కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే అని బెంగాల్ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలని సవాల్ విసిరారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించాను. కానీ ఎక్కువ సీట్లు కావాలని ఆ పార్టీ కోరడం వల్లనే పొత్తు కుదరలేదన్నారు. ఎన్నికల అనంతరం భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
దీదీ బాటలోనే ఆప్, ఎస్పీ
ఇండియా కూటమిలో కీలకంగా పనిచేసిన మమతాబెనర్జీ తన ప్రతిపాదనలను ఆపార్టీ అంగీకరించేలేదన్న కారణంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీదీ బాటలోనే ఆప్ పంజాబ్, ఢిల్లీలలో, ఎస్పీ యూపీలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. యూపీలో కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆమోదించలేదు. అయితే ఇప్పటికే అఖిలేశ్ ఆర్ఎల్డీతో ఒప్పందం చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ కూడా దూరంగా జరగడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
Labels: #Congress SamajwadiParty LokSabha2024 CoalitionPolitics SeatSharingConflict, Arvind Kejriwal, mamata banerjee, tmc
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home