Wednesday 16 May 2012

పరకాల పార్టీలకు ప్రతిష్టాత్మకమే!

పరకాలలో టీఆర్ఎస్ మోలుగురు భిక్షపతిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అందరి దృష్టి పరకాల ఎన్నిక పైనే పడింది. పరకాల ఎన్నిక ప్రధాన పార్టీల అన్నింటికీ ప్రతిష్టాత్మకమే! ఉప ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ నియోజకవర్గం అందరినీ ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి. పరకాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీల మధ్యనే ఉండబోతున్నది. ఇక్కడ అధికార పార్టీది నామమాత్రపు పాత్రే. పోరుగల్లు ఓరుగల్లు కేంద్రంగా జరుతున్న ఈ ఉప ఎన్నికల్లో జేఏసీ ఎవరికి మద్దతు ఇస్తుంది? పాలమూరు ఫలితమే పరకాలలో పునరావృతం అవుతుందా? టీఆర్ఎస్, జేఏసీకి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాల వల్ల ఎవరి లాభం అనే చర్చలు జరుతున్నాయి. కానీ యిప్పుడు మీడియాలో జరుగుతున్నచర్చల తాలూకు ప్రభావం పరకాల ఎన్నికల్లో ఉండకపోవచ్చు. పాలమూరు ఎన్నికకు, పరకాలకు చాలా తేడా ఉన్నది. అక్కడి ఎత్తుగడలు ఇక్కడ పనిచేకపోవచ్చు. ఇక్కడ పోటీలో ఉన్నటీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీల అభ్యర్థులకు స్థానికంగా గట్టి పట్టు ఉండడం వలన గెలుపు ఎవరిదో చెప్పడం అంత వీజీ కాదు. కానీ ఒత్తిడి మాత్రం కొండ దంపతులపైనే ఉన్నది అనేది స్పష్టం అవుతున్నది. కొండ సురేఖపై అనర్హత వేటు పడేవరకు వారి నోటి నుంచి వచ్చిన పదం వైఎస్. అనర్హత వేటు పడగానే వారి స్వరంలో మార్పు వచ్చింది. తను జగన్ కోసం కాకుండా, తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకొస్తున్నారు. ఇంకా పరకాలలో తనకు పోటీ టీఆర్ఎస్ అనే ఆమె చెప్పకనే చెబుతున్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అంటే తాను తప్పుకుంటాను అని కొండ సురేఖ పదేపదే ప్రకటిస్తున్నారు. ఆమెపై 2009 ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు పదిహేను వేల ఓట్లతో ఓడిపోయినా భిక్షపతినే అందరి అమోదయోగ్యంతో ఎంపిక చేశామన్నది. కానీ ఇందుకు వేరే కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జేఏసీ నేత సహోదర్ రెడ్డిల పేర్లు కూడా వినిపించాయి.కానీ స్థానిక, సామాజిక అంశాలు తెరపైకి రావడంతో టీఆర్ఎస్ భిక్షపతిని ఎంపిక చేసింది.బీజేపి నేతలు చెబుతున్నట్టు పాలమూరు వలె పరకాలలోను పాగా వేస్తామన్నవారి మాటలు అంత సులువు కాదు. పాలమూరు యెన్నం పోటీ చేసింది బీజేపి అభ్యర్థిగా అయినా స్థానికంగా ఆయనపై కొంత సానుభూతి, పేరు  కూడా ఉన్నది, కానీ ఇక్కడ బిజేపీ అలాంటి పరిస్థితి లేదు. అయితే ఆ పార్టీ కొన్ని ఓట్లను చీల్చగలదేమో కానీ అవి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో ఓరుగల్లు ప్రజలు మానుకోట, పాలకుర్తి యుద్ధాలను ఎదురుకొన్నారు. అవేకాదు రాయినిగుడెంలో ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టించిన వనితలు ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉన్నదో. ఉద్యమకారులు ఎవరో, ఉద్యమ ద్రోహులు ఎవరో హంస వలె పలు నీళ్ళలా వేరుచేయగల చైతన్యం వరంగల్ ప్రజలకు ఉన్నది, కనుక ఇక్కడ ఫలితం పాలమూరు కంటే భిన్నంగానే ఉంటుంది. ఇక వైఎస్ఆర్ సీపీ కి ఈ ఎన్నిక పెద్ద సవాలే.ఎందుకంటే పార్లమెంటులో జగన్ తెలంగాణకు వ్యతిరేకగా ప్లకార్డ్ పట్టిన ఉదంతం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నది. అలాగే జగన్ వెంట నడుస్తున్న తెలంగాణ నేతల్లో కొండ దంపతులే బలమైన నాయకులు. ఈ ప్రాంతంలో వారికి  గట్టి పట్టుతో పాటు వ్యక్తిగత పరిచయాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి తమ గెలుపు నల్లేరు మీద నడకే అని కొండ దంపతులు భావించడం లేదు. ఈ ఎన్నిక సమైక్య, తెలంగాణ వాదాలకు జరుతున్న ఎన్నిక అక్కడ ప్రచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ జగన్ ఇమేజ్ కొండకు గుడి బండల తయారయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే టీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలుపు ప్రధానమే. ఉద్యమ పార్టీగా ఇక్కడ పాలమూరు ఘటనలు పునరావృతం కాకుండా ఆ పార్టీ జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేసింది. పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకున్నది. కాబట్టి బిజెపి ఎత్తుకున్న నినాదం పాలమూరు-పరకాల-పార్లమెంటు ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home