Monday 9 February 2015

సర్కారు బడుల పటిష్ఠత


టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధవిద్యను అందిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వా లు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నాయి. కానీ అందుకు సంబంధించిన కార్యాచరణ ఏదీ కనిపించలేదు. అందుకే ఇప్పు డు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతా కార్పొరేట్ మ యం అయిపోయిం ది. అలాగే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆంగ్లమూ తప్పనిసరి అయింది. తెలుగు మీడియంలో చదివినవారు రాణించడం లేదా? అంటే.. ఎంతో రాణించిన వారూ ఉన్నారు. అయితే ఆంగ్లం అనేది ఒక మాధ్యమం మాత్ర మేనన్న స్పృహ కొరవడింది. ఇవ్వాల పేద, ధనిక అనే తేడా లేకుండా తమ పిల్లలు ఉన్నతస్థానానికి ఎదగాలని, అందుకు మంచి విద్య అందించడం కోసం ఆర్థిక స్తోమతలను కూడా లెక్కచేయకుండా ఇంగ్లీష్ చదువులను కోరుకుంటున్నారు.
అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు వెలిశాయి. ఇది ప్రభుత్వాల ప్రోద్బలంతోనో, ప్రజల సహకారంతోనో ఏర్పడలేదు. కేవలం కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా జరిగింది. అందుకే తెలుగు మీడియం కంటే ఇంగ్లీషు మీడియం బోధిస్తున్న పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. అయితే ప్రభుత్వ పాఠశాల ల్లో గతంలో ఇంగ్లీష్ మీడియంలో సక్సె స్ స్కూళ్ల ను ప్రారంభించారు. దీనికోసం మొక్కు బడి శిక్షణా తరగతులు నిర్వహిం చడం వల్ల అది విజయవంతం కాలేదు. ఇప్పుడు మోడల్ స్కూళ్ల పేరుతో ఇంగ్లీ షు మీడియంలో బోధిస్తున్నారు. దీనిలో నూ సమస్యలున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేవారు చాలా ప్రైవేట్ పాఠశాలల్లో బోధించేవారి కంటే మంచి అర్హతలు ఉన్నవారే. ప్రైవేట్ పాఠశాలలోనూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసిన వారితో పాటు డిగ్రీ చదవిన వారు బోధిసున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చేం త జీతాలు కాకుండా వాళ్ల వాళ్ల స్కూళ్ల పరిస్థితులకు అనుగుణంగా జీతాలు ఇస్తున్నారు.
ఇలా ప్రైవేట్ పాఠశాలల్లో బతకడానికి కావల్సిన జీతంతో కాలం వెళ్లదీస్తున్నవారి సంఖ్య బహుశా వేలల్లో ఉంటుంది. వీటితో పోలిస్తే కార్పొరేట్ స్కూళ్ల సంఖ్య తక్కువే. అందులో పనిచేసే వారి సంఖ్యా తక్కువే. అంటే ప్రభు త్వ పాఠశాలల్లో పనిచేసే వారెంత మంది ఉంటారో చిన్న, పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసేవారూ అంతేమంది ఉంటారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న సమస్యలే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. అయినా ఇవాల పేద, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ శాతం మంది తమ పిల్లలను ఇలాంటి స్కూళ్లకే పంపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంగ్లీషు మీడియం. కార్పొరేట్ స్కూళ్లలో చదివేవారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అంటే ఆర్థిక స్థోమత ఆధారంగానే నేడు చదువులు సాగుతున్నాయని చెప్పడానికి లేదు. చదువంటేనే ఇంగ్లీష్ మీడియం చదువులై పోయిన ఈ కాలంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పిల్లల చదువుల కోసం జీవితాన్ని వెచ్చిస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ చదువుల భారం అత్యధిక శాతం ప్రజలకు మోయలేనిదే. అయినా పిల్లల భవిష్యత్తు కోసం తప్పదనే భావనతో కాలంతో పోటీ పడుతున్నారు. ఫీజుల భారాన్ని భరిస్తున్నారు.
ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇలాంటి వారికి అందితే చాలు. ఆ పథకం లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే. జనాభాలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్న దానికి అనుగుణంగా వారికి అందు బాటులోకి ఇంగ్లీషు విద్యను అందించినట్లు అవుతుంది. వారి ఆర్థిక భారాన్ని తగ్గించగలిగిన ఈ ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య తెలంగాణలో గుణాత్మక మార్పుకు దారితీస్తుంది.
అయితే ప్రభుత్వ పాఠశాలలు అనగానే మౌలిక సదుపాయా ల విషయం ముందుకు వస్తుంది. సదుపాయాల సమస్యలు సర్కా రీ స్కూళ్లలోనే కాదు చాలా ప్రైవేట్ పాఠశాల్లోనూ ఉన్నా యి, ఉంటాయి. వ్యక్తులు నడిపే ప్రైవేట్ పాఠశాలల్లోనే చాలా వరకు ఏటా వారి పరిధిని విస్తరించుకుంటూ,వసతులను సమ కూర్చుకుంటూపోతున్నారు. అలాగే కొత్తగా వచ్చే కోర్సులను, అవి అందించే మార్పులను స్వీకరిస్తున్నారు. దీనికోసం వాళ్లకు ఉన్న వనరులతోనే వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాం టి పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషిచేస్తూనే ఈ ఉచిత విద్యను, నాణ్యమైన విద్యను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తలచుకుంటే అసాధ్య మేమీ కాదు. ఒకసారి ప్రభుత్వ పాఠశాల ల్లో ఇది అమలయ్యాక, విద్యార్థులు అందులోకి వచ్చేలా విశ్వసనీయత కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపా యాలు ప్రభు త్వం చూసుకుంటుంది. కానీ విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం, వారి తల్లిదండ్రులను ఒప్పించడం మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులపైనే ఉన్నది. పాఠశాలలను గ్రామస్థాయి నుంచి పటిష్ఠం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కంటే అందులో పనిచేసే ఉపాధ్యాయులపైనే ఎక్కువ ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలు ఒక ఏడాది ఆశించిన అడ్మిషన్లు రాగానే సంతృప్తి పడి ప్రచారం చేయడం మానవు. ఏటా వారి పాఠశాలల ప్రగతిని, ఫలితాలను చూపిస్తూ ప్రచారం చేస్తుంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు ప్రారంభ సమయంలో మాత్రమే పన్నెండు రోజులు ప్రచారం చేస్తారు. ప్రజల విశ్వాసా న్ని చూరగొనే పని, ప్రక్రియ నిరంతరం సాగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నా యి. అయినా వాటి మనుగడకే ప్రమాదమేర్పడే పరిస్థితి ఎందు కు వస్తున్నదో ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఎదు ర్కొం టున్న సమస్యలను అధిగమించి విద్యా ప్రమా ణాలను పెంచే లా చర్యలు చేపట్టాలి.
దీనివల్ల ప్రభుత్వ పాఠశా లలపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడు తలకు మించిన భారం గా మారిన ప్రైవేటు పాఠశాలల వెంట పరిగెత్తాల్సిన అవసరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండదు.
చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మంలాగే.. కేజీ టు పీజీ విద్య విజయవంతం కావాలంటే ప్రజ ల భాగస్వామ్యం ఆవశ్యకం. మొక్కుబడి శిక్షణలతో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. నాణ్యమైన విద్యకోసం తగిన ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వ పాఠశాల పటిష్ఠత కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అప్పుడే అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య అందుతుంది. నవ తెలంగాణ మన తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. 

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home