Wednesday, 30 April 2025

పంతానికి పోతే తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం


కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నచిన్న లోపాలున్నాయనేది వాస్తవం. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీ వాదనలు ఎలా ఉన్నా తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు తప్ప మరో మార్గం లేదు. ఇది అందరూ అంగీకరిస్తున్నదే. అందుకే కాళేశ్వరం నిర్వహణకు అయ్యే కరెంటు ఖర్చు గురించి కాకుండా ఆ ప్రాజెక్టు అందించిన ఫలితాల గురించి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పంటల ఉత్పత్తి పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. మేడిగడ్డలో లోపాన్ని కారణంగా చూపెట్టి నీటిని ఎత్తిపోయకుండా పదహారు నెలలుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఎండాకాలంలో తాగు,సాగు నీటి కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎన్డీ ఎస్ ఏ నివేదికను ముందుపెట్టి ప్రాజెక్టే పనికిరాదనే ప్రచారం చేస్తున్నది. కానీ ఆ నివేదిక మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కూల్చి తిరిగి నిర్మించాలని సూచించింది. మిగతా రెండు బ్యారేజీలు ఇదే డిజైన్ లో నిర్మించారు కాబట్టి వాటి పటిష్టతపైనా స్టడీ చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. దీన్నిబట్టి ఆ నివేదిక ఎంతవరకు ప్రామాణికమో ఏలికలే చెప్పాలి.  బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరిలో  తెలంగాణకు కేటాయించిన 900 టీెఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోవాలంటే మేడిగడ్డ ఏడో బ్లాక్ తిరిగి నిర్మించి వినియోగంలోకి తేవాలి. అలాకాకుండా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని రాజకీయాల కోసం పంతానికి పోతే దీర్ఘకాలంలో తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేసిన వాళ్లు అవుతారు.

Thursday, 10 April 2025

ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరిక


సీఎం రేవంత్‌ రెడ్డి వైఖరి నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీళ్లేదు అన్నట్టు ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, పౌర సమాజం, తెలంగాణ ప్రజల హక్కులు, నిరసనలు అంటూ డైలాగులు కొట్టిన సీఎం పవర్‌లోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. నెగ్గడమే కాదు, తగ్గడమూ విజయమే అన్నది కేసీఆర్‌ ఉద్యమకాలంలోనే కాదు, పదేళ్ల పాలనలో చూపెట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మించాలని ప్రతిపాదిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ప్రతిపాదనలకువ్యతిరేకంగా క్యాంపెన్ చేసింది.  వాకర్లు, ప్రజలు కూడా నిరసనలను పరిగణనలోకి తీసుకున్నది.  ఆ ప్రతిపాదనను విరమించుకున్నది. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే!ప్రజల  ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తూ.. మూగ జీవాలైన పక్షులు, జంతువులను వాటి నివాస ప్రాంతాల నుంచి తరిమికొడుతూ.. ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ మాది  ప్రజా ప్రభుత్వం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా, వారు మెచ్చేలా పాలన సాగించాలని పౌర సమాజం కోరుతున్నది

ఇది కదా తెలంగాణ సోయి అంటే!

 


తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే.  చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్‌ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్‌ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్‌ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!

కాంగ్రెస్‌లో కాక పుట్టించనున్న క్యాబినెట్‌ విస్తరణ

 


బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏపీనేనా?

 


Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...