Friday 18 January 2013

ఆంధ్రా ఆక్టోపస్ పట్ల అప్రమత్తంగా ఉండాలే



ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది అని అంటున్న ఆంధ్ర ఆక్టోపస్ ఎందుకు ఆందోళన పడుతున్నాడో అర్థం కావడం లేదు. కరీంనగర్ ఉప ఎన్నిక సమయంలో రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు రెఫరెండమే అన్నారు. అప్పుడు అభివృద్ధి మంత్రం జపించిన వైఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన విషయం లగడపాటి మరిచిపోయారా? అంతెందుకు సీమాంధ్ర లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో లగడపాటి, టీజీ వెంకటేష్, ఆనం వివేకానంద తదితరులు జగన్ కు ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయిన అక్కడి ప్రజలు వీళ్ళ వాదనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంతే కాదు లగడపాటి చేసే వాదనలో ఇసుమంత వాస్తవం ఉండదు అనడానికి మరో ఉదాహరణ. ఎస్సార్సీ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాన్నిమళ్లీ ఎస్సార్సీ ద్వారానే విభజించాలి అంటున్నాడు. మొదటి ఎస్సార్సీ తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రాన్ని)యథాతదంగా ఉంచాలని సిఫారసు చేసింది. దాన్ని పట్టించుకోకుండా ఆంధ్రా లాబీ కి తలొగ్గి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. దీన్ని దాచి పెట్టి ఆంధ్ర ఆక్టోపస్ అవాస్తవాలు చెబుతూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నాడు. అందుకే కొంత మంది సీమాంధ్ర విద్యార్థులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తామని.. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఆంధ్ర రాష్ట్రము కోసమే తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం కాదనే సత్యాన్ని వాళ్ళకు తెలియకుండా చేశారు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు. విజయవాడలో కూర్చుని విద్వేషాలు రెచ్చగొడుతూ.. తానూ ఆందోళన పడుతూ, ఆంధ్రా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఆంధ్రా ఆక్టోపస్ పట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపొతే రాజధాని పై నాడు రాజకీయం చేసి పొట్టి శ్రీ రాములు పొట్టన పెట్టుకున్నట్టే మిమ్మల్ని బలి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త! రాష్ట్ర విభజన ఎన్నటికి జరగదని వాదిస్తున్న లగడపాటి దానికైనా కట్టుబడి ఉండాలి. లేదా విభజన జరిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతాను అన్న మాట మీద అయిన నిలబడాలి. రాష్ట్ర విభజన జరుగుతుందా లేక సమైక్యంగా ఉంటుందా కొన్ని రోజుల్లో తేలుతుంది. అప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ పూటకో మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home