మాకు (ఆంధ్రా ) సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము శాశిస్తాము.... మీరు
(తెలంగాణ) మా కింద పడి ఉండాలి అన్నట్టు సాగింది ఉండవల్లి రాజమండ్రి
ప్రసంగం. బలవంతునిదే రాజ్యం అన్నటు ఉన్నది మీ వ్యవహారం. అందుకే బ్రిటిష్
పాలనలో మగ్గిన మీరు ఇంకా వాళ్ళ విధానాలనే అవలంబిస్తున్నారు. అందుకే మీ
నల్లారి వారు ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగించాడు. మీ లగడపాటి, టీజీ
వెంకటేష్ లు డయ్యర్ ల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని రజాకార్ల తో
పోల్చాడు ఉండవెల్లి. మేము ఎంత శాంతికాముకులమో ఈ పండేళ్ళ ఉద్యమం చూసి
దేశంలోని ప్రజాస్వామికవాదులు ప్రశంసించారు. నీ లాంటి వాళ్ళ నుంచి కండక్ట్
సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీప్రాంతంలో మొన్న లక్షిం పేటలో
దళితులపై మీ పీసీసీ అధ్యక్షుని సామాజిక వర్గం చేసిన పాశవిక దాడిలో మరణించి
గాయపడిన వాళ్ళ గురించి అప్పుడే మరిచిపోయావా? తెలంగాణ కోసం అమరులైన వారి
గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ఉండవల్లి 369 మందిని కాల్చి
చంపించింది మీ బ్రమ్హానంద రెడ్డి కాదా? ఉస్మానియా యూనివర్సిటీ ని
మూసివేయాలి అన్న లగడపాటి ఎక్కడి వాడు? తెలంగాణ ఉద్యోగాలు దోపిడీకి
గురయ్యాయి అని మీ ఎన్టీ అర్ వేసిన కమిషన్ తేల్చింది. ఆ నష్టాన్ని
పూడ్చడానికి 610 జీవోను తెచ్చింది ఆయనే. ఆ జీవో వచ్చి మొన్నటికి 27 ఏళ్ళు
పూర్తీ అయినా ఎందుకు అమలు కాలేదు? దీనిపై ఎప్పుడైనా మాట్లాడవా ఊసరవెల్లి.
అంతెందుకు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లోని 234 మండలాలను కరువు ప్రాంత
మండలాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలోను తెలంగాణపై సీమాంధ్ర
సర్కారు వివక్ష చూపింది. తెలంగాణలోని రెండు జిల్లాల్లో పాలమూరులో ఐదు
మండలాలు, నల్లగొండలో 11 మండలాలు కలిపి 16 మండలాల్లో మాత్రమే కరువుందని
తేల్చింది. 218 మండలాల్లో సీమాంధ్రలో కరువుందని, అందులో ముఖ్యమంత్రి జిల్లా
చిత్తూరులో, రెవెన్యూమంత్రి రఘువీరాడ్డి జిల్లా అనంతపురంలో ఎక్కువ
కరువుందని సీమాంధ్ర సర్కారు తేల్చింది.ఈ వివక్షపై మాట్లాడలేదు ఆంధ్రా అరుణ్
కుమార్. పెట్టుబడి పెట్టి , పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు లేక తెలంగాణ
ప్రాంత రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో
ఎండిపోతుంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమరు మాత్రం సర్కార్ తీరును
తప్పుపట్టలేదు. కానీ మీ ప్రాంతంలో పంట వేయకుండానే క్రాప్ హాలిడే ప్రకటిస్తే
అదేదో జాతీయ విపత్తు అన్నటు తెగ హడావుడి చేసి ఒక కమిటీ వేసి, యుద్ధ
ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించారు ఇది కాదా వివక్ష? హక్కు లేకున్నా
నిబంధనలను కాలరాసి మొన్నటికి మొన్న డెల్టాకు ప్రాంతానికి నీళ్ళు తరలించుకు
పోయారు. ఆర్డీఎస్ రాజోలిబండ, తూములు కర్నూలు రైతులు బైరెడ్డి నాయకత్వాన
షట్టర్లు పగలగొట్టి నీటిని పాలమూరు వైపునకు రాకుండా సుంకేశులకు
మళ్ళించుకోలేదా?అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు అభివృద్ధి పై కాకి
లెక్కలు చెప్పి అదే అభివృద్ధి అంటే నమ్మేవాళ్ళు ఎవరు? తమకు సంఖ్యా బలం
ఉంది కాబట్టి మేము ఏమి చేసిన చెల్లు బాటు అవుతుంది అనే అహంకారం ఉండవల్లి
రాజమండ్రిలో ఆవేశంగా ప్రసంగించారు. అసత్యాలతో అభివృద్ధిపై పూటకో మాట
మాట్లాడుతున్నది మీరు. మీరు చెబుతున్న అభివృద్ధి సబబే అయితే వెనుకబడిన
ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలు ఇస్తే తమకు సమ్మతమే అని మీరు ఎందుకు
చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వెనుకబడింది మీ మాటలే తేటతెల్లం
చేస్తున్నాయి. అలాగే 2014 ఎన్నికల వరకే తెలంగాణ వాదం ఉంటుంది అన్న
ఉండవల్లి.. మూడేళ్ళ కిందట రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ ప్రక్రియను
అడ్డుకున్న మీ పెట్టుబడి సమైక్య ఉద్యమం ఏమైందో ప్రజలు గమనిస్తున్నారు.
అందుకే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
క్రమశిక్షణ అనే పదం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ముఖ్యంగా ఆంధ్రా నేతలకు అది
వర్తించదు. అందుకే తమ పార్టీలోని ఒక ప్రాంత ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి
సభ పెట్టుకుని దానికి జై ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్న దుర్బుద్ధి మీది.
తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అని కమ్యూనిస్టుల గురించి గొప్పలు చెప్పిన
ఉండవెల్లీ ... మీలాంటి ఊసరవెల్లి ఆంధ్రా పాలకుల ఆధిపత్య అహంకారం వల్లే
భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలి అన్న కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ
రాష్ట్ర విభజనపై మార్పు వచ్చింది . అధికారం కోసం టిడిపి, బిజెపి లు రాష్ట్ర
ప్రయోజనాలు పణంగా పెడుతున్నాయని చెప్పిన సత్తిబాబూ ..... మూడేళ్ళుగా
తెలంగాణపై తమరు ఎన్ని మాటలు మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు
పీసీసీ అధ్యక్షుడిని అని మరిచిపోయి ఒక ప్రాంత ప్రతినిధిగా రాజమండ్రి సభకు
హాజరు అయినప్పుడే పక్కోడికి నీతులు చెప్పే అర్హత కోల్పోయావు. వాళ్ళు
పిలిచారు వెళ్ళాను మీరు సభ పెట్టి పిలవండి మీ సభకు వస్తాను అంటున్న సత్తి
బాబుకు నీతి, నియమాలు లేకపోవచ్చు.. మాకు మాత్రం ఉన్నాయి. రాజమండ్రిలో
రాజకీయ ఉసరవెల్లుల ప్రసంగాలు బడిత ఉన్నవాడిదే బర్రె అన్నటు సాగాయి. అది జై
ఆంధ్రప్రదేశ్ సభ కాదు.. ఆధిపత్య అహంకారులు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షపై
అక్కసు వెళ్ళగక్కిన సభ.
No comments:
Post a Comment