- సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ద్వైపాక్షిక సంబంధాలు
- 2030 నాటికి వాణిజ్యం 5 బిలియన్ డాలర్లకు లక్ష్యం
- ఉజ్బెకిస్తాన్లో యూపీఐ సేవల విస్తరణ.. కీలక ఖనిజాలపై సహకారం
తాష్కెంట్: భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సిబి జార్జ్ చెప్పారు. ఈ లక్ష్య సాధనకు వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
- ఉజ్బెకిస్తాన్లో యూపీఐ సేవలు
ఉజ్బెకిస్తాన్లో యూపీఐ సేవల ప్రారంభం మరో కీలక పరిణామమని సిబి జార్జ్ పేర్కొన్నారు. భారత డిజిటల్ మౌలిక సదుపాయాల అంతర్జాతీయ విస్తరణలో ఇది మరో ముందడుగని, ఇరు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేస్తుందని వివరించారు.
- కీలక ఖనిజాలపై ఒప్పందం
మైనింగ్ రంగంలో సహకారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిందని తెలిపారు. ముఖ్యంగా యురేనియం సహా కీలక ఖనిజాల సరఫరా, అన్వేషణలో సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు.మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా భారత్-ఉజ్బెకిస్తాన్ సహకారంలో కీలక రంగంగా మారుతోందని సిబి జార్జ్ తెలిపారు. ఇప్పటికే పలు భారతీయ కంపెనీలు ఉజ్బెకిస్తాన్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వెల్లడించారు.
No comments:
Post a Comment