నేడు ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు, ఉరుములు
జమ్మూకశ్మీర్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్లో పిడుగుల ముప్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్, తూర్పు మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్తోపాటు ఈశాన్య ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
జమ్మూకశ్మీర్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్–నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
No comments:
Post a Comment