- అడ్వొకేట్ నమోదుపై బీసీఐ ఆంక్షలు ఎత్తివేత
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 బ్యాచ్ న్యాయ పట్టభద్రుల అడ్వొకేట్ నమోదుపై విధించిన ఆంక్షలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గురువారం సవరించింది. ఇకపై నల్సార్ 2026 బ్యాచ్లోని విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వొకేట్గా నమోదు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది.
నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీఐ తొలుత నమోదుపై ఆంక్షలు విధించింది. అయితే 2026 బ్యాచ్లోని అత్యధిక మంది విద్యార్థులు ఎలాంటి తప్పు చేయలేదని, వివాదాస్పద చర్యల్లో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని తాజా నివేదికలో తేలడంతో బీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది.
‘‘ఏ విద్యార్థి చేసిన తప్పుకు సంబంధం లేకుండా అతడు నష్టపోకూడదు’’ అని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సంతకంతో విడుదల చేసిన ఆగస్టు 13 నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నల్సార్ విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో నమోదు ప్రక్రియను కొనసాగించవచ్చు.
అయితే స్నాతకోత్సవ వివాదంపై విచారణను బీసీఐ కొనసాగించనుంది. నల్సార్ వైస్ ఛాన్సలర్ నుంచి వాస్తవ పరిస్థితులపై నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు అవసరమా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కొంతమంది ఉపాధ్యాయులు, బయటి వ్యక్తులు విద్యార్థులను ప్రేరేపించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందని బీసీఐ పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం విచారణ నివేదిక వచ్చిన తర్వాతే తీసుకోనుంది.
No comments:
Post a Comment