Monday, 24 August 2026

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 



హైదరాబాద్‌: తన అమెరికా పర్యటన రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అవసరమైన భద్రత కల్పించడంతో పాటు, రాష్ట్రంలో వారికి లాభదాయకమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశమైనా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకుంటే స్వాగతిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తాం. పెట్టుబడులను కాపాడుతూ.. తెలంగాణ నుంచి వారికి లాభాలు వచ్చేలా చూస్తాం. ఇది చాలా సులభమైన విషయం’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తాను అమెరికా పర్యటనకు వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. ‘‘తెలంగాణను ప్రమోట్‌ చేసేందుకు నేను అమెరికా వెళ్లకుండా నరేంద్ర మోడీ అడ్డుకోవడానికి ఉన్న ఏకైక రాజకీయ కారణం ఇదే’’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...