Monday 10 October 2011

అణచివేతే అసలు వ్యూహం



సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా పడింది. దీంతో కాంగ్రెస్  అధిష్టానం దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు చర్చల పేరుతో ఒక నాటకాన్ని మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య సున్నితమైనదని, జటిలమైనదని పాట పాటనే పడుతూ .. ఈ అంశాన్ని మరికొంత కాలం సాగదీయడమే కాంగ్రెస్ పెద్దల అసలు వ్యూహం. ఎందుకంటే రెండు నెలలుగా ఆజాద్ నాయకత్వంలో జరిగిన సంప్రదింపుల రిపోర్ట్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేతుల్లోనే ఉన్నది. ఆజాద్ చేసిన పనినే మళ్లీ కొత్తగా రెండు మూడు రోజులుగా ఢిల్లీ పెద్దలు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర నేతలతో చర్చలు మిగిశాయి. ఇక కాంగ్రెస్ జాతీయ నేతలతో చర్చలు జరగాల్సి ఉన్నదంటున్నది. ఇదీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. వీరందరితో సంప్రదింపులు పూర్తి అయినా వెల్లడయ్యేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈలోగా ముఖ్యమంత్రి తో సమ్మెను విచ్చిన్నం చేసే ప్రక్రియనూ ప్రారంభించింది. ఆ ప్రయత్నం సఫలం అయితే సరే. లేకపోతే దాని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఫల్యంగా చిత్రించి మరొకరిని గద్దె మీద కూర్చోబెట్టం. ఇదీ కాంగ్రెస్ పార్టీ అజెండా.  లేకపోతే తెలంగాణ లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామా చేసి ఉన్నారు. వాటిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ప్రతి పక్ష నేత కూడా ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని అడగరు. జాతీయ పార్టీలు బిజెపి, సీపిఎం, సిపిఐ ల తో సహా చాలా పార్టీలు తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ప్రధానికి లేఖలు రాసిన లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టికి సమస్యను పరిష్కరించడం కన్నా దానితో లబ్ధి పొందాలనే కుంచిత బుద్ధితోనే ఆలోచిస్తున్నది. అందుకే సకలజనుల సమస్య ఇప్పుడు జాతీయ సమస్య అయ్యింది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home