Tuesday, 7 July 2026

రాబోయే మూడు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌లలో విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు



నైరుతి రుతుపవనాలు రాబోయే మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ తో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ రోజు కోస్టల్ కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే దిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణ , కర్ణాటకలలో పిడుగులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, ఈ మధ్యాహ్నం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి జల్లులు ఉక్కపోత నుండి ఉపశమనాన్ని ఇచ్చాయి.


No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...