Monday, 3 October 2011

అజ్ఞానకిరణ్ అవాస్తవాలు


సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి మాట మర్చిండు. సమ్మె ప్రారంభమైన తరువాత దీనివల్ల మీ ప్రాంతానికే నష్టమని విభజించి మాట్లాడిన ఆయన యిప్పుడు దాని సెగ ఉత్తరాంద్ర కు తగలడం తో మన అనే మాట మాట్లాడుతున్నాడు. రైతులకు ఏడు గంటల విద్యుతు అందిస్తామని చెప్పి మిగతా ప్రాంతాల సంగతి ఏమో తెలియదు కానీ తెలంగాణ లో ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదు. జల విద్యుతు ద్వారా కరెంటు కోతలు లేకుండా రైతులకు సరఫరా చేయవచ్చని తెలంగాణ వాదులు చెబుతున్న పట్టించుకోవడం లేదు. పైగా యిప్పుడు విద్యుతు కోతలతో ఉత్తరాంద్రలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది కనుక దీని కారణం కెసిఆర్, కోదండరామ్ లే బాధ్యత వహించాలని, వారిపై తిరగబడాలని సమస్య నుంచి తప్పించు కోవలనుకుంటున్నాడు. కిరణ్ ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రము లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యమ ప్రభావాన్ని కేంద్రానికి తెలియజేసి, పరిష్కార దిశగా కృషి చేయాల్సిన అయ్యాన అనిచివేతే లక్ష్యంగా పని చేస్తున్నారు. సహచర మంత్రుల మాటలను కూడా బేకతారు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయం కాబట్టి సమ్మెను రెండు నెలల తరువాత చేయలని సూచనలు చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిరణ్  కు పాలనా మీద ఎంత పట్టు ఉన్నదో. సమ్మె వాళ్ళ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి అది మరిచి పోయి ఉద్యమాలు ఎప్పుడు చేయాలో నిర్దేశిస్తున్నాడు. మొన్నటి దాక సమ్మెతో ఇబ్బంది ఏమిలేదని ఢిల్లీ పెద్దలకు రిపోర్టులు పంపి వారితో కూడా చెప్పించి యిప్పుడు పంటలు ఎండిపోతే ఉద్యమకారులదే బాధత అంటే ముఖ్యమంత్రిగా కిరణ్ అనర్హుడు.

No comments:

Post a Comment

Featured post

ముఖ్యమంత్రి మార్పు ఖాయమేనా?

 తెలంగాణ సీఎం ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉంటున్నాయి. నిన్న వనపర్తి సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఏదో చేయాలనే ఆలోచనతో ప్ర...