Monday, 21 January 2013

ప్రజలకులేని బాధ ప్రసారమాధ్యమాలకు ఎందుకు?



సీమాంధ్ర  మీడియా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. అందుకే మెరుగైన సమాజం కోసం, ప్రతిక్షణం ప్రజాహితం వంటి ట్యాగ్ లైన్లను తగిలించుకున్న చానల్లు రాష్ట్ర విభజన బాధ సీమాంధ్ర ప్రజలది కాదు మాది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు పారదర్శకంగా ఉండాలనే పద్ధతికి తిలోదకాలు ఇచ్చాయి. తెలంగాణ పేరుతో...తెలంగాణ కోసం అన్నట్టు ప్రసారం చేసే కథనాల్లో తెలంగాణ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర విభజనపై చేసే ఏ  కార్యక్రమాన్ని చూసినా హైదరాబాద్ చుట్టే తిప్పుతాయి. నదీ  జలాల సమస్య తలెత్తుతాయి అంటాయి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనిపించని ఏ  సమస్య తెలంగాణ విషయంలో కనిపిస్తాయి. నదీ జలాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయో అవే రేపు తెలంగాణ  ఆంధ్ర రాష్ట్రాల మధ్య అమలవుతాయి. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినా కొంత మంది సీమాంధ్ర నేతలు. కొన్ని మీడియా చానళ్ళు హైదరాబాద్ మీద తమ ఆశను.. తెలంగాణ ఉద్యమంపై తమ అక్కసును వెల్లగక్కుతున్నాయి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇది మంచి పధ్ధతి కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావలసిన మీడియా ఇలా బాధ్యతా  రాహిత్యంగా వ్యవహరించడం సరికాదు.

 

No comments:

Post a Comment

Featured post

తీర రేఖ లెక్క మారింది!