Thursday, 6 August 2026

అప్రోప్రియేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్



  • రూ.54 వేల కోట్ల అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం


2026 అప్రోప్రియేషన్ (నెం.3) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ కూడా ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులను మించి జరిగిన ఖర్చులకు భారత సమీకృత నిధి నుంచి నిధులు వినియోగించేందుకు ఈ బిల్లు అనుమతి ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.54 వేల కోట్లకు పైగా అదనపు నిధులను కోరింది. ఇందులో రైల్వే శాఖకు సంబంధించిన రూ.196 కోట్ల అదనపు వ్యయంతో పాటు రూ.53,871 కోట్ల రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ అదనపు వ్యయాలను ప్రజా లెక్కల సంఘం నివేదిక ఆధారంగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చామని ఆమె వివరించారు.



No comments:

Post a Comment

Featured post

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానిక...