Wednesday 25 August 2021

ఆ మాటల ఆంతర్యం!


హుజురాబాద్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అంటున్న అధికార పార్టీ అగ్ర నాయకుల మాటల ఆంతర్యం ఏమిటి అన్నది వాళ్ళ క్యాడర్ కే అర్థం కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాల పై, కొంతమంది అధికారుల పై జరుగుతున్న వివక్షను ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఎండగడుతున్నాడు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను రాజకీయ విశ్లేషకులు దిద్దుబాటు చర్యలు గానే భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కేటీఆర్ వ్యాఖ్యలు, కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని ఆ నియోజకవర్గంలో కురిపిస్తున్న నిధుల, పదవుల వరాలతోఈటల నైతిక విజయం సాధించారు అంటున్నారు. 

ఈటల రాజీనామా ఫలితంగా దళితబంధు పథకం అమలు కోసం హుజురాబాద్ కు 2000 కోట్ల కేటాయింపు జరిగింది. ఇందులో 1200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఎస్ సీ, బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ ల పదవులు హుజురాబాద్ కే దక్కాయి. దళిత బంధు మాక్కూడా కావాలనే డిమాండు మేరకు టైమొస్తే బీసీ బంధు, మైనారిటీ, ఇతర బంధులు కూడా పెడుతామని కేసీఆర్ ప్రకటించారు. హుజురాబాద్ చిన్న ఉప ఎన్నిక అంటూనే.. అక్కడ ఇన్ని చేస్తున్నా.... ఏదో తేడా కొడుతున్నదనే అభిప్రాయం అధికార పార్టీ నేతల మాటలతోనే అర్థం అవుతోంది.

2014 తర్వాత రాష్ట్రంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నిక అయినా అలవోకగా గెలిచే అధికార పార్టీ దుబ్బాక ఫలితం తర్వాత జరిగిన అన్నీ ఎన్నికల్లో చమటోడుస్తున్నది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక అయితే కేసీఆర్ తో సహా అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ప్రభుత్వం, పార్టీలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక నోటిఫికేషన్ వచ్చాక ఇంకా ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home