- ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్ అన్వర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సుమారు 15 నిమిషాలుగా ఎండలో నిలబడి ఉండటంతో ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారని తెలిపారు. ఖర్గే ఎక్కువసేపు నిలబడటం వల్ల అస్వస్థతకు గురికాకుండా చూడాలన్నదే సోనియా గాంధీ ఉద్దేశమని తారిఖ్ అన్వర్ చెప్పారు. దీనిని వందేమాతరం ఆలాపనతో ముడిపెట్టి వివాదంగా మార్చడం అనవసరమని వ్యాఖ్యానించారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వివాదం సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ప్రతి అంశాన్ని రాజకీయ వివాదంగా మలచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాస్తవానికి ఖర్గే ఎండలో కుప్పకూలకుండా చూడటానికే కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా కోరారని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment