ముంచెత్తుతున్న భారీ వర్షాలు..
నదుల్లో హెచ్చరిక స్థాయికి చేరిన నీటిమట్టం
రుద్రప్రయాగ (ఉత్తరాఖండ్):ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ జిల్లాలో నదుల నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా అలకనంద, మందాకిని నదుల ప్రవాహం హెచ్చరిక స్థాయికి (Warning Mark) చేరుకోవడంతో జిల్లా విపత్తు నిర్వహణ అధికారి (DDMO) నందన్ సింగ్ రజ్వార్ నేతృత్వంలో అప్రమత్తత వ్యవస్థను (Alert System) యాక్టివేట్ చేశారు. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , స్థానిక పోలీసు యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ను నిరంతరం అందుబాటులో ఉంచామని, స్థానికులు, యాత్రికులు ఎవరూ నదుల పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
No comments:
Post a Comment