బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు
హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి అక్రమాలను, పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకు బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, సీనియర్ నేత ఎన్. రామచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ టెండర్ల కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం , ఆయా పార్టీల విఫల విధానాలకు సంబంధించిన పక్కా వాస్తవాలు, అధికారిక గణాంకాలు, తిరుగులేని ఆధారాలతో ఇరు పార్టీల అసలు రంగును ప్రజల ముందు బట్టబయలు చేస్తామన్నారు. ఈ బహిరంగ వేదిక ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, త్వరలోనే ఈ చర్చా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment