అమరావతి: వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీతో తనకు సంబంధం లేకపోతే తనపై కేసులు ఎందుకు పెట్టడం లేదంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారని, అయితే చంద్రబాబు ప్రభుత్వం పెట్టినట్లు తాను ఆరోపిస్తున్న లిక్కర్ కేసులో వైసీపీ నేతలంతా అరెస్టయితే విజయసాయిరెడ్డి మాత్రం ఎలా తప్పించుకున్నారని సజ్జల ప్రశ్నించారు. ఆయనకు టీడీపీతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని నిలదీశారు.
జగన్ వల్లే విజయసాయిరెడ్డి గురించి నలుగురికీ తెలిసిందని సజ్జల అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి సాయిరెడ్డి ఇబ్బందులు పడ్డారన్న సానుభూతితో జగన్ ఆయనపై మిగిలినవారికంటే కొంత ఎక్కువ అభిమానాన్ని చూపించారని పేర్కొన్నారు. జగన్ తనకు ఇచ్చిన పదవులన్నీ తన ప్రతిభ వల్లే వచ్చాయని సాయిరెడ్డి భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
సాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టుకోవాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆ పార్టీ ప్రచారం కోసం వైసీపీ, జగన్పై విమర్శలు చేస్తే సహించేది లేదని సజ్జల స్పష్టం చేశారు. ఇలాంటి విమర్శల వల్ల జగన్కు ఎలాంటి నష్టం లేదన్నారు.
No comments:
Post a Comment