సీమాంధ్ర మీడియా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. అందుకే మెరుగైన సమాజం కోసం, ప్రతిక్షణం ప్రజాహితం వంటి ట్యాగ్ లైన్లను తగిలించుకున్న చానల్లు రాష్ట్ర విభజన బాధ సీమాంధ్ర ప్రజలది కాదు మాది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు పారదర్శకంగా ఉండాలనే పద్ధతికి తిలోదకాలు ఇచ్చాయి. తెలంగాణ పేరుతో...తెలంగాణ కోసం అన్నట్టు ప్రసారం చేసే కథనాల్లో తెలంగాణ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర విభజనపై చేసే ఏ కార్యక్రమాన్ని చూసినా హైదరాబాద్ చుట్టే తిప్పుతాయి. నదీ జలాల సమస్య తలెత్తుతాయి అంటాయి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనిపించని ఏ సమస్య తెలంగాణ విషయంలో కనిపిస్తాయి. నదీ జలాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయో అవే రేపు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య అమలవుతాయి. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినా కొంత మంది సీమాంధ్ర నేతలు. కొన్ని మీడియా చానళ్ళు హైదరాబాద్ మీద తమ ఆశను.. తెలంగాణ ఉద్యమంపై తమ అక్కసును వెల్లగక్కుతున్నాయి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచి పధ్ధతి కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావలసిన మీడియా ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం సరికాదు.
Monday, 21 January 2013
ప్రజలకులేని బాధ ప్రసారమాధ్యమాలకు ఎందుకు?
సీమాంధ్ర మీడియా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. అందుకే మెరుగైన సమాజం కోసం, ప్రతిక్షణం ప్రజాహితం వంటి ట్యాగ్ లైన్లను తగిలించుకున్న చానల్లు రాష్ట్ర విభజన బాధ సీమాంధ్ర ప్రజలది కాదు మాది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు పారదర్శకంగా ఉండాలనే పద్ధతికి తిలోదకాలు ఇచ్చాయి. తెలంగాణ పేరుతో...తెలంగాణ కోసం అన్నట్టు ప్రసారం చేసే కథనాల్లో తెలంగాణ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర విభజనపై చేసే ఏ కార్యక్రమాన్ని చూసినా హైదరాబాద్ చుట్టే తిప్పుతాయి. నదీ జలాల సమస్య తలెత్తుతాయి అంటాయి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనిపించని ఏ సమస్య తెలంగాణ విషయంలో కనిపిస్తాయి. నదీ జలాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయో అవే రేపు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య అమలవుతాయి. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినా కొంత మంది సీమాంధ్ర నేతలు. కొన్ని మీడియా చానళ్ళు హైదరాబాద్ మీద తమ ఆశను.. తెలంగాణ ఉద్యమంపై తమ అక్కసును వెల్లగక్కుతున్నాయి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచి పధ్ధతి కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావలసిన మీడియా ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం సరికాదు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్కు అగ్నిపరీక్ష
ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...

No comments:
Post a Comment