నైరుతి రుతుపవనాలు రాబోయే మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ తో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ రోజు కోస్టల్ కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే దిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణ , కర్ణాటకలలో పిడుగులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, ఈ మధ్యాహ్నం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి జల్లులు ఉక్కపోత నుండి ఉపశమనాన్ని ఇచ్చాయి.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
దూరదర్శన్ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత
న్యూఢిల్లీ: దూరదర్శన్ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment