Sunday 5 February 2023

అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ అంటూ... కేసీఆర్‌


బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదనే నినాదంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలతో ఆయన సమావేశమై చర్చించారు. మహారాష్ట్రకు వెళ్లి ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత ఎన్సీపీతోనూ దీనిపై మాట్లాడారు. కానీ ఆ సమయంలో వారు కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ యేతర కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. బహుశా అప్పుడే ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారు. కాంగ్రెస్‌, బీజేపీలో కలిసి పనిచేసిన పార్టీలు, లేదా ఆ పార్టీలతో కలిసి అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తనతో కలిసి రాకపోవచ్చునని అభిప్రాయానికి వచ్చి ముందుగా తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలపై ఫోకస్‌ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర నాందేడ్‌లోనూ తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువే ఉంటారు. 


మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..  చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. దేశ పరిస్థితులను చూసిన తర్వాత టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చాం. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేశాం. అందుకే అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌.. నినాదంతో బీఆర్‌ఎస్‌ వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ఎనిమిదేళ్ల కిందట తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవని, క్రమంగా అన్ని సమస్యలను అధిగమంచామని అన్నారు. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఎకరానికి రూ. 10 వేల చొప్పున  రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణం చేత చనిపోయినా రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైనవి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ తరహా పథకాలు రావాలంటే రైతు సర్కార్‌ రావాలి. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే రెండేళ్లలోనే మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్‌ సర్కార్‌ రావాలన్నారు. తెలంగాణలోని దళితబంధు దేశమంతా అమలు కావాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామన్నారు. మహారాష్ట్ర, దేశమంతా బీఆర్‌ఎస్‌ కిసాన్‌ కమిటీలు వేస్తాం. 


54 ఏళ్లు కాంగ్రెస్‌...16 ఏళ్లు బీజేపీ పాలించి.. ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ చిన్న దేశంలో ఉన్నది. సువిశాల భారత్‌లో కనీసం  2 వేల టీఎంసీల  రిజర్వాయర్‌ ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య కేంద్రం జలవివాదాలను పరిష్కరించడం లేదన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో  ఏళ్ల కొద్దీ జలవివాదాలు పెండింగ్‌లో పెడతారని మండిపడ్డారు. 

Labels: , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home