- ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనలో ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం "యూత్ డిక్లరేషన్" పేరుతో యువతను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో సుమారు 20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగే యువతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను "క్రిమినల్ వేస్ట్"గా అభివర్ణించడం దురదృష్టకరమని పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన 24 హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనా వ్యక్తిగత విమర్శలు చేశారు. సీఎం విద్యార్హతలు, సామర్థ్యంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
No comments:
Post a Comment