బాబు కోసం మన బాబులు ...
ఈ మధ్య తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర బల ప్రదర్శనలు చేయడం రాజకీయ పార్టీల నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. ఒక బలమైన ఆకాంక్ష కోసం బలిదానాలకు పాల్పడిన అమరులను వీరి రాజకీయాలు వాడుకోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా తెలంగాణ టిడిపి నేతలు ఈ విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇదంతా త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడే ఉన్నది పెద్ద విషాదం. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడేది తెలంగాణ నేతలే. కానీ టిడిపి నేతల ఆరాటం మాత్రం సీమాంద్ర బాబును హీరో చెయ్యాలని, మంచిదే తమ నాయకుని కోసం కష్టపడడంలో తప్పులేదు. మోత్కుపల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే, ఆయన తెలంగాణ గురించి, ఉద్యమం గురించి పూర్తిగా మరిచిపోయారు. కెసిఆర్ ఫాం హౌసులో రెస్ట్ తీసుకుంటున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారని రోజు చెప్పిందే చెబుతున్నారు. అయితే యిప్పుడు తెలంగాణ టిడిపి తెలంగాణ కోసం ఏమిచేస్తున్నారు అన్నది ప్రశ్న! తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉంది, వాళ్ళే తేల్చాలి అని ముఖ్యమంత్రి మొదలు చంద్రబాబు, జగన్ ఇలా గోడమీది పిల్లులందరూ అదే వాదిస్తున్నారు. మరి ఈ సమస్య ఎ