Tuesday, 7 July 2026

కాళేశ్వరం ప్రాజెక్టుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం



కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో నిపుణులైన ఇంజినీర్ల మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే నేడు కాళేశ్వరం కాస్తా "కూళేశ్వరం"గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై, లోపాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే వారి అంత మంచిదని ఆయన హితవు పలికారు.

No comments:

Post a Comment