Tuesday 8 May 2012

కోస్తాలో కరివే'కాపులు' ఎటువైపు?
 విజయవాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై  యిప్పుడు రాష్ట్రంలో చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశిలీస్తే రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలు తమ ఉనికిని కోల్పోయాయి. రెండోది  కోస్తాలో ప్రధాన రాజకీయ పార్టీలు కమ్మ, కాపు సామాజిక వర్గాలను తమవైపు ఎలా తిప్పుకోవాలో అని ఆలోచిస్తున్నాయి. కోస్తా ల రెడ్డి, కమ్మ వర్గాలే అధికారాన్ని చేలాయిస్తున్నయనే అసంతృప్తి కాపు వర్గ నేతల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అవకాశం వస్తే అధికార పీటంపై కూర్చోవాలని ఆ వర్గ నేతలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ రెడ్డి, కమ్మ వర్గ నేతలు ఆ వర్గ ఓట్ల కోసం వారిని కరివే పాకులుగానే వాడుకుంటున్నారు. వారి ఆశలపై నీళ్ళు చల్లుతున్నారు.  కోస్తాలో కమ్మ, కాపు వర్గాల మధ్య వైరం దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కమ్మ వర్గం టిడిపి వెంట ఉంటే. కాపులు కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. కోస్తాలో కాపు వర్గ నేత వంగవీటి మోహన రంగ హత్య తరువాత రాజశేఖర్ రెడ్డి ఆ వర్గానికి దగ్గరయ్యారు. దీంతో కోస్తాలోని మెజారిటీ కాపు వర్గ నేతలంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజకీయంగా తమ బద్ధ శత్రువులైన కమ్మ వర్గాన్ని ఎదురుకోవడానికి కాంగ్రెస్ పార్టీ యే సరైన వేదిక అని వాళ్ళు భావిస్తున్నారు. అధికార పీటంపై ఆశ చావకున్న అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గంతో ఇంత కాలం అంతకాగుతూ వస్తున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం తగ్గిపోయింది.ఆ సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్ వెన్నంటే ఉంటున్నారు. యిప్పుడు జగన్ వేరు కుంపటి పెట్టుకోవడంతో ఆ వర్గ నేతలు వైఎస్ఆర్ సీపీ బాట పాడుతున్నారు. దీంతో ఇక ఆ ప్రాంతంలో మిగిలిన కాపు వర్గం ఎటువైపు వెళుతుందో అనే ఆసక్తి ఉండడం సహజమే. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రోశయ్య తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నిక చేసింది. రెడ్డి సామాజిక వర్గం తమ వెంటే ఉండాలని భావించి ఆ పని చేసి ఉండవచ్చు. అందుకే కిరణ్ కూడా తన ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ కి పెద్దగ ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే మొన్న జగన్ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎక్కువగా ఉన్నారు. దీంతో కంగు తిన్న కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన కాపు సామాజిక నేత చిరంజీవికి యిప్పుడు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి పీటం కన్నసిన కాపు సామాజిక వర్గ నేతలు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొత్స కూడా కోవడం, మాజీ పీసీసీ అధ్యక్షులు కిరణ్ సర్కారుకు వ్యతిరేకంగా అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికే కిరణ్  అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయినా కూడా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేక పోయింది. దీంతో  యిప్పుడు కూడా కిరణ్ కడప జిల్లాలోని రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో  కూడా తన వర్గ నేతల పేర్లే అధిష్టానానికి పంపినట్టు వార్తలు వచ్చాయి. అయితే కడప జిల్లా లో బలిజ సామాజిక ఓటర్లు  అధికంగా ఉన్నాయి . దీంతో  బిసిలు అధికంగా ఉన్నదా రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో కిరణ్  పంపిన పేర్లను తిరస్కరించినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు. టిడిపి కూడా నారా, నందమూరి వంశాల మధ్య ఆధిపత్య పోరు గత కొంత కాలంగా  కొనసాగుతున్నది. యిప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణాను వదిలి పెట్టి సీమాంధ్ర ప్రాంతం లోనే అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పడు జరగబోయే ఉప ఎన్నికలు సెమి ఫైనల్ గా అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో  రాయలసీమ ప్రాంతంలో జగన్ పార్టీ  ముందంజలో ఉన్నదని ఇప్పటికే మీడియాలో విశ్లేషణలు, సర్వేలు వస్తున్నాయి. దీంతో కోస్తాలో కీలక మైన కాపు వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ కాపు వర్గ నేత వంగవీటి రాధను వైఎస్ఆర్ సీపీలో ఆహ్వానించారు. అంతే కాదు ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాధను కేవలం పార్టీలోకే తీసుకోవడమే కాకుండా తన తమ్ముడిలా గుండెల్లో పెట్టుకుంటానని ప్రకటించారు. యిప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు ఆని  ఎన్నికలను దృష్టిలో పెట్టు కొని చేస్తున్నవే. నిజంగా ఆయా పార్టీలు  కాపు వర్గాలపై కానీ, దళిత, బహుజన వర్గాలపై కానీ ప్రేమ ఏమీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లో  పెద్ద పీట వేస్తామని వాగ్దానాలు చేయడం మాములే. ఆచరణలో మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. నేర వేర్చరు కూడా. ఉప ఎన్నికల తరువాత ఈ కోస్తా కరివే 'కాపు'లు ఎటువైపు ఉంటారో తేలిపోనుంది. అలాగే జగన్ కలిసిన వల్లభనేని వంశీకి కూడా టిడిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజయవాడలో దేవినేని ఉమా  చంద్రబాబు వర్గమైతే, కోడలి నాని, వల్లభనేని వంశీ నందమూరి వర్గం. వీరి ఇరువురి మధ్య కూడా  విబేధాలు ఇప్పటికే చాలా సార్లు బయటప్పడ్డాయి. యిప్పుడు వంశీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తారా? లేదా జగన్ ఆహ్వానం మేరకు ఆయనతో కలిసి వెళతారా వేచి చూడాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home