Friday 6 January 2012

ప్రశ్నిస్తే... ప్రతిఫలం ఇదీ ..!



బాబు రైతు పోరు యాత్ర  తెలంగాణ ప్రజలపై దండ యాత్ర లాగా సాగుతున్నది. ఒక ప్రాంత ప్రజలు బాబు గో బ్యాక్ అని నినదిస్తున్నారు. అయినా బాబు తన మంది మార్బలంతో ప్రజలపై పోరుకు సిద్ధమై ఓరుగల్లుకు వెళ్ళాడు. దీన్ని ఆ పార్టీ టిడిపి నేతలు బాబు పర్యటన బాగు బాగు అని సమర్థించుకుంటున్నారు. కానీ బాబు అండ్ కో ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. ఇవాళ బాబు చేస్తున్న రైతు యాత్ర ఎవరి కోసం. హైదరాబాద్ మొదలు వరంగల్ దాక అడుగడుగునా బాబుకు నిరసనే వ్యక్తమయ్యింది. నిజంగా బాబు పర్యటనను తెలంగాణ ప్రజలు స్వాగతించి ఉంటే మూడు రోజులుగా ఓరుగల్లులో జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. యిప్పుడు రైతు సమస్యలే కాదు, కార్మికులు, విద్యార్థులు, చేనేత, ఒక వర్గమే కాదు అన్ని ప్రభుత్వ వ్యవస్థ లను నిర్వీర్యం చేసినా ఘనుడు బాబు. ఐ టి మోజులో పది సమాజం లోని అన్ని వ్యవస్థలను తుంగలో తొక్కాడు. దాని పర్యవసానమే కదా రెండు సార్లు ప్రజలు ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు. నిజంగా బాబు తన తొమ్మిదేళ్ళ పాలనను, ఏడేళ్ళ ప్రతిపక్ష పాత్రపై సమీక్ష చేసుకుని ఉంటే చాలా వాస్తవాలు తెలిసి ఉండేవి.  నేను తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు ఎంత మొత్తుకుంటున్నా ఇవాళ తెలంగాణ సమాజం ఆయనను ఎందుకు విశ్వసించడం లేదో అర్థమయ్యేది. తెలంగాణ ను  అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ  మోసాలు చేసింది .చేస్తూనే ఉన్నది. ప్రతిపక్ష నేతగా ఆ అన్యాయాలను ఎండగట్టే అవకాశం బాబు ఉంది (అయన తెలంగాణకు నిజంగా కట్టుబడి ఉంటే). ఇక్కడే బాబు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇదీ తెలిసిన తెలియనట్టు నటించడమే బాబు చేస్తున్న మోసం, ద్రోహం. పార్టీ పరంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఇంత రాద్ధాంతం జరగదు. అప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనే కాంగ్రెస్ పార్టీ అందరి ఉమ్మడి శత్రువు అవుతుంది. తెలంగాణ ప్రజానీకం బాబు రెండు కళ్ళ  సిద్దాంతాన్ని, అయన తటస్థ వైఖరి పైనే మండి పడుతున్నది. చిదంబరం మొదలు బొత్స వరకు టిడిపి ఒకే మాట చెప్పాలని కోరుతున్నారు.  అలా చెప్పి ఉంటే అలాగే ఇవాళ మోత్కుపల్లి, దయాకర్ రావు , రేవంత్, రేవూరి, దేవేందర్ గౌడ్, కడియం లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు తెలంగాణ వ్యతిరేకులు ఎవరో బయట పది ఉండేది. కానీ బాబు తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణ టిడిపి నేతలను పావులుగా వాడుకుంటున్నాడు. ఈ విషయం తెలియని అమాయకులు కాదు ఈ ప్రాంత టిడిపి నేతలు. అయితే మొన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా బాధ్యత మరిచిన తెలంగాణ కాంగ్రెస్ బానిసల వలె వీరు వ్యవహరించడమే విషాదం. తెలంగాణ ప్రజల పైకి చంద్ర దండును ఉసిగోలుపుతున్న బాబుకు రక్షణగా కిరణ్ సర్కారు ఉన్నది. మరి ఈ ప్రజలను కాపాడవలసిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే వారిపై జులుం ప్రదర్శిస్తే ఇక చేసేది ఏముంది. పోరాటమే తెలిసిన తెలంగాణ ప్రజలను ఈ గాయాలు బాధిస్తున్నాయి కానీ తమ ఆకాంక్షను బంధించలేక పోతున్నాయి. అందుకే ఈ ప్రతిఘటనలు, దాని పర్యవసానాల బహుమతులు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home