Monday, 3 October 2011

వీరి బలహీనతే వారి బలం..


నలుగురు పెట్టుబడిదారులు తెలంగాణకు అడ్డుపడుతుంటే అందుకు నలబై మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారికి సహకరిస్తున్నారు. సకల జనుల సమ్మె ఇంత ఉధృతంగా సాగుతున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడానికి కారణం ఈ నేతలే. పైకి వీళ్ళు తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమంటున్నారు రాజీనామాలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఆ బలహీనతే కేంద్రానికి బలమైన ఆయుధం అవుతున్నది. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయ సంక్షోభమే. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. యిప్పుడు తెలంగాణాలో జరుగుతున్న పరిణామాల పై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించక పోవడానికి కారణం ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వాలే. వాటిని వదిలించుకోవాలనే ప్రజలు కోరుతున్నారు. అంతేగానీ ప్రజల వద్ద ఒక మాట పార్టీ అధిష్టానం వద్ద మరో మాట తో కాలం వెళ్ళదీయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.

No comments:

Post a Comment

Featured post

ప్రపంచ , దేశీయ తాజా వార్తా ముఖ్యాంశాలు

  🌐 అంతర్జాతీయ విశేషాలు (భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు) చరిత్రాత్మక హాట్రిక్: గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది మూడోసారని...