నేపాల్లో భారీ వరదల కారణంగా కేరళకు చెందిన 37 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరంతా సురక్షితంగానే ఉన్నారని, ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నారని పయ్యన్నూర్ ఎమ్మెల్యే వి. కుంహికృష్ణన్ తెలిపారు.
తమ నియోజకవర్గానికి చెందిన పర్యాటకులు నేపాల్లో చిక్కుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన ఫేస్బుక్ పోస్టులో వెల్లడించారు. పర్యాటకుల ప్రస్తుత ప్రదేశాలు, ఫోన్ నంబర్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించినట్లు తెలిపారు.
వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం కార్యాలయం హామీ ఇచ్చిందన్నారు. పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రయాణానికి వెళ్లిన మొత్తం 37 మందితో మాట్లాడగలిగామని చెప్పారు.
వరదల నేపథ్యంలో నేపాల్లో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ పర్యాటకుల భద్రత, త్వరితగతిన తరలింపునకు చర్యలు తీసుకోవాలని సీఎం సతీశన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
No comments:
Post a Comment