పార్టీలు కాదు వ్యక్తులే ప్రధానమట
హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో పార్టీలతో పనిలేదు. వ్యక్తులే ప్రధానం అంటున్నారు అంట ఆ నియోజకవర్గంలో ని ప్రజలు. ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మీరేం చేశారు అంటే మీరేం చేశారు అని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజల మనోగతం భిన్నంగా ఉన్నదని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఎన్నిచేసినా ఆ నియోజకవర్గంలోని ప్రజలతో ఈటల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఫలితంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న పథకాలు ఏవీ పనిచేసేలా లేవు అంటున్నారు. ఈ ఉప ఎన్నిక వరకు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ వైపే ఉన్నారట. పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయడం, పక్షపాతం చూపకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి ఈటల రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలని ప్రజల అభిప్రాయం. అలాగే కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను అందించిన సేవలను అక్కడి ప్రజలు మననం చేసుకుంటున్నారు.
ఈ నియోజకవర్గంలో పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నది. బహుశా అందుకే మొన్న కేటీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నిక మా ప్రభుత్వం కూలిపోదు అనే మాటలు మాట్లాడి ఉంటారు.
ప్రస్తుతం హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు ఇవి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం మొదలు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది నోటిఫికేషన్ వచ్చేవరకు తెలుస్తుంది.
Labels: Eetala rajendra, huzurabad by poll
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home