కర్ణాటక కాంగ్రెస్దే!
దక్షిణాది భారతంలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన కర్ణాటక ఎన్నికలవైపు దేశమంతా ఆసక్తిగా చూసింది. ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జరగనున్నమధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సత్తా చాటాలని బీజేపీ భావించింది. కర్ణాటక ఎన్నికల చరిత్ర చూస్తే గత 25 ఏళ్లలో 1999, 2013 లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈసారి ఆ రికార్డులను బద్దలు కొట్టాలని కమలనాథులు భావించారు. అయితే బీజేపీకి చెక్ పెట్టి ఈ విజయం ద్వారా ఈ ఏడాది జరగనున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మధ్యప్రదేశ్లోనూ విజయానికి బాటలు వేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని 2024 లోక్సభ ఎన్నికలకు గెలుపు దారులు వేయాలని కాంగ్రెస్ గట్టిగా కొట్లాడింది. ప్రధానంగా బీజేపీ వైఫల్యాలపైనే ఫోకస్ పెట్టింది. అవినీతి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా హస్తం పార్టీ ఎంచుకున్నది. ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపినట్టు ఎగ్జిట్పోల్ అంచాలను బట్టి తెలుస్తోంది. బీజేపీలో నెలకొన్న అంతర్గత కలహాలు, కొంతమంది సీనియర్లకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారంతా తిరుగుబాటు చేశారు. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందు ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి లింగాయత్, వొక్కలిగ సామాజికవర్గాలకు పంచినా అవి బీజేపీకి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు. గుజరాత్లో ప్రధాని మోడీ తానే సీఎం అభ్యర్థిని అన్నట్టు చేసిన ప్రచారం ఇక్కడ కూడా బీజేపీ అమలు చేసింది. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి అంతా తానే అన్నట్టు 18 భారీ బహిరంగ సభలు, 6 రోడ్ షోలు చేసినా బీజేపీని విజయతీరాలకు చేర్చలేవు అని సర్వేల సారాంశం. గుజరాత్లో వలె ఇక్కడ కూడా కొత్తవారికి టికెట్లు ఇచ్చిన ప్రయోగం విఫమౌతుందని తెలుస్తోంది.
ఇక పాతమైసూర్ ప్రాంతంలో గట్టి పట్టున్న జేడీఎస్ కు ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే పోలింగ్ జరుగుతున్న సమయంలోనే జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల ఫలితాలపై సంచలన కామెంట్లు చేశారు. ఈ ఎన్నికలు జేడీఎస్కు పెద్ద దెబ్బ అని మా పార్టీకి 25 సీట్లకు మంచి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
సర్వేల శాస్త్రీయత ఎంత అన్న చర్చను పక్కనపెడితే ఎగ్జిట్పోల్స్లో చాలావరకు కాంగ్రెస్ పార్టీనే మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్ నౌ, పీపుల్స్ పల్స్, సీ ఓటర్ లాంటి సర్వేలు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ను దగ్గరలో ఉంటుందని పేర్కొన్నాయి. 224 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అన్నది ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. మే 13న కర్ణాటక ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎగ్జిట్పోల్స్ అంచనాలు ఇవే
రిపబ్లిక్ టీవీ సర్వే: బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6
టీవీ9 భారత్వర్ష్ సర్వే: బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
జీ న్యూస్ సర్వే: బీజేపీ 79-94, కాంగ్రెస్ 103-118, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5
పోల్ స్ట్రాట్ సర్వే: బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
ఇండియా టుడే: కాంగ్రెస్-122-140, బీజేపీ- 62-80, జేడీఎస్-20-25, ఇతరులు 0-3
టైమ్స్ నౌ : కాంగ్రెస్- 106-120, బీజేపీ- 78-92, జేడీఎస్-20-26, ఇతరులు 2-4
సీ ఓటర్ : కాంగ్రెస్- 100-112, బీజేపీ- 83-95, జేడీఎస్-21-29, ఇతరులు 2-6
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్- 107-119, బీజేపీ- 78-90, జేడీఎస్-23-29, ఇతరులు 1-3
జన్కీ బాత్ : కాంగ్రెస్- 91-106, బీజేపీ- 94-`117, జేడీఎస్-14-24
Labels: Basavaraj Bommai, bjp, BS Yediyurappa, congress, JD(S), Karnataka exit polls 2023, Narendra Modi, Priyanka gandhi, Rahul ghandi
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home