ఎట్టకేలకు సచిన్ వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ అడుగుపెట్టినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఎంతో మంది యువ ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ లో రాణిస్తూ...భారత జట్టు తరఫున ఆడడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అత్యున్నత రికార్డ్స్ నెలకొల్పాడు. ఇందులో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాని జూనియర్స్ అవకాశాలు రావాలంటే సీనియర్స్ సగౌరవంగా తప్పుకోవలసిందే. ఎందుకంటే గతంలో ఒక సెంచరీ కొడితే ఓ ఆర్నెల్ల వరకు మన ఆటగాళ్ళకు జట్టులో డోకా ఉండేది కాదు. ఇప్పుడు అలంటి స్థితి లేకున్నా..కొంత మంది సీనియర్లను పక్కన పెట్టలేని అగత్యం మాత్రం ఉన్నది. వారిని తప్పిస్తే ఒకవాదన లేకపోతే మరో వాదన. దీనితోనే సమయము గడుస్తున్నది, సీరీస్ లు అయిపోతున్నాయి. ఫలితంగా వరల్డ్ కప్ చాంపియన్స్ కాస్త ఈ మ్యాచ్ అయినా గెలిస్తే చాలు అన్న గడ్డు కలం మాత్రం మన కళ్ళముందు కనపడుతున్నది. చివరికి ఇది ఎలా తయారయ్యింది అంటే కొత్త నీరు లేని సముద్రంలా మారింది. నీళ్ళు ఉన్నా నిరుపయోగమే. అందుకే అంతర్జాతీయంగా మన క్రికెట్ మళ్ళీ పుంజుకోవాలంటే పోటీ తప్పనిసరి. ఇది సఫలం కావాలంటే గత కీర్తిని పట్టుకుని వేలాడితే..వర్తమానం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ విషాదాలు మనల్ని వెంటాడుతాయి. అందుకే గతం మంచి జ్ఞాపకంగా ఉండాలంటే వర్తమాన భారత క్రికెట్లో యువతకు జట్టులో చోటు మాత్రమే దక్కితే సరిపోదు. వాళ్ళకు ఆడే అవకాశము కల్పించాలి.
Sunday, 23 December 2012
మంచి నిర్ణయం
ఎట్టకేలకు సచిన్ వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ అడుగుపెట్టినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఎంతో మంది యువ ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ లో రాణిస్తూ...భారత జట్టు తరఫున ఆడడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అత్యున్నత రికార్డ్స్ నెలకొల్పాడు. ఇందులో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాని జూనియర్స్ అవకాశాలు రావాలంటే సీనియర్స్ సగౌరవంగా తప్పుకోవలసిందే. ఎందుకంటే గతంలో ఒక సెంచరీ కొడితే ఓ ఆర్నెల్ల వరకు మన ఆటగాళ్ళకు జట్టులో డోకా ఉండేది కాదు. ఇప్పుడు అలంటి స్థితి లేకున్నా..కొంత మంది సీనియర్లను పక్కన పెట్టలేని అగత్యం మాత్రం ఉన్నది. వారిని తప్పిస్తే ఒకవాదన లేకపోతే మరో వాదన. దీనితోనే సమయము గడుస్తున్నది, సీరీస్ లు అయిపోతున్నాయి. ఫలితంగా వరల్డ్ కప్ చాంపియన్స్ కాస్త ఈ మ్యాచ్ అయినా గెలిస్తే చాలు అన్న గడ్డు కలం మాత్రం మన కళ్ళముందు కనపడుతున్నది. చివరికి ఇది ఎలా తయారయ్యింది అంటే కొత్త నీరు లేని సముద్రంలా మారింది. నీళ్ళు ఉన్నా నిరుపయోగమే. అందుకే అంతర్జాతీయంగా మన క్రికెట్ మళ్ళీ పుంజుకోవాలంటే పోటీ తప్పనిసరి. ఇది సఫలం కావాలంటే గత కీర్తిని పట్టుకుని వేలాడితే..వర్తమానం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ విషాదాలు మనల్ని వెంటాడుతాయి. అందుకే గతం మంచి జ్ఞాపకంగా ఉండాలంటే వర్తమాన భారత క్రికెట్లో యువతకు జట్టులో చోటు మాత్రమే దక్కితే సరిపోదు. వాళ్ళకు ఆడే అవకాశము కల్పించాలి.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment