Sunday 1 July 2012

నాన్చుడు కాదు, తేల్చాలి

కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం వల్ల ఎవరు లబ్ధి పొందారు? ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఘోర పరాజయం తర్వాత ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నరసాపురం,  రామచంద్రాపురం స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను ఓడించింది గత ఎన్నికల్లో పీఆర్పీ  తరఫున బరిలో నిలిచిన వారే. అందుకే కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం చిరు వర్గానికే లాభించిందని చెప్పవచ్చు. సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ గెలిచిన పదిహేను మంది అభ్యర్థుల్లో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నవారే. అందుకే ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కి ఉండే ఓటు బ్యాంకును కాపాడుకోలేక పోయారు. అందుకే ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో ని అభ్యర్థులు కాపు వర్గానికి చెందినా వారు కావడం గమనార్హం.  వంగ వీటి రంగ హత్య తరువాత కోస్తాలో కాపులు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు.
ఇక పీఅర్పీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నది. కానీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాదని సీమాంధ్ర ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.విలీనం తరువాత ఇరు పార్టీల నేతల్లో విభేదాలు చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని కొందరు పీఅర్పీ బాహాటంగానే విమర్శించారు. అవసరం అయితే పీఅర్పీని పునరుద్ధరిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీ పెద్దలు వచ్చి చర్చలు చేసి విలీనం తంతు పూర్తి చేసినా క్షేత్ర స్థాయిలో అది వర్క్ అవుట్ కాలేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రామచంద్రయ్య వంటి నేతలకు మంత్రి పదవి కట్టబెట్టడాన్ని కడప జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు నేతలయితే పీఅర్పీ విలీనం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుతుందన్నారు. ఈ వాదోపవాదనలు ఎలా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లో  నెలకొన్నఅనిశ్చితిని తొలగించడానికి ఆజాద్ నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఆ కమిటీ రెండు మూడు సమావేశాలకే పరిమితం అయ్యింది. కానీ పీఅర్పీ విలీనం, నేతల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమయ్యింది. కర్ణుని చావుకు వంద కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని బొత్స వంటి నేతలు చెప్పుకోవడం విడ్డురంగా ఉన్నది. వైఎస్ ఆకస్మిక మరణం తరువాత రోశయ్యను ముఖ్యమంత్రి చేసినా కాంగ్రెస్ పార్టీ జగన్ ను కట్టడి చేయడానికి అదే సామాజిక వర్గ నేతకు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. మంత్రి వర్గ విస్తరణలో కూడా అదే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సామాజిక న్యాయం నినాదంతో పార్టీ పెట్టిన చిరు కాంగ్రెస్ పార్టీలో పీఅర్పీని విలీనం చేసి సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. చిరు మాటలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేసి ఉండి ఉంటే సీమాంధ్ర ప్రాంతం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరో రెండు మూడు సీట్లు గెలుచుకొని ఉండేది. ఎందుకంటే జగన్ వంగవీటి రంగ తనయుడు రాధా ను వైఎస్ఆర్ సీపీ లో చేర్చుకోవడమే కాదు, రాధను తన సొంత తమ్ముడిలా గుండెల్లో పెట్టుకుంటానని కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జగన్ ప్రయత్నం ఫలించింది. అందుకే కోస్తాలో అన్ని వర్గాల ప్రజలు జగన్ను ఆదరించారు అనుకోవచ్చు. ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేసినా అభ్యర్థులకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది. గతంలో ఆయా నియోజక వర్గాల్లో రెండో స్థానంలో నిలిచిన పీఅర్పీ అభ్యర్థులకు అవకాశం కల్పించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఇంతటి చేదు అనుభవం ఎదురయ్యేది కాదు. ఒకవేళ ఓడిపోయినా వైఎస్ఆర్సీపీ నేతలకు అంత భారీ మెజారిటీ వచ్చేది కాదు.  సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉన్నది.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి తెలంగాణ పై తేల్చాలి. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించి ముందుకు పొతే ఇప్పటికంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.అలా కాకుండా కాంగ్రెస్ పెద్దల్లో ఎప్పుడు మెదిలే సమస్యను నాన్చి వేస్తే దాని తీవ్రత కొంతకాలనికి తగ్గుతుందని భావిస్తే ఇవే ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయి. అప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని ని చేయడం సంగతి అటుంచితే నూట ఇరవై ఏళ్ల ప్రాంతీయ పార్టీల కంటే వెనుకబడి పోవడం ఖాయం. సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో మ్యానిఫెస్టో లలో పెట్టడం కాదు, అధికారంలో ఉండగానే ఆచరణలో చూపాలి. అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలుగుతారు. ఎందుకంటే ఇవ్వాళ పరకాల ఫలితం కంటే సీమాంధ్ర లో జగన్ పార్టీ కి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుంది అని ముఖ్యమంత్రి మొదలు లగడపాటి, టి జి వెంకటేష్, ఆనం వంటి నేతల ప్రచారాన్ని అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. అంటే రాష్ట్రంలో ఈ అనిశ్చితి తోలిగిపోవాలంటే తెలంగాణ పై నాన్చడం కాదు తేల్చాలి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతంలో బలహీన పడినా మరో ప్రాంతంలో బలపడుతుంది. లేకపోతే బాబు రెండు కండ్ల సిద్ధాంతం ఫలితం ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. అదే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పడుతుంది.
rajuasari@gmail.com

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home