Thursday 26 April 2012

పరువు పోయాక పదవులెందుకు?

తెలంగాణపై పార్లమెంట్ వేదికగా అధికార టి కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తే సస్పెన్షన్ గురయ్యారు. దీని వెనుక ఆ పార్టీ ప్రయోజనాలు ఎలా ఉన్న పరువు పోయింది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలదే. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని నిరసించలేక, ఈ ప్రాంత ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక పాపం టి కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడుతున్నారు. ఇంత జరిగిన తమ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా లేరు మన వాళ్ళు. పైగా జానారెడ్డి వంటి నేతలు అధిస్టానం ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీ ప్రతిష్టను కాపాడుతామని ప్రతినబూనుతున్నారు. ఈ ప్రాంత నేతల ఈ బానిస మనస్తత్వమే తెలంగాణ ప్రజలకు మరణ శాశనాలు అవుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. సీమాంధ్ర లో ఉన్న కాస్తో కూస్తే ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ అంశాన్ని, ఈ ప్రాంత నేతలను ఆ పార్టీ వాడుకోవాలని చూస్తోంది. ఈ సస్పెన్షన్ ఉదంతం అప్పుడెప్పుడో వై ఎస్ సీమాంధ్ర లో లబ్ధి పొందడానికి సృష్టించిన ప్రాంతీయ విద్వేషాల స్క్రిప్ట్ ను కొంత మార్చి యిప్పుడు అమలు చేస్తున్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఉద్యమం వాళ్ళ ఈ ప్రాంత ప్రజల్లో గొప్ప చైతన్యం వచ్చింది. అందుకే ఇవ్వాళ తెలంగాణ అనుకూల, వ్యతిరేక వర్గాలను ఈ ప్రాంత ప్రజలు పాలు నీళ్ళ వేరుచేశారు. కాంగ్రెస్, టిపిడి లు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా ఆ కుట్రలను చాకచక్యంగా తిప్పి కొడుతున్నారు. అలాంటి చైతన్యం యిప్పుడు సీమాంధ్ర ప్రజానీకంలో రావలె. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంట్ లో పాడిందే పాట పాసుపండ్ల పాట అన్నటు వ్యవహరించకుండా పదవులను వదులుకొని ప్రజా క్షేత్రంలోకి రావలె. ప్రజల ఆకాంక్షను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో వదిలేశారు. ఇక ఆ పార్టీని, ఆ పార్టీ పదవులను పట్టుకొని వేలాడితే ప్రయోజనం ఏముంటుంది. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటే ఆన్న టి కాంగ్రెస్ నేతల పరువు అయినా దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేలుస్తుందని గానీ, రాష్ట్రాన్ని ఇస్తుందని కానీ ఈ ప్రాంత ప్రజలు నమ్మడం లేదు. ఐదున్నర దశాబ్దాలుగా ఈ అంశాన్ని వాడుకొని, అధికారంలోకి రావడం, వచ్చాక ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిచడం ఆ పార్టీ చేస్తూనే ఉన్నది. అందుకే ఆ పార్టీని, దాని అడుగులకు లోపాయికారంగా మద్దతునిస్తున్న టిడిపిని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారు. అందుకే తెలంగాణ పై ఇక దాగుడు మూతలకు కాలం చెల్లిందని ఈ ఇరు పార్టీ గ్రహించాయి. అందుకే యిప్పుడు మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టాయి. దీనికి తెలంగాణకు సై అన్న బిజే పీ కూడా యిప్పుడు శ్రుతి కలిపింది. అందుకే అధికార పార్టీ ఎంపీల సస్పెన్షన్ కు ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపింది. మహబూబ్ నగర్ లో గెలిచిన సంతోషం నుంచి ఇంకా ఆ పార్టీ నేతలు బయిటికి రానట్టున్నారు. అందుకే పాలమూరు ఫలితమే పరకాలలో పునరావృతం అవుతుందని బీరాలు పలుకుతున్నారు. చంద్రబాబు గొడుగు కింద తెలంగాణ ఉద్యమం చేస్తున్న టి టిడిపి ఫోరానికి పట్టిన గతే వెంకయ్య నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న బిజెపి తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ప్రజలు ప్రశ్నించబోతున్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న పార్టీ నినాదం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎందుకు వినిపిస్తున్నది. సీమాంధ్ర లోని పదిహేడు అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానాల్లో ఆ వాదం ఎందుకు మరుగున పడుతున్నదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమాధానం చెప్పాలే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో జరగనున్న స్థానాల్లో స్పష్టత లేకుండా.. కేవలం పరకాల స్థానం పైనే పదేపదే ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు చెబుతున్న రెండుకండ్ల సిద్ధాంతానికి యిప్పుడు బీజే పీ అనుసరిస్తున్నవిధానానికి తేడా ఏమిటో వెంకయ్య, కిషన్ రెడ్డి లు ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంజాయిషీ ఇచ్సుకోవలె. పాలమూరులో బీజే పీ కి అభ్యర్థి దొరకక పోతే రాత్రికి రాత్రే గతంలో టిఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన యె న్నం శ్రీనివాస రెడ్డి ని రంగం లోకి దించి పాలమూరులో విజయం సాధించి నంత సులువు కాదు పరకాల. పాలమూరులో ఓట్ల కోసం ఆ పార్టీ వేసిన ఎత్తుగడలు పరకాలలో పారవు. పాలమూరు ఎన్నిక తరువాత టిఆర్ఎస్ కు అసలు విషయం తెలిసివస్తుందని బీజే పీ నేత ప్రకాష్ జవదేకర్ మాటలు... యిప్పుడు పరకాల ఎన్నిక తరువాత వెంకయ్యకు, కిషన్ రెడ్డికి వాస్తవాలు తెలిసి వస్తాయి. అందుకే పాలమూరు గెలుపు వాపు కాదు బలుపు అనుకునే బీజే పీకి ఓరుగల్లు ప్రజలు సరైన నిర్దేశనం చేయనున్నారు. అందుకే అటు  టి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఇటు బీజే పీ నేతలు పరువు పోకముందే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ నడుచుకుంటే మంచిది
rajuasari@gmail.com


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home