Tuesday, 7 July 2026

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల 'డ్రగ్ ఫ్రీ క్యాంపస్' ప్రతిజ్ఞను అభినందించిన ఉపరాష్ట్రపతి



ఢిల్లీ విశ్వవిద్యాలయానికి (Delhi University) చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ క్యాంపస్‌ను డ్రగ్స్ రహితంగా మార్చుకుంటామని ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేయడం పట్ల ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన, బలమైన , సంపన్నమైన భారతదేశ నిర్మాణానికి యువత చూపిన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ చొరవను స్ఫూర్తిగా తీసుకుని, విద్యార్థులను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేలా 'నషా ముక్త్ భారత్' (వ్యసన రహిత భారత్) ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.


No comments:

Post a Comment

Featured post

అసలు ఎవరికి బుద్ధి ఉంది?

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కా...