నేపాల్లో వరద బీభత్సం..
కాఠ్మాండు, ఆగస్టు 26: టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో దాదాపు 400 మంది గల్లంతవగా.. వారిలో 105 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
వరదల ధాటికి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో గల్లంతైన వారి కోసం భారీ స్థాయిలో గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.
టిబెట్ వైపు నుంచి వచ్చిన వరద నీరు ఉదయం 9 గంటల సమయంలో భోటేకోశి నదిలో ఒక్కసారిగా ఉప్పొంగినట్లు అధికారులు తెలిపారు. దీంతో టిబెట్ సరిహద్దులోని రసువా, ధాదింగ్ జిల్లాలతో పాటు కాఠ్మాండు నైరుతి దిశలో ఉన్న నువాకోట్ జిల్లాలోనూ భారీ నష్టం వాటిల్లింది.