై ప్రధాని నరేంద్ర మోడీస్పందించారు. ఈ గ్లోబల్ సంక్షోభ ప్రభావం పడని దేశమంటూ ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో దేశ ఇంధన భద్రతపై సమీక్ష నిర్వహించిన ప్రధాని, ప్రస్తుత అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారత్ అనుసరించాల్సిన బహుముఖ వ్యూహాన్ని ఆవిష్కరించారు.పశ్చిమాసియాలో సంఘర్షణ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతినడం వల్ల ప్రతి దేశంపై దీని ప్రభావం ఉంటుందని మోడీఆందోళన వ్యక్తం చేశారు.
- భారత వ్యూహం - ఐదు స్తంభాలు
ఇంధన వనరుల వైవిధ్యం: కేవలం ఒక ప్రాంతంపై ఆధారపడకుండా వేర్వేరు దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను వేగవంతం చేయడం.
వ్యూహాత్మక నిల్వలు: దేశంలో ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను (SPR) పూర్తిస్థాయిలో నింపడం.
పునరుత్పాదక ఇంధనం: సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి స్వదేశీ ఇంధన వనరుల వినియోగాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచడం.
పొదుపు చర్యలు: ఇంధన వృథాను అరికట్టేలా ప్రజల్లో అవగాహన పెంచడం.
దౌత్యపరమైన చొరవ: సరఫరా మార్గాలకు ఆటంకం కలగకుండా అంతర్జాతీయ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరపడం.
ప్రజలకు భరోసా
దేశంలో చమురు నిల్వలు తగినంతగా ఉన్నాయని, సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ప్రధాని భరోసా ఇచ్చారు. పెట్రోల్ పంపుల వద్ద ఇంధన కొరత లేదని, వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కష్టకాలంలో భారత్ తన శక్తి సామర్థ్యాలను చాటుకుని, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.