Tuesday, 7 July 2026

ఏక్ పేడ్ మా కే నామ్



  • ఢిల్లీలో 70 లక్షల మొక్కల నాటే బృహత్తర మిషన్‌ను ప్రారంభించిన అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలో హరితహారాన్ని పెంచేందుకు 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఢిల్లీ పర్యావరణాన్ని మార్చడంలో ఈ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే నాలుగేళ్లలో 6,300 హెక్టార్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తి అటవీ భూమిగా అభివృద్ధి చేయాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయని మంత్రి తెలిపారు. యమునా నది ప్రక్షాళన కోసం గత ఏడాది కాలంలో 129 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP) అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి 300 ఎలక్ట్రికల్ బస్సులను, మూడు కొత్త బస్ డిపోలను ప్రారంభించడంతో పాటు నరేలాలో హై సెక్యూరిటీ జైలుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

అసలు ఎవరికి బుద్ధి ఉంది?

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కా...